ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
  • ఫిబ్రవరి 1 జనరల్ కె.సుందర్జీ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్
  • ఫిబ్రవరి 19 సోవియట్ యూనియన్ (నేటి రష్యా) 'మీర్' అనే రోదసీ కేంద్రం (స్టేషను) ని రోదసీలోకి పంపింది.
  • ఏప్రిల్ 3 నటుడు రావు గోపాలరావు రాజ్యసభ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు.
  • ఏప్రిల్ 9 ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు; తరువాత దానికి ఆయన పేరే పెట్టారు.
  • ఏప్రిల్ 26 అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.
  • ఏప్రిల్ 30 ఐ.ఎన్.ఎస్. సింధుఘోష్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు. భారత్
  • మే 2 రష్యాలోని చెర్నోబిల్ అణు రియాక్టరు నుంచి ప్రమాదవశాత్తు బయటపడిన అణుధార్మికత (రేడియేషన్) ఫ్రాన్స్, బ్రిటన్ లకు పాకింది.
  • మే 3 ‍శ్రీలంకలో బాంబు పేలుడు వలన 21మంది మరణించారు.
  • మే 12 అమెరికాకు చెందిన 'ఫ్రెడ్ మార్ఖం' తన రెండుచక్రాల సైకిలు పై, గంటకు 65 మైళ్ళ (104.607 కి.మీ) వేగం సాధించాడు.
  • మే 14 నాజీ ల పాలనలో క్షణక్షణం అనుభవించిన, భయంకరమైన, బాధాకరమైన రోజులను 'అన్నే ఫ్రాంక్' అనేబాలిక రాసిన దినచర్య పుస్తకం'అన్నే ఫ్రాంక్ డైరీ' ని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ వార్ డాక్యుమెంట్స్' పూర్తిగా ప్రచురించింది.
  • మే 26 యూరోపియన్ పతాకం ను యూరోపియన్ కమ్యూనిటీ ఆమోదించింది.
  • మే 31 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
  • జూలై 6 పిలిప్పైన్స్ లోని మార్కోస్ అనుకూలురు చేసిన కుట్ర విఫలమయ్యింది.
  • ఆగస్టు 29 బ్రిటన్ లోని కవలలు తమ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. 70 కోట్లమందిలో ఒక్కరికే ఇటువంటి అవకాశం ఉంటుంది. వీడియో చూడటానికి ఇక్కడ నొక్కు.
  • అక్టోబరు 19 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్య కన్నుమూశారు.
  • నవంబరు 15 ప్రఖ్యాత భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ముంబైలో జన్మించింది; కొద్దికాలానికే ఆమె కుటుంబం హైదరాబాద్‌కు తరలివెళ్లింది.
  • నవంబరు 23 అక్కినేని నాగార్జున కుమారుడు, నటుడు నాగ చైతన్య జన్మించాడు.
  • డిసెంబరు 20 భారత ప్రధాన న్యాయమూర్తిగా ప్రఫుల్లచంద్ర నట్వర్‌లాల్ భగవతి పదవీ విరమణ. భారత్
  • డిసెంబరు 24 పార్లమెంటు ఆమోదించిన 'వినియోగదారుల హక్కుల రక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. నాటి నుంచి ఈ రోజును జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. భారత్

జననాలు

  • జనవరి 3 అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
  • జనవరి 3 నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.
  • జనవరి 5 దీపిక పడుకొనే, భారతీయ సూపర్ మోడల్, బాలీవుడ్ నటి. భారత్
  • జనవరి 28 శ్రుతి హాసన్ , తెలుగు తమిళ హిందీ నటి.
  • మార్చి 1 ఎన్. సి. కారుణ్య, పాడుతా తీయగా కార్యక్రమంలో విజేతగా నిలిచాడు. ఇతడి రెండవ ఆల్బమ్ సాయి మాధురిని శ్రీ సత్యసాయి బాబా సమక్షంలో విడుదల చేశాడు.
  • మార్చి 18 అనుమోలు సుశాంత్ తెలుగు సినిమా నటుడు. అక్కినేని నాగేశ్వరరావుకు మనుమడు.
  • మార్చి 20 రిచా గంగోపాధ్యాయ, మోడల్, సినీ నటి.
  • మార్చి 31 వంశీకృష్ణ , తెలుగు సినీ నటుడు.
  • ఏప్రిల్ 10 దీపు ,సంగీత కారుడు.
  • ఏప్రిల్ 10 అయేషా తకిట , మోడల్, సినీనటి.
  • ఏప్రిల్ 23 నాగ్ అశ్విన్,భారతీయ చలనచిత్ర దర్శకుడు, స్క్రీన్ రైటర్. భారత్
  • మే 5 విశాఖ సింగ్ , టాలీవుడ్, బాలీవుడ్ చలనచిత్ర నటి , నిర్మాత.
  • మే 10 పెంటేల హరికృష్ణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన చదరంగం క్రీడాకారుడు.
  • మే 17 ఛార్మి, సినీ నటి.
  • జూన్ 6 భావన , దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
  • జూన్ 14 బిందు మాధవి , సినీ నటి.
  • జూన్ 16 అంజలి, తెలుగు చలన చిత్రనటి , మోడల్.
  • జూలై 1 సితార: భారతీయ సినీ నేపథ్య గాయిని. భారత్
  • జూలై 23 గొట్టిముక్కుల రమాకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షులు, వరంగల్ అర్బన్ జిల్లా, తెలంగాణ.
  • ఆగస్టు 13 అజయ్ భూపతి, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత.
  • ఆగస్టు 15 కాసోజు శ్రీకాంతచారి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరవీరుడు. (మ.2009).
  • సెప్టెంబరు 2 పార్నంది భగవతి కృష్ణ శర్మ, ఆధునిక కవి, జానపద కళాకారుడు, గాయకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు గ్రహీత, పండితుడు.
  • సెప్టెంబరు 8 పారుపల్లి కశ్యప్, భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. భారత్
  • సెప్టెంబరు 11 శ్రియా సరన్, సినీ నటి.
  • సెప్టెంబరు 11 అంజలి , తమిళ, తెలుగు, సినీ నటి.
  • సెప్టెంబరు 17 ప్రియా ఆనంద్, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, తెలుగు, చిత్రాల నటి.
  • అక్టోబరు 20 ప్రియాంక శర్మ, భారతీయ నటి. భారత్
  • అక్టోబరు 21 పూనమ్ కౌర్ , తెలుగు,తమిళ, మలయాళ ,నటి,మోడల్.
  • అక్టోబరు 26 శైలేష్ కొలను , చలనచిత్ర దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే.
  • అక్టోబరు 28 అదితిరావు హైదరి , బాలీవుడ్ , తమిళ,తెలుగు ,చిత్రాల నటి.
  • అక్టోబరు 29 శ్రీదేవి విజయ్ కుమార్, తమిళ, తెలుగు, కన్నడ, నటి.
  • నవంబరు 1 ఇలియానా, తెలుగు సినిమా నటీమణి.
  • నవంబరు 8 ఆరోన్ స్వార్ట్జ్, ఒక అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్, రచయిత, రాజకీయ నిర్వాహకుడు, అంతర్జాల కార్యకర్త.
  • నవంబరు 15 సానియా మీర్జా, భారతదేశ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి. భారత్
  • నవంబరు 23 అక్కినేని నాగ చైతన్య, సిని నటుడు, అక్కినేని నాగార్జున కుమారుడు.
  • నవంబరు 27 సురేష్ రైనా, భారత్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. భారత్

మరణాలు

  • జనవరి 3 క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904). భారత్
  • జనవరి 26 కొర్రపాటి గంగాధరరావు,. నటుడు, దర్శకుడు, శతాధిక నాటకకర్త, కళావని సమాజ స్థాపకుడు. (జ.1922).
  • జనవరి 27 అనగాని భగవంతరావు, న్యాయవాది, మాజీమంత్రి. (జ.1923).
  • ఫిబ్రవరి 17 జిడ్డు కృష్ణమూర్తి, భారతీయ తత్త్వవేత్త. (జ.1895). భారత్
  • ఫిబ్రవరి 24 రుక్మిణీదేవి అరండేల్, కళాకారిణి. (జ.1904).
  • మే 9 టెన్సింగ్ నార్కే, ఎవరెస్టు పర్వతం ఎక్కిన మొదటి విజేత. (జ.1914).
  • మే 18 కె.ఎల్.రావు, ఇంజనీరు, రాజకీయ నాయకుడు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాకారం కావడానికి ఈయన కృషి చేశాడు. (జ.1902).
  • జూన్ 18 ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకుడు (జ.1908).
  • జూన్ 20 ముర్రే పి హేడన్, కృత్రిమ గుండె గ్రహీత, కృత్రిమ గుండె పెట్టిన 16నెలల తరువాత, లూయిస్ విల్లే అనే చోట (కెంటకీ రాష్ట్రం) లో మరణించాడు.
  • జూలై 4 దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు. భారత్
  • జూలై 6 బాబు జగ్జీవన్ రాం.
  • ఆగస్టు 6 విలియం J స్క్రోడర్స్, మనిషి చేసిన కృత్రిమ గుండె (జార్విక్ VII) తో, ఎక్కువ కాలం (620 రోజులు) బ్రతికాడు.
  • ఆగస్టు 22 శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1901). భారత్
  • సెప్టెంబరు 5 గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938). భారత్
  • సెప్టెంబరు 7 పి.ఎస్. రామకృష్ణారావు, తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. (జ.1918).
  • అక్టోబరు 1 వీర్ చంద్ర సింగ్ గర్వాలీ, భారతదేశ విప్లవకారుడు. భారత్
  • అక్టోబరు 19 టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (జ.1919).
  • అక్టోబరు 21 దివాకర్ల వేంకటావధాని, పరిశోధకుడు, విమర్శకుడు. (జ.1923).
  • నవంబరు 12 భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, భారతదేశ సుప్రీంకోర్టు ఆరవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1899). భారత్
  • డిసెంబరు 3 అజిత్ కుమార్ బసు, భారతీయ హృదయవ్యాధి నిపుణుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1912). భారత్
  • డిసెంబరు 9 వల్లూరి బసవరాజు, హేతువాది, ఆంధ్ర మహాసభ కార్యకర్త, అఖిలభారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేశారు.
  • డిసెంబరు 9 వెదిరె రామచంద్రారెడ్డి, భూదానోద్యమంలో భూమిని దానంచేసిన మొట్టమొదటి భూస్వామి (జ. 1905).
  • డిసెంబరు 13 స్మితా పాటిల్, హిందీ సినీనటి (జ.1955). భారత్
  • డిసెంబరు 26 అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (జ.1919).

సినిమా

  • ఫిబ్రవరి 14 'బ్రహ్మాస్త్రం (1986 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • మార్చి 21 'కాష్మోరా' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 4 'పవిత్ర' చిత్రం విడుదలైంది.
  • జూన్ 18 'ఆది దంపతులు (సినిమా)' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 29 'రేపటి పౌరులు' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 4 'శాంతి నివాసం' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు