జూన్ 9 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ చిత్రకారుడు బాపును జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించింది.
భారత్
జూన్ 11 ఓక్లహోమా బాంబు దాడిలో నిందితుడు టిమోతీ మెక్వీకు మరణశిక్ష అమలుపరిచారు.
జూన్ 16 దేవాదుల ప్రాజెక్టు కు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశాడు.
జూన్ 18 భారత ప్రభుత్వం నాగాలాండ్ లోని నాగా విద్రోహులతో కాల్పుల విరమణ ఒప్పందం సమయాన్ని పెంచటంపై మణిపూర్లో ఆందోళనలు జరిగాయి.
భారత్
జూన్ 19 ప్రముఖ హాస్య చిత్రాల దర్శకుడు జంధ్యాల హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు.
జూలై 3 వ్లాదివోస్తోక్ అవియా తుపొలెవ్ సంస్థకు చెందిన విమానం టి.యు-154 జెట్ లైనర్ రష్యా లోని ఇర్కుత్ స్క్ విమానాశ్రయం సమీపంలో నేలకు దిగుతున్నప్పుడు కూలిపోయి 145 మంది ప్రయాణీకులు మరణించారు.
ఆగస్టు 30 యుగోస్లావియా మాజీ అధ్యక్షుడు స్లొబొదాన్ మిలోసెవిక్ ప్రజలను మూకుమ్మడిగా హత్య చేసినట్లు (యుద్దనేరాలలో అత్యంత ఘోరమైన నేరం) ఆరోపణ జరిగింది.
సెప్టెంబరు 11 ఆల్కాయిదా ఉగ్రవాదులు అమెరికా లోని నాలుగు ప్రధాన పట్టణాలలో విమానాలను ఉపయోగించి ఉగ్రవాదాన్ని ప్రదర్శించారు.
సెప్టెంబరు 27 ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కన్నుమూశారు.
సెప్టెంబరు 27 ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి చిత్రం స్టూడెంట్ నెం.1 విడుదలై విజయం సాధించింది.
సెప్టెంబరు 30 మధ్యప్రదేశ్, మెయిన్పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మాజీ కేంద్ర మంత్రి మాధవరావు సింధియాతో సహా మొత్తం 8 మంది మరణించారు.
భారత్
అక్టోబరు 1 కాశ్మీర్ రాష్ట్ర శాసనసభ భవనంపై తీవ్రవాదులు చేసిన కారు బాంబు దాడిలో 38 మంది చనిపోయారు.
భారత్
నవంబరు 17 శ్రీశైలం జలాశయ కనీస నీటిమట్టం 834 అ. గాను, నాగార్జునసాగర్ మట్టం 510 అ. గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక లోని ఆలమట్టి ఆనకట్ట నిర్మాణం తరువాత ఏర్పడిన పరిస్థితులలో నీటిలభ్యత గురించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
డిసెంబరు 13 భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
భారత్
జననాలు
సెప్టెంబరు 3 ధీరజ్ బొమ్మదేవర, భారతీయ విలుకాడు. 2024 ఒలింపిక్స్లో భారత్ ఆర్చరీ జట్టులో ఉన్నాడు.
భారత్
మరణాలు
జనవరి 1 ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920).
ఫిబ్రవరి 25 డోనాల్డ్ బ్రాడ్మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్మన్గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (జ.1908).
మార్చి 25 కన్నడ ప్రభాకర్ , కన్నడ,తెలుగు, తమిళ ,హిందీ, మళయాళ, చిత్రాల ప్రతి నాయకుడు.(జ.1948).
మే 13 ఆర్.కె. నారాయణ్, భారత నవలా రచయిత (జ.1906).
భారత్
మే 28 వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (జ.1921).