ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 12 శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది.
  • మార్చి 9 స్పుత్నిక్ 9 ఉపగ్రహాన్ని ప్రయోగించిన రష్యా.
  • ఏప్రిల్ 12 రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ Vostok 3KA-2 (Vostok 1) ఉపగ్రహంలో ప్రయాణించి మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మానవునిగా నిలిచాడు.
  • ఏప్రిల్ 27 సియర్రా లియోన్ దేశానికి స్వతంత్రం లభించింది.
  • మే 2 బీబన్ కిడ్రాన్.
  • మే 5 అలన్ షెపర్డ్, మొదటి అమెరికన్ రోదసీ యాత్రికుడు (రోదసీ నౌక పేరు: ఫ్రీడం 7).
  • మే 11 హైదరాబాదులో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభించబడింది.
  • మే 24 అమెరికా పంపిన 'ఎక్స్‌ప్లోరర్ (12) ' ఉపగ్రహం భూకక్ష్యను చేరలేక, పడిపోయింది.
  • జూలై 4 సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో శివశక్తి దత్తాకు జన్మించారు.
  • జూలై 12 పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
  • జూలై 21 మెర్క్యురీ 4 (మెర్క్యురీ - రెడ్‌స్టోన్ 4 మిషన్) అనే రోదసీ నౌకను (లిబర్టీ బెల్ 7) గుస్ గ్రిస్సాం (రోదసీ యాత్రికుడు) తో అమెరికా ఆకాశంలోకి పంపింది. ఇతడు రోదసీలోకి వెళ్ళిన రెండవ అమెరికన్( సబ్-ఆర్బిటల్ మిషన్ అంటే రోదసీ లోనే తక్కువ ఎత్తులో, కక్ష్యలో, ప్రయాణించటం). (మెర్క్యురీ ప్రోగ్రాం).
  • జూలై 29 ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన తమిళ చిత్రం కుముదం విడుదలై జాతీయ స్థాయి గుర్తింపు పొందింది.
  • ఆగస్టు 6 రష్యా వ్యోమగామి (కాస్మోనాట్) మేజర్ ఘెర్మన్ టితోవ్ రోదసీలో ఒక రోజు (24 గంటలు) గడిపి, ప్రపంచాన్ని, ఆశ్చర్యంలో, ముంచాడు.
  • ఆగస్టు 9 కె.వి.రెడ్డి దర్శకత్వంలో వచ్చిన జానపద చిత్రం జగదేకవీరుని కథ విడుదలై విజయం సాధించింది.
  • ఆగస్టు 10 అమెరికా సైన్యం మొట్టమొదటిసారిగా వియత్నాం దక్షిణ ప్రాంతంలో ఏజెంట్‌ ఆరెంజ్‌(ఎఒ)/ డయాక్సిన్ను చల్లడం ప్రారంభించి, 1971 మధ్య కాలానికి, నాల్గింట ఒక వంతు భూభాగంలో 61 శాతం విషపూరిత రసాయనాలు, 366 కిలోల డయాక్సిన్‌తో ఉన్న సుమారు ఎనిమిది కోట్ల లీటర్ల ఏజెంట్ ఆరంజ్ ను చల్లింది. దక్షిణ వియత్నాం పర్యావరణ వ్యవస్థను నాశనం చేసి, 48 లక్షల మంది వియత్నామీయులు ఏజెంట్ ఆరెంజ్ బారిన పడేలా చేసింది. ఆ దుష్ఫలితాలు రెండవ, మూడవ తరాలవారితో సహా సుమారు 30 లక్షల మంది ఇప్పటికీ బాధపడుతున్నారు.
  • ఆగస్టు 13 బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.
  • ఆగస్టు 15 తూర్పు జర్మనీలో బెర్లిన్ గోడ కట్టటం మొదలైంది. జర్మనీ ప్రజలకు చీకటి రోజు.
  • సెప్టెంబరు 1 మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైనది.
  • అక్టోబరు 2 బొంబాయిలో (నేటి ముంబై) షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. భారత్
  • అక్టోబరు 27 అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటిక్స్, స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
  • డిసెంబరు 19 భారత సైనిక దళాలు పోర్చుగీసు పాలన నుండి, గోవాను విముక్తి చేసాయి. భారత్

జననాలు

  • జనవరి 1 దుర్గాప్రసాద్ ఓజా, భౌతిక శాస్త్రవేత్త.
  • జనవరి 1 ఎన్ బీరెన్ సింగ్, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి.
  • జనవరి 26 మల్లేశ్ బలష్టు, కవి, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినీ నటుడు.
  • ఫిబ్రవరి 1 నాగసూరి వేణుగోపాల్, సైన్సు రచయిత, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, హేతువాది.
  • ఫిబ్రవరి 15 అంగర రామమోహన్, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ సభ్యుడు.
  • ఫిబ్రవరి 21 అభిజిత్ బెనర్జీ, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. భారత్
  • ఏప్రిల్ 3 ఎడీ మర్ఫీ, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, నిర్మాత, గాయకుడు.
  • మే 15 మీరా అగర్వాల్, రాజకీయ నాయకురాలు.
  • మే 21 రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (మ.2015).
  • మే 23 ప్రభ, తెలుగు చలన చిత్ర నటి, కూచిపూడి నర్తకి.
  • జూన్ 2 యలమంచిలి సుజనా చౌదరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీ నాయకుడు.
  • జూన్ 5 రమేశ్ కృష్ణన్, భారత టెన్నిస్ క్రీడాకారుడు. భారత్
  • జూన్ 12 కిరా రోస్స్లర్, అమెరికన్ సంగీతకారిణి.
  • జూలై 1 ప్రిన్సెస్ డయానా (వేల్స్ యువరాజు ఛార్లెస్ భార్య), నార్ ఫ్లోక్ (ఇంగ్లాండు) లోని సాండ్రిన్గాం(మ.1997).
  • జూలై 4 ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.
  • జూలై 4 జోగు రామన్న, తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.
  • జూలై 18 అందెశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన తెలుగు కవి, సినీగేయ రచయిత.
  • జూలై 21 అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు.(మ.1988). భారత్
  • ఆగస్టు 4 అమెరికా 44వ అధ్యక్షుడు () బరాక్ ఒబామా, హవాయి ద్వీపం లో పుట్టాడు.
  • ఆగస్టు 10 సునీల్ శెట్టి , హిందీ, కన్నడ, మరాఠి, తెలుగు,తమిళ, మలయాళ నటుడు.
  • ఆగస్టు 15 సుహాసిని, దక్షిణ భారత సినిమా నటి. భారత్
  • ఆగస్టు 15 పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటుడు, దర్శకుడు, నిర్వాహకుడు. (మ.2015).
  • ఆగస్టు 17 అనామిక, హిందీ నవలా రచయిత్రి, కవయిత్రి. భారత్
  • ఆగస్టు 25 బిల్లీ రే సైరస్, అమెరికా సంగీత గాయకుడు, గీత రచయిత, నటుడు.
  • ఆగస్టు 29 నాగబాబు, తెలుగు చిత్రసీమ నటుడు , నిర్మాత.
  • సెప్టెంబరు 9 సీమా ప్రకాశ్ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త. టిష్యూకల్చర్‌లో నిపుణురాలు.
  • సెప్టెంబరు 15 పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
  • సెప్టెంబరు 24 కుడుముల పద్మశ్రీ, నెల్లూరు లోక్‌సభ సభ్యుడు.
  • సెప్టెంబరు 27 మాథ్యూ టి. థామస్, భారతీయ రాజకీయవేత్త ఇంకా శాసనసభ సభ్యుడు. భారత్
  • సెప్టెంబరు 30 చంద్రకాంత్ పండిత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
  • అక్టోబరు 1 నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.మాట్రిక్స్‌ ప్రసాద్‌ అంటారు.
  • అక్టోబరు 2 సోలిపేట రామలింగారెడ్డి, పాత్రికేయుడు, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ.2020).
  • అక్టోబరు 11 నిమ్మగడ్డ ప్రసాద్, ఫార్మా మాట్రిక్స్‌ ఫార్మా సంస్థ అధిపతి, వాన్‌పిక్‌ నిర్మాణ కాంట్రాక్టర్, వ్యాపారవేత్త.
  • అక్టోబరు 29 కొణిదల నాగేంద్రబాబు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత.
  • నవంబరు 17 చందా కొచ్చర్, ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకుకు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా, నిర్వహణ అధ్యక్షురాలు.
  • నవంబరు 24 అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి. భారత్

మరణాలు

  • జనవరి 31 అమ్జద్ హైదరాబాదీ; తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (జ. 1888).
  • ఫిబ్రవరి 5 వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (జ.1915).
  • ఫిబ్రవరి 16 వాసిరెడ్డి శ్రీకృష్ణ, ఆర్థిక శాస్త్రవేత్త, విశ్వవిద్యాలయ సంచాలకులు. (జ.1902).
  • ఫిబ్రవరి 25 శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, రచయిత.
  • మార్చి 17 నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు, సంపాదకులు, స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త. (జ.1881). భారత్
  • ఏప్రిల్ 15 రాచాబత్తుని సూర్యనారాయణ, సాతంత్ర్యసమయోధుడు. (జ.1903).
  • మే 19 రాప్తాటి సుబ్బదాసు, కవి, రచయిత.
  • జూన్ 1 మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).
  • జూన్ 14 కె శ్రీనివాస కృష్ణన్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త. పద్మభూషణ్ గ్రహీత. (జ.1898). భారత్
  • జూన్ 30 లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873).
  • జూలై 2 హెమింగ్వే, సాహిత్యములో నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1899).
  • అక్టోబరు 2 శ్రీరంగం నారాయణబాబు, తెలుగు కవి. (జ.1906).

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు