జనవరి 1 చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
జనవరి 20 అమెరికా 42వ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఫిబ్రవరి 26 అలాన్ బోర్డర్ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా సునీల్ గవాస్కర్ రికార్డును అధికమించాడు.
మార్చి 8 ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేట వద్ద బస్సును తగలబెట్టిన ఘటనలో 23 మంది మరణించారు.
మార్చి 12 బొంబాయి పేలుళ్ల అనంతరం ప్రధాని పి.వి.నరసింహారావు చేపట్టిన సంక్షోభ నిర్వహణ ప్రశంసలు అందుకుంది.
భారత్
ఏప్రిల్ 24 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు.
భారత్
మే 24 మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది.
జూలై 1 జనరల్ బి.సి.జోషి భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
జూలై 16 బ్రిటిష్ ఎమ్. ఐ. 15, (అంతర్గత రహస్య భద్రతా దళం) తన 84 సంవత్సరాల చరిత్రలో, మొదటిసారిగా ప్రజల ముందుకు పత్రికల ద్వారా వచ్చింది. స్టెల్లా రెమింగ్టన్ (56 సం) (మహిళ) పత్రికల ముందు ఫొటో ఇచ్చిన మొదటి డైరెక్టర్ జనరల్.
భారత్
సెప్టెంబరు 10 మేజర్ చంద్రకాంత్ శతదినోత్సవ వేదికపై ఎన్టీఆర్ లక్ష్మీపార్వతితో తన బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు.
సెప్టెంబరు 28 కరకాస్ జాతీయ రహదారి క్రింద గ్యాస్ పైపు పేలి 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
సెప్టెంబరు 30 మహారాష్ట్ర లోని లాతూర్ భూకంపం, సుమారు 10,000 ప్రజలు మరణించారు.
భారత్
అక్టోబరు 8 దక్షిణాఫ్రికాలో జాతివివక్ష అంతమవడంతో దానిపై విధించిన ఆంక్షలను ఐక్యరాజ్యసమితి ఎత్తివేసింది.
నవంబరు 15 ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఒకటి 272 మంది ప్రయాణీకులతో తిరుపతి దగ్గర పొలాల్లో దిగింది. ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నారు.
డిసెంబరు 2 స్పేస్ షటిల్ ప్రోగ్రామ్: ఎస్ టి ఎస్-61 - హబుల్ స్పేస్ టెలిస్కోప్ రిపేరు చేయడానికి నాసా ఒక స్పేస్ షటిల్ ఎండీవర్ మిషన్ను ప్రయోగించింది.
జననాలు
జనవరి 3 బెల్లంకొండ శ్రీనివాస్ , తెలుగు చలన చిత్ర నటుడు,నిర్మాత.