జనవరి 14 ఇంగ్లండుతో జరిగిన ఓ టెస్టుమ్యాచ్లో భారత బౌలర్ బాపూ నాదకర్ణి వరుసగా 21 మెయిడెన్ ఓవర్లు విసిరి రికార్డు సృష్టించాడు. వికెట్లేమీ తీసుకోకున్నా ఆ మ్యాచ్లో అతను 32 ఓవర్లు వేసి ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
భారత్
జనవరి 24 నెహ్రూ ప్రభుత్వంలో దామోదరం సంజీవయ్య కేంద్ర శ్రామిక, ఉద్యోగ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
భారత్
ఫిబ్రవరి 13 సరోజినీ నాయుడు జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం ఆమె చిత్రంతో తపాలా బిళ్ళను విడుదల చేసింది.
భారత్
ఫిబ్రవరి 20 బస్సు మార్గాల జాతీయీకరణ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఫిబ్రవరి 29 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాసు బ్రహ్మానంద రెడ్డి పదవిని చేపట్టాడు.
ఫిబ్రవరి 29 కాసు బ్రహ్మానందరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఏప్రిల్ 17 వాయుమార్గం ద్వారా భూగోళాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి మహిళ జెర్రీ మాక్.
మే 10 జాంబియా దేశపు అధ్యక్షుడుగా కెన్నెత్ కౌండా అధికారం చేపట్టాడు.
మే 24 పెరు దేశంలోని 'లిమా సాకర్ స్టేడియంలో జరిగిన ప్రమాదంలో 300 మంది మరణించారు.
మే 27 భారత తాత్కాలిక ప్రధానమంత్రిగా గుల్జారీలాల్ నందా నియమితుడైనాడు.
భారత్
జూన్ 9 భారత ప్రధానమంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి నియమితుడైనాడు.
భారత్
జూన్ 9 లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వంలో దామోదరం సంజీవయ్య కేంద్ర శ్రామిక, ఉద్యోగ శాఖల మంత్రిగా కొనసాగారు.
భారత్
జూన్ 12 దక్షిణ ఆఫ్రికాలో నెల్సన్ మండేలాకు జీవిత ఖైదు విధించబడింది.
జూన్ 19 అమెరికా సెనేట్ సివిల్ రైట్స్ చట్టం 1964 ను ఆమోదించింది.
జూలై 6 మాలవిలో న్యాసాలేండ్ ఒక స్వత్రంత్ర రాష్ట్రంగా అవతరించింది.
జూలై 23 ఈజిప్షియన్ ఆయుధాల ఓడ 'స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా', బోనె (అల్జీరియా) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది.
జూలై 31 అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
అక్టోబరు 5 రెండవ అలీన దేశాల సదస్సు కైరోలో ప్రారంభమైనది.
అక్టోబరు 10 18వ వేసవి ఒలింపిక్ క్రీడలు టోక్యోలో ప్రారంభమయ్యాయి.
జనవరి 8 భూమా నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (మ.2017).
జనవరి 12 జెఫ్ బెజోస్, అమెజాన్.కాం యొక్క స్థాపకుడు, అధ్యక్షుడు, ప్రధాన కార్యనిర్వాహణా అధికారి, అమెజాన్.కాం పాలక మండలి సభాపతి.
ఫిబ్రవరి 16 లగడపాటి రాజగోపాల్, పారిశ్రామికవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు, లాన్కో గ్రూపు (LANCO) విద్యుతుత్పత్తి, చిత్ర నిర్మాణం, ఇతర రంగాలలో కృషిచేస్తున్నది.
భారత్
మార్చి 20 ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, మంత్రి.
ఏప్రిల్ 6 డేవిడ్ వుడార్డ్, అమెరికన్ రచయిత, సంగీతకారు.
ఆగస్టు 28 నళిని , దక్షిణ భారత చలన చిత్ర నటి.
భారత్
సెప్టెంబరు 8 సులక్షణ: బాల నటి గా ప్రవేశించిన దక్షిణ భారత చలన చిత్రాలలో నటించిన నటి.
భారత్
సెప్టెంబరు 18 తంగిరాల చక్రవర్తి, కవి, రచయిత, విమర్శకుడు, నాటకకర్త.
సెప్టెంబరు 21 సుధా చంద్రన్, భరత నాట్య నృత్యకారిని.చలనచిత్ర నటి, టీ.వి.నటి.
సెప్టెంబరు 30 మోనికా బెల్లూచి ఇటలీ నటి, ఫ్యాషన్ మోడల్ జననం.
అక్టోబరు 8 సరిత, దక్షిణ భారత చలన చిత్ర నటి , డబ్బింగ్ కళాకారిణి.
భారత్
అక్టోబరు 15 పేడాడ పరమేశ్వరరావు, ప్రముఖ రచయిత, భాషావేత్త, పాత్రికేయుడు, విద్యావేత్త.
నవంబరు 4 జొన్నలగడ్డ శ్రీనివాస రావు , తెలుగుచలనచిత్ర దర్శకుడు , నిర్మాత.
డిసెంబరు 31 విన్స్టన్ బెంజిమన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
మరణాలు
జనవరి 1 శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888).
జనవరి 1 ఆల్ఫ్రెడ్ ఎవార్ట్ హాల్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్. (జ.1896).
మార్చి 4 కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు.
మార్చి 6 రావు వేంకటకుమార మహీపతి సూర్యారావు, చివరి పిఠాపురం మహారాజు. సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది. (జ.1885).
మార్చి 9 కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (జ.1896).
మే 24 గాలి పెంచల నరసింహారావు , తొలితరం తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు(జ.1903).
మే 25 గాలి పెంచల నరసింహారావు, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకులలో మొదటి తరానికి చెందినవారు, సీతాకళ్యాణం (1934) ఆయన సంగీతం అందించిన మొదటి చిత్రం. (జ. 1903).
మే 27 జవహర్లాల్ నెహ్రూ, భారతదేశ మొదటి ప్రధానమంత్రి. (జ.1889).
భారత్
మే 29 వఝల సీతారామ శాస్త్రి, భాషా శాస్త్రవేత్త, సాహిత్య విమర్శకుడు, జ్యోతిష శాస్త్రపండితుడు. (జ.1878).
మే 31 దువ్వూరి సుబ్బమ్మ, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళిన మొట్టమెదటి ఆంధ్ర మహిళ. సమాజసేవిక, స్త్రీ జనోద్ధరణకు కృషి చేసిన మహిళ. (జ.1880).
జూన్ 23 చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (జ.1887).
జూన్ 24 కొత్త రాజబాపయ్య, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, విద్యాబోర్డులో, రాష్ట్రవిద్యాసలహాసంఘం సభ్యుడు (జ.1913).
జూన్ 28 ఎన్.ఎం.జయసూర్య, హోమియోపతీ వైద్యుడు, సరోజినీ నాయుడు కుమారుడు. (జ.1899).
నవంబరు 25 ద్వారం వెంకటస్వామి నాయుడు, వాయులీన విద్వాంసుడు. (జ.1893).
డిసెంబరు 7 అర్ధనారీశ వర్మ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1874).
భారత్