జనవరి 1 గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
ఫిబ్రవరి 8 ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బెంగళూరులో ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కన్నడలో 21 పాటలు రికార్డు చేసి రికార్డు సృష్టించారు.
భారత్
ఏప్రిల్ 12 ప్రపంఛపు మొట్టమొదట స్పేస్ షటిల్ (అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రాగల వ్యొమనౌక) "కొలంబియా"ను అమెరికా విజయవంతంగా ప్రయొగించింది.
ఏప్రిల్ 14 మలేషియా రాజధాని కౌలాలంపూర్లో రెండవ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం.
మే 8 ముఖ్యమంత్రి టి.అంజయ్య శ్రీశైలంలో సుఖా ఆశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
మే 9 ఆంధ్ర మహిళా సభ వ్యవస్థాపకురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ హైదరాబాదులో కన్నుమూశారు.
మే 14 'నాసా' రోదసీ నౌక 'ఎస్-192' ని రోదసీ లోకి ప్రయోగించింది.
జూన్ 1 జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశము కు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
జూన్ 7 ఒపెరా పేరుతో ఇరాక్ లోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది.
జూన్ 18 ఎయిడ్స్ రోగాన్ని కాలిఫోర్నియా లోని సాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు.
జూలై 3 న్యూయార్క్ టైమ్స్ పత్రికలో మొట్టమొదటిసారిగా 'కొత్తరకం జబ్బు' గా పేర్కొన్నారు. తరువాత, ఆ జబ్బు కే, ఎయిడ్స్ అని పేరు పెట్టారు.
జూలై 25 శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయము స్థాపించబడింది.
ఆగస్టు 1 ఉర్రూతలూగించే ఎమ్.టి.వి. తన మొట్టమొదటి ప్రసారం, ఉదయం 12:01 నుంచి ప్రారంభించింది. మొట్టమొదట ప్రసారమైన వీడియో బగ్లెస్ వారి "వీడియో కిల్డ్ ద రేడియో స్టార్".
సెప్టెంబరు 10 చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ కుమార్తె నందమూరి భువనేశ్వరిని వివాహమాడారు.
సెప్టెంబరు 29 భారత విమానం బోయింగ్-737ను ఖలిస్తాన్ తీవ్రవాదులు లాహోర్కు హైజాక్ చేశారు.
భారత్
అక్టోబరు 1 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సూత్రధారి దాల్ ఖల్సా కార్యకర్తలను అరెస్టు చేశారు.
అక్టోబరు 22 పారిస్-లియాన్ ల మధ్య టిజివి రైలు సర్వీసు ప్రారంభమైనది.
డిసెంబరు 26 తెలుగు, తమిళ చిత్రసీమల మహానటి సావిత్రి సుదీర్ఘ కోమా అనంతరం కన్నుమూశారు.
జననాలు
జనవరి 1 అస్మా ఫర్జాంద్, పాకిస్థాన్ మాజీ మహిళా క్రికెటర్, వికెట్ కీపర్.