జనవరి 11 కె.వి.రెడ్డి తీసిన పౌరాణిక చిత్రం ఉమా చండీ గౌరీ శంకరుల కథ విడుదలైంది.
మే 3 యునైటెడ్ కింగడమ్ దేశంలోని లండన్లో మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసారు. ఆ దేశంలో ఇదే మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స.
మే 14 చెకొస్లావేకియా ప్రభుత్వం, 'అలెగ్జాండర్ డుబ్సెక్' నాయకత్వంలో, సరళీ కరణ సంస్కరణలు మొదలు పెట్టింది.
మే 14 60వ దశకములో చైనా, పాకిస్తాన్ లతో యుద్ధాల తర్వాత సైనికులేకాక సామాన్య పౌరులు కూడా సుశిక్షితులై అప్రమత్తంగా ఉండటం అవసరమని గ్రహించి, భారత ప్రభుత్వం పౌర రక్షణ సంస్థను చట్టబద్ధం చేసింది.
భారత్
జూన్ 5 అమెరికా సెనేటరు రాబర్ట్ ఎఫ్. కెన్నడీపై సిర్హన్ సిర్హన్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ సంఘటన లాస్ ఆంజిల్స్లోని ది అంబాసిడర్ హోటల్లోని వంటశాలలో జరిగింది.
జూలై 23 'పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్', 'ఇ1 ఎ1' అనే విమానాన్ని, మొదటిసారిగా 'హైజాకింగ్' (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది.
జూలై 23 జాతుల వివక్షత కారణంగా, కీవ్ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.
సెప్టెంబరు 6 స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
సెప్టెంబరు 13 కె.వి.రెడ్డి తన జయంతి పిక్చర్స్ సంస్థకు తీసిన జానపద చిత్రం భాగ్యచక్రం విడుదలైంది.
అక్టోబరు 16 'మెడిసిన్ అండ్ ఫిజియాలజీ' విభాగంలో భారతీయ శాస్త్రవేత్త హరగోవింద ఖొరానాను నోబెల్ బహుమతి వరించిన రోజు.
భారత్
నవంబరు 22 మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చే బిల్లును లోక్సభ ఆమోదించింది.
భారత్
నవంబరు 29 పి. సుశీలకు తొలి జాతీయ పురస్కారం సాధించిపెట్టిన పాట గల తమిళ చిత్రం 'ఉయర్ంద మణితన్' విడుదలైంది.
డిసెంబరు 24 నాసా అంతరిక్షనౌక అపోలో 8లో ప్రయాణించిన వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో ప్రవేశించి ఆ ఘనత సాధించిన తొలి మానవులుగా చరిత్ర పుటలకెక్కారు.
డిసెంబరు 30 ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు.
జననాలు
జనవరి 11 శ్రీనివాస్ రామడుగుల, కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు.