ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది. భారత్
  • జనవరి 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు 1 నుంచి 1960 జనవరి 11 వరకు).
  • జనవరి 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు).
  • జనవరి 11 కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.
  • జనవరి 11 దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
  • ఫిబ్రవరి 7 సినిమా అవకాశాల కోసం రాజబాబు మద్రాసు చేరుకున్నారు.
  • మార్చి 22 ఆర్థర్ లియొనార్డ్, డా.చార్లెస్.టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
  • ఏప్రిల్ 1 TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
  • ఏప్రిల్ 10 నటుడు కైకాల సత్యనారాయణకు నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది.
  • మే 1 గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూఢాచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది.
  • మే 1 డెన్మార్క్ లో, లీగో లేండ్ ప్రారంభమయింది.
  • మే 1 గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. భారత్
  • మే 10 అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి, నీటి లోపల ప్రయాణం, విజయవంతంగా ముగించింది.
  • మే 14 మనుషులు లేని రోదసీ నౌకను రష్యా దేశం (పాత యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రష్యా) రోదసీ లోకి పంపింది.
  • జూన్ 10 నటుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు, బసవతారకం దంపతులకు మద్రాసులో జన్మించారు.
  • జూన్ 16 ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన 'సైకో' నవల ఈ సినిమాకి ఆధారం.
  • జూన్ 30 జైరీ (పూర్వపు బెల్జియన్ కాంగో) అనే దేశం, బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది. భారత్
  • జూలై 1 ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.
  • జూలై 1 ఘనా రిపబ్లిక్ దినోత్సవం.
  • జూలై 20 సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి). భారత్
  • జూలై 20 రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే.
  • జూలై 21 సిరిమావొ బండారునాయకె, శ్రీలంక (నాటి సిలోన్) ప్రధాన మంత్రి (ణి) గా పదవిని చేపట్టి, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానిగా, మొదటి మహిళా దేశాధినేత్రిగా గుర్తింపు పొందింది. (1960 జూలై 20 అని కూడా అంటారు). భారత్
  • జూలై 21 అఫ్రికాలో కటం(తం)గా దేశంగా ఆవిర్భవించింది.
  • ఆగస్టు 4 అమెరికాకు చెందిన వైమానికదళ పరిశోధక విమానం, గంటకి 2, 150 మైళ్ళ వేగంతో ప్రయాణించి, రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొపెల్లర్ తో కాకుండా, రాకెట్ ప్రొపెల్లర్ ఉపయోగించి, ఇంత వేగాన్ని సాధించింది.
  • ఆగస్టు 7 ఫ్రాన్స్ నుంచి ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్యం పొందింది. భారత్
  • ఆగస్టు 13 మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ "ఎకో వన్ ఉపగ్రహం సాయంతో జరిగింది.
  • ఆగస్టు 15 రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె), ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది.
  • ఆగస్టు 15 ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు, ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు.
  • ఆగస్టు 18 గాబన్ దేశపు స్వాతంత్ర్య్య దినోత్సవము. భారత్
  • ఆగస్టు 19 స్పుత్నిక్ ప్రోగ్రాం : స్పుత్నిక్ 5ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.
  • ఆగస్టు 25 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోంలో ప్రారంభమయ్యాయి.
  • అక్టోబరు 22 మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది. భారత్
  • నవంబరు 14 పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.
  • డిసెంబరు 13 నటుడు దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు దంపతులకు జన్మించారు.

జననాలు

  • జనవరి 2 రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998). భారత్
  • జనవరి 15 తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017).
  • జనవరి 15 తిలక్ రాజ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు. భారత్
  • జనవరి 20 విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.
  • జనవరి 22 జమునా రాయలు, రంగస్థల నటి, బుర్రకథ హరికథ కళాకారిణి.
  • మార్చి 31 స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.
  • ఏప్రిల్ 4 అరుణ మొహంతి, ఒడిస్సీ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్, గురువు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
  • మే 4 డి. కె. అరుణ, ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసింది.
  • మే 16 సుద్దాల అశోక్ తేజ, సినీ గేయ రచయిత.
  • మే 21 మోహన్ లాల్, మలయాళ చిత్రరంగంలో అగ్రఘన్యుడు, భారతీయ సినీ నటుడు. భారత్
  • మే 27 దీర్ఘాశి విజయభాస్కర్, నాటక రచయిత, కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత.
  • జూన్ 7 సరిత, దక్షిణ భారత చలన చిత్రనటి. భారత్
  • జూన్ 10 నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు.
  • జూలై 1 అనురాధా నిప్పాణి, రంగస్థల నటి, దర్శకురాలు, రచయిత.
  • జూలై 18 పూర్ణిమ భాగ్యరాజ్, తమిళ తెలుగు, మళయాళ, హిందీ చిత్రాల నటి.
  • జూలై 27 సాయి కుమార్, తెలుగు సినిమా నటుడు, డబ్బింగ్ కళాకారుడు.
  • ఆగస్టు 8 సున్నం రాజయ్య, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2020). భారత్
  • ఆగస్టు 31 హసన్ నస్రల్లా, లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు.
  • సెప్టెంబరు 13 నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, 16వ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి.
  • సెప్టెంబరు 13 కార్తీక్, తమిళ తెలుగు చిత్రాల నటుడు, గాయకుడు,రాజకీయ నాయకుడు.
  • సెప్టెంబరు 26 గస్ లోగీ, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
  • అక్టోబరు 10 మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు. (మ.2008).
  • అక్టోబరు 10 యర్రా రఘు బాబు, తెలుగు సినీ నటుడు.
  • నవంబరు 7 రూప: తెలుగు చలనచిత్ర నటి.
  • నవంబరు 7 సప్పా దుర్గాప్రసాద్, నృత్యకళాకారుడు.
  • నవంబరు 19 శుభలేఖ సుధాకర్, నటుడు.
  • డిసెంబరు 2 సిల్క్ స్మిత, దక్షిణ భారత సినీ నటి (మ.1996). భారత్
  • డిసెంబరు 5 సారిక,భారతీయ చలనచిత్ర నటి,కమలహాసన్ మొదటి భార్య. భారత్
  • డిసెంబరు 10 రతి అగ్నిహోత్రి , పలు భారతీయ చిత్రాల నటి. భారత్
  • డిసెంబరు 13 దగ్గుపాటి వెంకటేష్, సినీ నటుడు.
  • డిసెంబరు 14 ఇబ్రహీం రైసీ, ఇరాన్ ఎనిమిదవ అధ్యక్షుడు. (మ.2024).
  • డిసెంబరు 15 మధు యాస్కీ గౌడ్, ఆంధ్రప్రదేశ్ లోని నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
  • డిసెంబరు 16 రతీ అగ్నిహోత్రి, తెలుగు, తమిళ, కన్నడ, హింది., ఉర్దూ చిత్రాల నటి.
  • డిసెంబరు 29 డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

మరణాలు

  • జనవరి 14 హెచ్ ఎం.రెడ్డి , తెలుగు సినీ దర్శకుడు.(జ.1892).
  • ఫిబ్రవరి 29 గాడిచర్ల హరిసర్వోత్తమ రావు, ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. (జ.1883).
  • మే 22 మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885). భారత్
  • ఆగస్టు 25 చింతా దీక్షితులు, రచయిత. (జ.1891).

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు