ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 15 జిమ్మీ వేల్స్‌, లారీ సాంగర్‌లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి వికీపీడియాను ఆవిష్కరించారు.
  • జనవరి 26 గుజరాత్ లో భయంకర భూకంపం - 20,000 మంది దుర్మరణం. భారత్
  • ఫిబ్రవరి 15 మానవుని జన్యువు పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
  • ఫిబ్రవరి 16 మానవుని జన్యువు యొక్క పూర్తి నిర్మాణం నేచుర్ పత్రికలో ప్రచురించబడింది.
  • ఏప్రిల్ 1 స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశం నెదర్‌లాండ్స్.
  • ఏప్రిల్ 16 భారత్, బంగ్లాదేశ్ లు ఐదు రోజులపాటు వాటి సరిహద్దు వివాదం పై చర్చించాయి. అయినా పరిష్కరించుకోలేకపోయాయి. భారత్
  • ఏప్రిల్ 21 కేసీఆర్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.
  • ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయింది.
  • ఏప్రిల్ 27 ప్రత్యేక తెలంగాణ నినాదంతో కేసీఆర్ హైదరాబాద్ జలదృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు.
  • ఏప్రిల్ 28 డెన్నిస్ టిటో, ప్రపంచంలో మొదటి అంతరిక్ష పర్యాటకుడుగా చరిత్రలో నిలిచాడు.
  • మే 10 బ్రిటన్ లో గత 20 సంవత్సరాలు కన్నా తక్కువ క్రైమ్ రేట్లు నమోదు అయ్యాయి.
  • మే 23 నిన్ను చూడాలని చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జూనియర్ ఎన్.టి.ఆర్ స్టూడెంట్ నెం.1తో తొలి విజయం అందుకున్నారు.
  • మే 24 షెర్పా తెంబా (టెంబా) త్సెరి, అతి చిన్న వయస్సు (15వ ఏట) లో, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు.
  • మే 25 32 సంవత్సరాల ఎరిక్ వైహెన్‌మాయెర్ ప్రపంచ అత్యున్నత ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి అంధుడుగా చరిత్రకెక్కాడు.
  • జూన్ 1 నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య.
  • జూన్ 9 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ చిత్రకారుడు బాపును జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించింది. భారత్
  • జూన్ 11 ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్‌వీకు మరణశిక్ష అమలుపరిచారు.
  • జూన్ 16 దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.
  • జూన్ 18 భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్లో ఆందోళనలు జరిగాయి. భారత్
  • జూన్ 19 ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.
  • జూలై 3 వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలిపోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు.
  • ఆగస్టు 30 యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలోసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
  • సెప్టెంబరు 11 ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు.
  • సెప్టెంబరు 27 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కన్నుమూశారు.
  • సెప్టెంబరు 27 ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం స్టూడెంట్ నెం.1 విడుదలై విజయం సాధించింది.
  • సెప్టెంబరు 30 మధ్యప్రదేశ్, మెయిన్‌పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియాతో సహా మొత్తం 8 మంది మరణించారు. భారత్
  • అక్టోబరు 1 కాశ్మీర్‌ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 మంది చనిపోయారు. భారత్
  • నవంబరు 17 శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక లోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటిలభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
  • డిసెంబరు 13 భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు. భారత్

జననాలు

  • సెప్టెంబరు 3 ధీరజ్ బొమ్మదేవర, భారతీయ విలుకాడు. 2024 ఒలింపిక్స్‌లో భారత్‌ ఆర్చరీ జట్టులో ఉన్నాడు. భారత్

మరణాలు

  • జనవరి 1 ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920).
  • ఫిబ్రవరి 25 డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908).
  • మార్చి 25 కన్నడ ప్రభాకర్ , కన్నడ,తెలుగు, తమిళ ,హిందీ, మళయాళ, చిత్రాల ప్రతి నాయకుడు.(జ.1948).
  • మే 13 ఆర్.కె. నారాయణ్, భారత నవలా రచయిత (జ.1906). భారత్
  • మే 28 వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921).
  • జూన్ 1 బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).
  • జూన్ 4 దీపేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (జ.1971).
  • జూన్ 6 కె.ప్రత్యగాత్మ, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత. (జ.1925).
  • జూన్ 10 లక్ష్మీ దీపక్, తెలుగు చలన చిత్ర దర్శకుడు (జ.1935).
  • జూన్ 11 ఓక్లహోమా, నిందితుడు టిమోతీ మెక్‌వీ.
  • జూన్ 11 తిరుపతి స్వామి, తెలుగు, తమిళ చిత్రాల దర్శకుడు, విలేకరి(జ.1966).
  • జూన్ 19 జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951).
  • జూన్ 21 కే.వి.మహదేవన్, సంగీత దర్శకుడు (జ.1918).
  • జూలై 21 శివాజీ గణేశన్, ప్రసిద్ధ దక్షిణ భారత చలన చిత్ర నటుడు (జ.1928). భారత్
  • ఆగస్టు 16 అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (జ.1918). భారత్
  • సెప్టెంబరు 10 పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు (జ. 1917).
  • సెప్టెంబరు 27 కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (జ.1920).
  • సెప్టెంబరు 30 మాధవరావు సింధియా, రాజకీయ నాయకుడు (జ.1945).
  • అక్టోబరు 5 కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (జ.1910).
  • అక్టోబరు 22 జీ.రామకృష్ణ , తెలుగు,తమిళ, మళయాళ, నటుడు , రంగస్థల నటుడు.(జ.1939).
  • డిసెంబరు 18 అమల్ కుమార్ సర్కార్, భారతదేశ సుప్రీంకోర్టు ఎనమిదవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1901). భారత్

సినిమా

  • ఫిబ్రవరి 11 'ప్రియమైన నీకు' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 14 'అమ్మో బొమ్మ' చిత్రం విడుదలైంది.
  • మే 9 'ప్రేమతో రా' చిత్రం విడుదలైంది.
  • మే 18 'అమ్మాయి కోసం' చిత్రం విడుదలైంది.
  • మే 23 'నిన్ను చూడాలని' చిత్రం విడుదలైంది.
  • జూన్ 8 '6 టీన్స్' చిత్రం విడుదలైంది.
  • జూన్ 29 'కాఖీ చొక్కా' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 17 'శుభాశీస్సులు' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 9 'అమ్మాయే నవ్వితే' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 29 'జాబిలి' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 6 'భద్రాచలం (సినిమా)' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు