జనవరి 1 సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
ఫిబ్రవరి 1 జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
ఫిబ్రవరి 19 సోవియట్ యూనియన్ (నేటి రష్యా) 'మీర్' అనే రోదసీ కేంద్రం (స్టేషను) ని రోదసీలోకి పంపింది.
ఏప్రిల్ 3 నటుడు రావు గోపాలరావు రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఏప్రిల్ 9 ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు; తరువాత దానికి ఆయన పేరే పెట్టారు.
ఏప్రిల్ 26 అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
ఏప్రిల్ 30 ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
భారత్
మే 2 రష్యాలోని చెర్నోబిల్ అణు రియాక్టరు నుంచి ప్రమాదవశాత్తు బయటపడిన అణుధార్మికత (రేడియేషన్) ఫ్రాన్స్, బ్రిటన్ లకు పాకింది.
మే 3 శ్రీలంకలో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.
మే 12 అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
మే 14 నాజీ ల పాలనలో క్షణక్షణం అనుభవించిన, భయంకరమైన, బాధాకరమైన రోజులను 'అన్నే ఫ్రాంక్' అనేబాలిక రాసిన దినచర్య పుస్తకం'అన్నే ఫ్రాంక్ డైరీ' ని 'ఇన్స్టిట్యూట్ ఫర్ వార్ డాక్యుమెంట్స్' పూర్తిగా ప్రచురించింది.
మే 26 యూరోపియన్ పతాకం ను యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది.
మే 31 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
జూలై 6 పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.
ఆగస్టు 29 బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు.
అక్టోబరు 19 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య కన్నుమూశారు.
నవంబరు 15 ప్రఖ్యాత భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ముంబైలో జన్మించింది; కొద్దికాలానికే ఆమె కుటుంబం హైదరాబాద్కు తరలివెళ్లింది.
నవంబరు 23 అక్కినేని నాగార్జున కుమారుడు, నటుడు నాగ చైతన్య జన్మించాడు.
డిసెంబరు 20 భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్లాల్ భగవతి పదవీ విరమణ.
భారత్
డిసెంబరు 24 పార్లమెంటు ఆమోదించిన 'వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
భారత్