జనవరి 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు 1 నుంచి 1960 జనవరి 11 వరకు).
జనవరి 11 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు).
జనవరి 11 కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు.
జనవరి 11 దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.
ఫిబ్రవరి 7 సినిమా అవకాశాల కోసం రాజబాబు మద్రాసు చేరుకున్నారు.
మార్చి 22 ఆర్థర్ లియొనార్డ్, డా.చార్లెస్.టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
ఏప్రిల్ 1 TIROS-1 ఉపగ్రహం టెలివిజన్ మొదటి చిత్రాన్ని అంతరాళం నుండి ప్రసారం చేసింది.
ఏప్రిల్ 10 నటుడు కైకాల సత్యనారాయణకు నాగేశ్వరమ్మతో వివాహం జరిగింది.
మే 1 గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూఢాచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది.
మే 1 గుజరాత్, మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
భారత్
మే 10 అమెరికాకు చెందిన అణు జలాంతర్గామి ట్రైటన్ తన 84 రోజుల సుదీర్ఘమైనటువంటి, నీటి లోపల ప్రయాణం, విజయవంతంగా ముగించింది.
మే 14 మనుషులు లేని రోదసీ నౌకను రష్యా దేశం (పాత యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రష్యా) రోదసీ లోకి పంపింది.
జూన్ 10 నటుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీ రామారావు, బసవతారకం దంపతులకు మద్రాసులో జన్మించారు.
జూన్ 16 ఆల్ ఫ్రెడ్ హిచ్ కాక్ దర్శకత్వంలో నిర్మించిన త్రిల్లర్ / హారర్ (భయానకమైన) సైకో సినిమా విడుదల అయ్యింది. రాబర్ట్ బ్లాచ్ రాసిన 'సైకో' నవల ఈ సినిమాకి ఆధారం.
జూన్ 30 జైరీ (పూర్వపు బెల్జియన్ కాంగో) అనే దేశం, బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది.
భారత్
జూలై 1 ఆంధ్రజ్యోతి దినపత్రిక విజయవాడ నుంచి ప్రారంభించబడింది.
జూలై 20 సిరిమావో బండారు నాయకే, సిలోన్ (నేటి శ్రీలంక) ప్రధానిగా ఎన్నికైంది. ఈమె ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని (ప్రభుత్వాధినేత్రి).
భారత్
జూలై 20 రోదసీలోకి వెళ్ళిన రెండుకుక్కలు తిరిగి భూమిమీదకు (యు.ఎస్.ఎస్.ఆర్) తిరిగి వచ్చాయి. రోదసీలోకి వెళ్ళి తిరిగివచ్చిన మొదటి జీవాలు ఇవే.
జూలై 21 సిరిమావొ బండారునాయకె, శ్రీలంక (నాటి సిలోన్) ప్రధాన మంత్రి (ణి) గా పదవిని చేపట్టి, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానిగా, మొదటి మహిళా దేశాధినేత్రిగా గుర్తింపు పొందింది. (1960 జూలై 20 అని కూడా అంటారు).
భారత్
జూలై 21 అఫ్రికాలో కటం(తం)గా దేశంగా ఆవిర్భవించింది.
ఆగస్టు 4 అమెరికాకు చెందిన వైమానికదళ పరిశోధక విమానం, గంటకి 2, 150 మైళ్ళ వేగంతో ప్రయాణించి, రికార్డు నమోదు చేసింది. ఇది సంప్రదాయకమైన ప్రొపెల్లర్ తో కాకుండా, రాకెట్ ప్రొపెల్లర్ ఉపయోగించి, ఇంత వేగాన్ని సాధించింది.
ఆగస్టు 7 ఫ్రాన్స్ నుంచి ఐవరీ కోస్ట్ స్వాతంత్ర్యం పొందింది.
భారత్
ఆగస్టు 13 మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ "ఎకో వన్ ఉపగ్రహం సాయంతో జరిగింది.
ఆగస్టు 15 రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో (బ్రజ్జావిల్లె), ఫ్రాన్స్ నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది.
ఆగస్టు 15 ముగ్గురు కాలిఫోర్నియా కాపలాదారులు, ఎగిరే పళ్ళాలు (గుర్తుపట్టలేని ఫ్లైయింగ్ వస్తువులు) చూసామని చెప్పారు.
ఆగస్టు 18 గాబన్ దేశపు స్వాతంత్ర్య్య దినోత్సవము.
భారత్
ఆగస్టు 19 స్పుత్నిక్ ప్రోగ్రాం : స్పుత్నిక్ 5ని సోవియట్ యూనియన్ రోదసి లోకి పంపింది. అందులో, బెల్కా, స్త్రెల్కా (కుక్కల పేర్లు), 40 చుంచులు, 2 ఎలుకలు మరికొన్ని రకాల మొక్కలు ఉన్నాయి.
ఆగస్టు 25 17వ వేసవి ఒలింపిక్ క్రీడలు రోంలో ప్రారంభమయ్యాయి.
అక్టోబరు 22 మాలి ఫ్రాన్సు నుండి స్వాతంత్ర్యం పొందినది.
భారత్
నవంబరు 14 పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సమాఖ్య (OPEC) ఏర్పాటైంది.
డిసెంబరు 13 నటుడు దగ్గుబాటి వెంకటేష్ ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు దంపతులకు జన్మించారు.
జననాలు
జనవరి 2 రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998).
భారత్
జనవరి 15 తాతా రమేశ్ బాబు తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు, చిత్రలేఖనోపాధ్యాయుడు. (మ.2017).
జనవరి 15 తిలక్ రాజ్, భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు.
భారత్
జనవరి 20 విజయ నరేష్, తెలుగు చిత్రాలలో హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు.
జనవరి 22 జమునా రాయలు, రంగస్థల నటి, బుర్రకథ హరికథ కళాకారిణి.
మార్చి 31 స్టీవ్ అపిల్టన్, మైక్రాన్ టెక్నాజీ సిఇవో.
ఏప్రిల్ 4 అరుణ మొహంతి, ఒడిస్సీ నృత్యకారిణి, కొరియోగ్రాఫర్, గురువు. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
మే 4 డి. కె. అరుణ, ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసింది.