ఈ రోజు విశేషం
1973 'సీతా ఔర్ గీతా' రీమేక్ 'గంగ మంగ'లో వాణిశ్రీ రెండు పాత్రల్లో నటించి మెప్పించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1923 రామ్గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
- 1973 'సీతా ఔర్ గీతా' రీమేక్ 'గంగ మంగ'లో వాణిశ్రీ రెండు పాత్రల్లో నటించి మెప్పించారు. పూర్తి ప్రస్థానం →
- 2004 టీవీ9 తెలుగు ప్రసారాలు (ఛానెల్) మొదలు అయ్యాయి. తేది వివరాలు తెలియవు.
- 2015 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 630 ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు.
- 1651 స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.
- 1707 పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.
- 1804 హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
- 1818 బీమా కోరేగావ్ తిరుగుబాటు (యుద్ధం) జరిగింది.
- 1877 ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు. భారత్
- 1877 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది. భారత్
- 1899 క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది. భారత్
- 1906 బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు. భారత్
- 1925 అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.
- 1939 బిల్ హెవ్లెట్, డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు.
- 1948 విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది. భారత్
- 1953 విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
- 1956 సూడాన్ స్వాతంత్ర్యం పొందింది. భారత్
- 1958 యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
- 1960 కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది. భారత్
- 1971 అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది.
- 1972 మణిపూర్ రాష్ట్రం అవతరించింది.
- 1973 ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్
- 1978 ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది. భారత్
- 1981 గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
- 1984 బ్రూనై స్వాతంత్ర్యం పొందింది. భారత్
- 1985 ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
- 1986 సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
- 1993 చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
- 1994 ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
- 1995 GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
- 1998 యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
- 1999 యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
- 2002 ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
- 2006 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
- 2007 ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
- 2024 కృష్ణబిలాలు, ఎక్స్-రే ధ్రువణ అధ్యయనానికి ఇస్రో ఎక్స్పోశాట్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-డీఎల్ ద్వారా ప్రయోగించింది. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1766 మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845).
- 1840 బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900).
- 1888 అమ్జద్ హైదరాబాదీ; తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 1961).
- 1890 నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, టంగుటూరి ప్రకాశం పంతులు అనుయాయి. (మ.1978). భారత్
- 1892 మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942). భారత్
- 1894 సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త.
- 1902 బస్టర్ నుపెన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (మ.1977).
- 1905 లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు. భారత్
- 1908 లీలా మిశ్రా, హిందీ చలనచిత్ర నటి. (మ.1988). భారత్
- 1909 చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996).
- 1909 దత్తారం హింద్లేకర్, టెస్ట్ క్రికెట్లో భారతదేశం తరపున వికెట్ కీపింగ్ చేసిన క్రికెటర్. (మ.1949). భారత్
- 1911 ఎల్లాప్రగడ సీతాకుమారి, కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
- 1920 మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997).
- 1928 మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974).
- 1928 అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్కు చెందిన సంఘసేవకుడు, దాత. (మ.2016).
- 1929 ముకురాల రామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.2003).
- 1938 గణపతి తనికైమోని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986). భారత్
- 1938 తిరుమల శ్రీనివాసాచార్య, గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత.
- 1939 సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు.
- 1941 భోలేకర్ శ్రీహరి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి. (మ.2018).
- 1942 సూర్యకళ, పాతతరం తెలుగు చలన చిత్ర నటి.పలు దక్షిణాది భాషల్లో కూడా నటించిన నటి (మ.2014).
- 1943 రఘునాథ్ అనంత్ మషెల్కర్, భారతీయ శాస్త్రవేత్త. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. భారత్
- 1946 బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. భారత్
- 1946 పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి 14వ లోక్సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- 1948 షేక్ బడేసాహెబ్ తెలుగు రచయిత.
- 1948 మంచాల సూర్యనారాయణ, తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. (మ.2020).
- 1948 ఫగు చౌహాన్, మేఘాలయా గవర్నర్.
- 1951 వేణు సంకోజు, కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు.
- 1951 అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి.
- 1952 నానా పటేకర్, నటుడు.
- 1952 గౌరీ శంకర్ బైసెన్, రాజకీయ నాయకుడు. లోక్సభ సభ్యుడు. భారత్
- 1953 సల్మాన్ ఖుర్షీద్, మాజీ కేంద్రమంత్రి.
- 1954 శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. భారత్
- 1954 తారాచంద్ భగోరా, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. లోక్సభ సభ్యుడు. భారత్
- 1959 శుభా ముద్గల్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో భారతీయ గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్
- 1961 దుర్గాప్రసాద్ ఓజా, భౌతిక శాస్త్రవేత్త.
- 1961 ఎన్ బీరెన్ సింగ్, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
- 1962 మారొజు వీరన్న, తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999).
- 1963 అబ్దుల్ హకీం జాని షేక్ - బాలసాహితీవేత్త.
- 1966 వద్దిపర్తి పద్మాకర్, పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.
- 1970 ఊహా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల నటి.
- 1971 కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016). భారత్
- 1971 జ్యోతిరాదిత్య సింధియా, రాజకీయ నాయకుడు, కేంద్ర మంత్రి.
- 1974 కట్టా శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
- 1978 విద్యా బాలన్, హిందీ నటి. భారత్
- 1978 ఉజ్మా గొండాల్, పాకిస్తాన్ వికెట్ కీపర్, మాజీ క్రికెటర్.
- 1978 పరమహంస శ్రీ నిత్యానందా.
- 1979 డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు. భారత్
- 1980 మాలోతు కవిత, ఎంపీ (మహబూబాబాద్), మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
- 1980 సానా యాదిరెడ్డి, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
- 1980 తేజస్విని కొల్హాపురే, భారతీయ నటి, మోడల్. భారత్
- 1981 అస్మా ఫర్జాంద్, పాకిస్థాన్ మాజీ మహిళా క్రికెటర్, వికెట్ కీపర్.
- 1982 ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె. భారత్
- 1984 సయాలి భగత్, చలన చిత్ర నటి.
- 1987 గియా కొప్పోలా, అమెరికన్ సినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత.
- 1990 సోనాలి బెంద్రే, హిందీ, మరాఠీ, దక్షిణ భారత నటి, మోడల్. భారత్
- 1991 శుభ్ర అయ్యప్ప, తెలుగు, తమిళ, కన్నడ, చిత్రాల నటి.
- 1992 డేన్ క్లీవర్, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
మరణాలు
- 1748 జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.
- 1775 అహమ్మద్ షా బహదూర్, 13వ మొఘల్ చక్రవర్తి. (జ.1725).
- 1782 జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు.
- 1894 హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857).
- 1896 విలియం డౌన్స్, న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. (జ.1843).
- 1940 పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865).
- 1955 శాంతిస్వరూప్ భట్నాగర్, రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును ఏర్పాటు చేసారు.
- 1964 శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888).
- 1964 ఆల్ఫ్రెడ్ ఎవార్ట్ హాల్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1896).
- 1968 వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత.
- 1994 చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. (జ.1915).
- 1995 యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త.
- 2001 ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920).
- 2007 డూండీ, తెలుగు సినిమా నిర్మాత.
- 2007 టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912).
- 2008 ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి. భారత్
- 2009 కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవి. (జ.1947).
సినిమా
- 1965 'సుమంగళి' చిత్రం విడుదలైంది.
- 1969 'మూగ నోము' చిత్రం విడుదలైంది.
- 1973 'గంగ మంగ' చిత్రం విడుదలైంది.
- 1987 'ఆత్మ బంధువులు' చిత్రం విడుదలైంది.
- 1988 'సంసారం' చిత్రం విడుదలైంది.
- 1992 'లాఠీ' చిత్రం విడుదలైంది.
- 2016 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం విడుదలైంది.
- 2022 'దిశ ఎన్కౌంటర్' చిత్రం విడుదలైంది.
- 2026 'సైక్_సిద్ధార్థ' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు.
- రహదారి భద్రతా దినోత్సవం.
- అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం.
- సైనిక వైద్య విభాగ స్థాపక దినోత్సవం.
- గ్లోబల్ ఫ్యామిలీ డే.