జనవరి 11 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్పోర్ట్ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.
మే 5 అమెరికా, ఎన్వెటక్ అనే చోట, వాతావరణంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.
మే 11 అమెరికా బికినీ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
మే 15 నటుడు శోభన్ బాబు వివాహం శాంతకుమారితో జరిగింది.
జూన్ 8 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యాయి.
జూలై 24 మూడవ ఆసియా క్రీడలు జపాన్ రాజధాని నగరం టోక్యోలో ప్రారంభమయ్యాయి.
ఆగస్టు 3 మొదటి అణు జలాంతర్గామి పేరు నాటిలస్ అమెరికాకు చెందినది. ఇది మొదటిసారిగా, ఆర్కిటిక్ మహాసముద్రం నీటి అడుగునుంచి (నీటి లోపలి నుంచి), ప్రయాణం చేసి, ఉత్తర దృవాన్ని, దాటింది.
ఆగస్టు 10 యు.ఎస్.ఎస్. స్కేట్ అమెరికా యొక్క మూడవ అణు జలాంతర్గామి. ఇది, ట్రాన్స్-అట్లాంటిక్ (అట్లాంటిక్ మహాసముద్రం అవతల నుంచి ఇవతల వరకు) దాటింది. ఉత్తర ధృవం చేరిన రెండవ అణు జలాంతర్గామి. ఉత్తర ధృవం సముద్ర జలాల నుంచి పైకి వచ్చిన మొదటి అణు జలాంతర్గామి.
ఆగస్టు 29 యునైటెడ్ స్టేట్స్ఏయిర్ ఫోర్స్ అకాడెమీని, కొలరాడో లోని కొలరాడొ స్ప్రింగ్స్ అనే చోట ప్రారంభించారు.
అక్టోబరు 1 భారతదేశంలో మెట్రిక్ (దశాంశ) పద్ధతిని, బరువుల కొలతల కోసం ప్రవేశ పెట్టారు.
భారత్
డిసెంబరు 12 కె.వి.రెడ్డి సొంత సంస్థ జయంతి పిక్చర్స్ తొలి చిత్రం పెళ్ళినాటి ప్రమాణాలు విడుదలైంది.
డిసెంబరు 17 సహజనటి జయసుధ (అసలు పేరు సుజాత) మద్రాసులో తెలుగు కుటుంబంలో జన్మించారు.
ఆగస్టు 16 మడొన్నా (మడొన్నా లూయీ సిక్కోన్). అమెరికన్ నటి, పాటగత్తె, పాటల రచయిత్రి.
ఆగస్టు 18 కొత్తకోట దయాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే (మ. 2023).
ఆగస్టు 29 మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (మ.2009).
ఆగస్టు 30 పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (మ.2005).
సెప్టెంబరు 14 గరికపాటి నరసింహారావు, తెలుగు రచయిత, అవధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత.
సెప్టెంబరు 27 సుజన్ ఆర్. చినోయ్, మాజీ భారత దౌత్యవేత్త ప్రస్తుత మనోహర్ పారికర్ ఇనిస్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు.
భారత్