జనవరి 1 ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
ఫిబ్రవరి 19 నాసా కుజగ్రహానికి పంపిన 'మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక' "థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం"ని ఉపయోగించి కుజగ్రహం భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.
ఫిబ్రవరి 27 అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
మే 3 భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు.
భారత్
మే 10 భారత లోక్సభ సభాపతిగా మనోహర్ జోషి పదవిని స్వీకరించాడు.
భారత్
మే 12 మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.
మే 31 దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
జూన్ 21 ఐరోపా ఖండము పోలియో నుండి విముక్తి పొందినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
జూలై 25 భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
భారత్
ఆగస్టు 17 టాంటన్ టెస్టులో మిథాలీ రాజ్ ఇంగ్లండ్పై 214 పరుగులు చేసి మహిళా టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ప్రపంచ రికార్డు సృష్టించారు.
భారత్
సెప్టెంబరు 10 ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకున్న స్విజర్లాండ్.
సెప్టెంబరు 27 జూల అనే సెనెగల్ ఓడ, గాంబియా తీరం దగ్గర బోల్తా కొట్టడంతో సుమారు 1900 మంది (టైటానిక్ కంటే ఎక్కువ మంది) మరణించారు.
సెప్టెంబరు 29 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.
నవంబరు 13 ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ నారాయణరావు తుదిశ్వాస విడిచారు; ఆయన పార్థివదేహం కాకతీయ వైద్య కళాశాలకు అందజేయబడింది.
డిసెంబరు 2 జనరల్ నిర్మల్ చంద్విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
డిసెంబరు 18 భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ.
భారత్
డిసెంబరు 24 ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు.
భారత్
జననాలు
జూలై 22 నకరకంటి దివ్య, ముకుందపురం, సూర్యపేట జిల్లా, తెలంగాణ.
ఆగస్టు 8 దాసరి నవీన్ యాదవ్, నారాయణ గూడెం గ్రామం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ.
డిసెంబరు 21 తప్పెట్ల భవిత, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ.
మరణాలు
జనవరి 3 సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920).
భారత్
జనవరి 7 బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927).
జనవరి 27 రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949).
ఫిబ్రవరి 3 కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936).
ఫిబ్రవరి 23 ప్రత్యూష , తెలుగు, తమిళ, చిత్రాల నటి(జ.1981).
ఫిబ్రవరి 27 బియ్యాల జనార్ధన్రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (జ. 1955).
మార్చి 3 జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్సభ స్పీకర్. (జ.1951).