ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
  • ఫిబ్రవరి 19 నాసా కుజగ్రహానికి పంపిన 'మార్స్ ఒడిస్సీ రోదసీ నౌక' "థెర్మల్ ఎమిషన్ ఇమేజింగ్ సిస్టం"ని ఉపయోగించి కుజగ్రహం భూతలపు పటాల్ని తయారుచేయటం మొదటిసారిగా మొదలు పెట్టింది.
  • ఫిబ్రవరి 27 అహమ్మదాబాద్ వెళుతున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఎస్-6 బోగిలో పెట్రోలు పోసి దహనం చేయడం వల్ల అయోధ్య నుంచి వస్తున్న59 మంది విశ్వహిందూ పరిషత్తు కరసేవకులు మరణించారు.
  • మే 3 భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం, జలంధర్ లోని, బాంక్ ఆఫ్ రాజస్థాన్ దగ్గర కూలిపోయి, ఏడుగురు బాంక్ ఉద్యోగులు, 1 కూలీ మరణించగా, 17మంది గాయ పడ్డారు. పైలట్ ఫ్లైట్ లెఫ్ట్‌నెంట్ ఎస్.కె. నాయక్ క్షేమంగా తప్పించుకున్నాడు. భారత్
  • మే 10 భారత లోక్‌సభ సభాపతిగా మనోహర్ జోషి పదవిని స్వీకరించాడు. భారత్
  • మే 12 మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ 5 రోజుల క్యూబా పర్యటనకు వెళ్లాడు. 1959 లో, క్యూబాలో ఫిడెల్ కాస్ట్రో తిరుగుబాటు చేసిన తరువాత పర్యటించిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.
  • మే 31 దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
  • జూన్ 21 ఐరోపా ఖండము పోలియో నుండి విముక్తి పొందినది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
  • జూలై 1 సోమాలియా స్వాతంత్ర్య దినం. భారత్
  • జూలై 25 భారత రాష్ట్రపతిగా ఏ.పి.జె.అబ్దుల్ కలామ్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. భారత్
  • ఆగస్టు 17 టాంటన్ టెస్టులో మిథాలీ రాజ్ ఇంగ్లండ్‌పై 214 పరుగులు చేసి మహిళా టెస్టు క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ప్రపంచ రికార్డు సృష్టించారు. భారత్
  • సెప్టెంబరు 10 ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకున్న స్విజర్లాండ్.
  • సెప్టెంబరు 27 జూల అనే సెనెగల్ ఓడ, గాంబియా తీరం దగ్గర బోల్తా కొట్టడంతో సుమారు 1900 మంది (టైటానిక్ కంటే ఎక్కువ మంది) మరణించారు.
  • సెప్టెంబరు 29 14వ ఆసియా క్రీడలు దక్షిణ కొరియా లోని బుసాన్ లో ప్రారంభమయ్యాయి.
  • నవంబరు 13 ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ నారాయణరావు తుదిశ్వాస విడిచారు; ఆయన పార్థివదేహం కాకతీయ వైద్య కళాశాలకు అందజేయబడింది.
  • డిసెంబరు 2 జనరల్ నిర్మల్ చంద్‌విజ్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్
  • డిసెంబరు 18 భారత ప్రధాన న్యాయమూర్తిగా జి.బి. పట్నాయక్ పదవీ విరమణ. భారత్
  • డిసెంబరు 24 ఢిల్లీ మెట్రో రైల్వేను ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ప్రారంభించాడు. భారత్

జననాలు

  • జూలై 22 నకరకంటి దివ్య, ముకుందపురం, సూర్యపేట జిల్లా, తెలంగాణ.
  • ఆగస్టు 8 దాసరి నవీన్ యాదవ్, నారాయణ గూడెం గ్రామం, పెన్పహాడ్ మండలం, సూర్యాపేట జిల్లా, తెలంగాణ.
  • డిసెంబరు 21 తప్పెట్ల భవిత, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ.

మరణాలు

  • జనవరి 3 సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్. (జ.1920). భారత్
  • జనవరి 7 బెజవాడ పాపిరెడ్డి, రాజకీయ నాయకుడు. (జ.1927).
  • జనవరి 27 రాజి జల్లేపల్లి, తెలంగాణకు చెందిన చెఫ్ (జ. 1949).
  • ఫిబ్రవరి 3 కె. చక్రవర్తి, సంగీత దర్శకుడు. ఆయన దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. (జ.1936).
  • ఫిబ్రవరి 23 ప్రత్యూష , తెలుగు, తమిళ, చిత్రాల నటి(జ.1981).
  • ఫిబ్రవరి 27 బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (జ. 1955).
  • మార్చి 3 జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951).
  • మార్చి 3 విజయ భాస్కర్ ,సంగీత దర్శకుడు ,(జ.1924).
  • మార్చి 4 కె.వి.రఘునాథరెడ్డి, కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి (జ.1924).
  • మార్చి 30 ఆనంద్ బక్షి, సంగీత దర్శకుడు (జ. 1930).
  • ఏప్రిల్ 6 భవనం వెంకట్రామ్, ఫిబ్రవరి 24 నుండి సెప్టెంబరు 20 వరకు ఏడు నెలల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
  • ఏప్రిల్ 7 భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931).
  • మే 2 దేవిక, తెలుగు, చలన చిత్ర నటి.తమిళ, మళయాళ చిత్రాలలో కూడా నటించింది.(జ.1943).
  • మే 22 మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944).
  • మే 30 ఎం. ఎన్. పాస్సే, భారతీయ వైద్యుడు, రుమాటాలజిస్ట్. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1934). భారత్
  • జూన్ 7 బసప్ప దానప్ప శెట్టి, భారత రాజకీయ వేత్త, 5 వ ఉప రాష్ట్రపతి. (జ. 1912). భారత్
  • జూన్ 8 భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920).
  • జూన్ 12 చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (జ.1939).
  • జూలై 1 కడూర్ వెంకటలక్షమ్మ, మైసూరు రాజాస్థానానికి చెందిన భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (జ.1906).
  • జూలై 2 దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (జ.1933).
  • జూలై 6 ధీరుభాయ్ అంబానీ, వ్యాపారవేత్త.
  • ఆగస్టు 17 ఋష్యేంద్రమణి , తెలుగు రంగస్థల , సినిమా నటి.
  • ఆగస్టు 27 సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911).
  • సెప్టెంబరు 1 బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (జ.1929).
  • అక్టోబరు 21 హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (జ.1920). భారత్
  • అక్టోబరు 29 మహేష్ మహదేవన్ , సంగీత దర్శకుడు.(జ.1955).
  • నవంబరు 13 కాళోజీ నారాయణరావు, తెలుగు కవి, తెలంగాణావాది. (జ.1914).
  • డిసెంబరు 1 అబు అబ్రహాం,ఒక భారతీయ వ్యంగ్య చిత్రకారుడు, పాత్రికేయుడు, రచయిత. (జ.1924). భారత్
  • డిసెంబరు 8 భగవాన్ (చిత్రకారుడు), మంచి వ్యంగ్య చిత్రకారులు. (జ.1939).

సినిమా

  • జనవరి 14 'నువ్వు లేక నేను లేను' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 15 'చంద్రవంశం' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 13 'ఫ్రెండ్స్ (2002 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • మే 1 'లాహిరి లాహిరి లాహిరిలో' చిత్రం విడుదలైంది.
  • మే 10 'అల్లరి' చిత్రం విడుదలైంది.
  • జూన్ 27 'నీతో' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 9 'వచ్చిన వాడు సూర్యుడు' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 23 'సొంతం' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు