జనవరి 5 ఖమ్మం జిల్లా పాల్వంచ థర్మల్ స్టేషన్లో తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు; 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఇదే నాంది.
జనవరి 9 మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము ప్రారంభమైనది.
జనవరి 9 తెలంగాణ రక్షణల అమలు కోరుతూ ఖమ్మం గాంధీచౌక్ వద్ద విద్యార్థి నాయకుడు రవీంద్రనాథ్ నిరవధిక దీక్ష ప్రారంభించారు.
జనవరి 14 మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడుగా మార్చారు.
భారత్
ఫిబ్రవరి 9 జంబో జెట్ బోయింగ్ 747 మొట్ట మొదటి ప్రయాణము పూర్తి చేసింది.
ఫిబ్రవరి 19 బోయింగ్ 747 జంబో జెట్ ని మొట్ట మొదటిసారి ప్రయోగాత్మకంగా నడిపి చూసారు.
ఏప్రిల్ 4 డా.డెంటన్ కూలీ మొట్టమొదటి కృత్రిమ హృదయాన్ని ఉపయోగించారు.
ఏప్రిల్ 12 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఇరు ప్రాంతాల నేతలతో చర్చల అనంతరం ప్రధానమంత్రి ఎనిమిది సూత్రాల పథకాన్ని ప్రకటించారు.
మే 3 భారత రాష్ట్రపతిగా వి.వి.గిరి పదవిని చేపట్టాడు.
భారత్
మే 10 అపోలో-10 వ్యోమ నౌక, రోదసీ నుంచి భూమి ఎలా కనిపిస్తోందో చూసి, మొట్టమొదటి సారిగా, రంగుల చిత్రాలను, తీసి పంపింది.
మే 14 'గర్భస్రావం', 'గర్భనిరోధం' కెనడా దేశంలో చట్టబద్ధమయ్యాయి.
మే 16 మానవరహిత సోవియట్ అంతరిక్ష నౌక వీనస్-5, శుక్రగ్రహం ఉపరితలంపై అడుగుపెట్టింది.
మే 18 రోదసీ నౌక అపొలో 10 ని, ముగ్గురు రోదసీ యాత్రికుల (1. యూజీన్ ఎ. సెమన్, 2. థామస్ పి. స్టాఫర్డ, 3. జాన్ డబల్ యు. యంగ్) తో రోదసీ లోకి ప్రయోగించారు.
మే 26 చంద్రునిపైకి పంపిన వ్యోమనౌక అపోలో 10 తన ఎనిమిది రోజుల యాత్ర అనంతరం భూమిని చేరింది.
జూలై 9 భారత వన్యప్రాణి బోర్డు, పులిని జాతీయ జంతువుగా ప్రకటించింది.
భారత్
జూలై 16 అపొల్లో 11 రోదసీ నౌక (చంద్రుడి మీద మొదటిసారిగా మనిషిని దింపే ఉద్దేశంతో) కేప్ కెన్నెడి, ఫ్లొరిడా రాష్ట్రం నుంచి చంద్రుని మీదకు ప్రయాణం మొదలు పెట్టింది.
జూలై 19 భారతదేశం లో 50 కోట్ల రూపాయల పెట్టుబడికి మించిన 14 బ్యాంకులు జాతీయం చేయబడినవి.
భారత్
జూలై 20 భారత రాష్ట్రపతిగా వరాహగిరి వేంకటగిరి పదవీ విరమణ.
భారత్
జూలై 20 భారత రాష్ట్రపతిగా ఎం.హిదయతుల్లా పదవిని స్వీకరించాడు.
భారత్
జూలై 22 యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) స్పుత్న్కి 50, మొల్నియల్-12 అనే రెండు కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది.
ఆగస్టు 8 భారతదేశ లోక్సభ స్పీకర్గా గురుదయాళ్ సింగ్ ధిల్లాస్ పదవిని స్వీకరంచాడు.
భారత్
ఆగస్టు 15 వుడ్ స్టాక్ సంగీత ఉత్సవం మాక్స్ యాస్గర్ ఫార్మ్లో ప్రారంభించారు.
ఆగస్టు 16 రాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థి నీలం సంజీవరెడ్డి వి.వి.గిరి చేతిలో ఓటమి చెందారు.
భారత్
నవంబరు 12 రాష్ట్రపతి ఎన్నికలో స్వంత పార్టీ యొక్క అధికారిక అభ్యర్థికి వ్యతిరేకంగా వి.వి.గిరిని గెలిపించిన ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరించగా, కొత్తపార్టీ, కాంగ్రెస్ (ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసుగా గుర్తింపు పొందింది.
భారత్