మే 12 నెల్సన్ మండేలా,దక్షిణాఫ్రికాలో ఖైదు చేయబడిన 22 సంవత్సరాల తరువాత తన భార్యను చూసాడు.
మే 23 బచేంద్రీపాల్, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహకురాలిగా అవతరించింది.
భారత్
జూన్ 3 అమృత్సర్లో గల సిక్కుల దేవాలయం స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ మొదలైనది. ఇది జూన్ 6 వరకు జరిగింది.
జూలై 21 తూర్పు జర్మనీకి చెందిన 'మారిటా కోచ్' 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
జూలై 23 'కుంబ్రియా' లో ఉన్న 'సెల్లాఫీల్డ్' దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.
భారత్
ఆగస్టు 2 ఎ. సర్రే అనే వ్యాపారి, చట్టవిరుద్ధంగా తన ఫోన్ ను పోలీసులు టాపింగ్ చేసారని ఆరోపించాడు. మానవ హక్కుల యూరోపియన్ కోర్ట్ ఇలా ఫోన్ టాపింగ్ చేయటం తప్పు అని, పోలీసులను మందలించింది.
ఆగస్టు 5 జోన్ బెనోయిట్, స్త్రీల మొదటి ఒలింపిక్ మారథాన్ గెలుచుకున్నది.
ఆగస్టు 16 నాదెండ్ల భాస్కరరావు కుట్రతో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అధికారం నుంచి తొలగించబడ్డారు.
ఆగస్టు 29 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా శంకర్ దయాళ్ శర్మ నియమితులయ్యాడు.
ఆగస్టు 30 అమెరికా రోదసీ నౌక ఎస్.టి.ఎస్-41-డి డిస్కవరీ స్పేస్ షటిల్ తన మొదటి ప్రయాణాన్ని మొదలు పెట్టి రోదసీలోనికి వెళ్ళింది.
సెప్టెంబరు 16 ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం ఫలించి ఎన్టీ రామారావు తిరిగి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
సెప్టెంబరు 28 తొలిసారి భారతదేశంలో ఫ్లడ్లైట్స్ క్రింద క్రికెట్ మ్యాచ్ జరిగింది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఇండియా నడుమ జరిగిన మ్యాచ్ను ఫ్లడ్లైట్స్ క్రింద ఆడారు.
భారత్
జూలై 29 డాక్టర్ శ్రీజ సాధినేని, తెలుగు చలనచిత్ర, టెలివిజన్, థియేటర్ నటి, యాక్టింగ్ ప్రొఫెసర్, రచయిత్రి, దర్శకురాలు, డబ్బింగ్ ఆర్టిస్ట్. పిన్న వయసులోనే పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కి గాను విశ్వకర్మ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ డిగ్రీ పొందారు. థియేటర్ ఆర్ట్స్ లో శ్రీ పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్ మెడల్ సాధించారు. 2003లో శ్రీజయ ఆర్ట్స్ సంస్థను స్థాపించి కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నారు. 2012 నుంచి శ్రీ ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
జూలై 29 సోనియా దీప్తి, తెలుగు, తమిళ, చలనచిత్ర నటి.
ఆగస్టు 7 సచిన్ జోషి , చలనచిత్ర నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త.
జూన్ 30 రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (జ.1892).
ఆగస్టు 5 రిచర్డ్ బర్టన్, హాలీవుడ్ నటుడు, తన 58వ ఏట మరణించాడు (జ.1925 నవంబరు 10).
ఆగస్టు 22 బొమ్మకంటి సత్యనారాయణ రావు, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమకారుడు, మాజీ శాసనసభ్యుడు. (జ. 1916).
ఆగస్టు 31 పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు (జ .1917).
అక్టోబరు 31 ఇందిరా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917).
భారత్
అక్టోబరు 31 వానమామలై వరదాచార్యులు, తెలంగాణ ప్రాంతానికి చెందిన పండితుడు, రచయిత. (జ.1912).
నవంబరు 11 చండ్ర పుల్లారెడ్డి, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు - లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి. సి.పి.గా ఖ్యాతిగాంచాడు. రచయిత, సిద్ధాంతకర్త, వక్త. (జ.1917).
భారత్
నవంబరు 25 యశ్వంతరావ్ చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.
భారత్
నవంబరు 26 తుమ్మల దుర్గాంబ, సర్వోదయ కార్యకర్త (జ. 1907).
సినిమా
జనవరి 6 'కోటీశ్వరుడు (1984 సినిమా)' చిత్రం విడుదలైంది.