జనవరి 12 తెలుగు చిత్రం 'తెనాలి రామకృష్ణ' ఉత్తమ చిత్రానికి ఇచ్చే ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ గెలుచుకుంది.
ఫిబ్రవరి 1 హాస్యనటుడు బ్రహ్మానందం నేటి పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెం గ్రామంలో జన్మించారు.
ఫిబ్రవరి 20 న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు. సంతకాలు చేసిన వారు తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న చూ. ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10. ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖలో 19 జూలై 1956 అని వ్రాసారు. ఆంధ్రరాష్ట్రాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయటానికి ముందుగా, 1956 ఫిబ్రవరి 20 నాడు పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది.
మార్చి 2 మొరాకో దేశానికి ఫ్రాన్స్ నుండి స్వాతంత్ర్యం లభించింది.
భారత్
మార్చి 8 భారత లోక్సభ స్పీకర్గా ఎమ్.అనంతశయనం అయ్యంగార్ పదవిని స్వీకరించాడు.
భారత్
మార్చి 23 ప్రపంచంలో మొదటి ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంగా పాకిస్తాన్ అవతరించింది. (పాకిస్థాన్ గణతంత్ర దినోత్సవం).
మే 5 మొదటి ప్రపంచ జూడో ఛాంపియన్షిప్ పోటీలు, జపాన్ లోని టొక్యో నగరంలో జరిగాయి.
మే 12 తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్) తీవ్రమైన తుఫాను, ఎత్తైన సముద్రపు అలలతో, అతలాకుతలమైంది.
జూలై 19 తెలుగు మాట్లాడే ప్రాంతాలని ఒకే రాష్ట్రంగా చేయాలని పెద్దమనుషుల ఒప్పందం జరిగిన రోజు.
జూలై 23 గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, 'బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్' ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.
జూలై 26 గమాల్ అబ్దుల్ నాసర్, ఈజిప్ట్ అధ్యక్షుడు సూయజ్ కాలువను జాతీయం చేసాడు.
ఆగస్టు 4 మొదటిసారిగా గంటకి 200 మైళ్ళవేగంతో మోటార్ సైకిల్ ప్రయాణించింది.
ఆగస్టు 19 కడిదల్ మంజప్ప కర్ణాటక రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం. (1956 ఆగష్టు 19 నుంచి 1956 అక్టోబరు 31 వరకు).
భారత్
అక్టోబరు 14 నాగపూరులో అంబేద్కర్ రెండు లక్షల మంది అనుచరులతో సహా బౌద్ధమతం స్వీకరించాడు.
అక్టోబరు 31 హైదరాబాదు రాష్ట్రం రద్దు కావడంతో నిజాం నిర్వహించిన రాజ్ప్రముఖ్ పదవి ముగిసింది.
నవంబరు 1 బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్ర ప్రదేశ్ కాదు) రెండవ ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1955 మార్చి 28 నుంచి 1956 నవంబరు 1 వరకు).
నవంబరు 1 ఆంధ్ర ప్రదేశ్, హైదరాబాదు రాజధానిగా, రాష్ట్రముగా అవతరించింది.
నవంబరు 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు, కేరళ, మైసూరు, బీహార్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
నవంబరు 1 ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం కలిసి తెలుగువారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది.
నవంబరు 1 భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్విభజనతో హైదరాబాదు రాష్ట్రం మూడు భాగాలుగా విడిపోయి, హైదరాబాదు నగరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయింది.
నవంబరు 1 ఆంధ్రప్రదేశ్ అవతరణతో నీలం సంజీవరెడ్డి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
నవంబరు 1 భోగరాజు పట్టాభి సీతారామయ్య మధ్యప్రదేశ్ తొలి గవర్నరుగా బాధ్యతలు చేపట్టారు.
భారత్
నవంబరు 1 పొట్టి శ్రీరాములు సాధించిన ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ విలీనమై హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.
నవంబరు 1 ఆంధ్రప్రదేశ్ అవతరణతో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో దామోదరం సంజీవయ్య శ్రామిక, స్థానిక స్వపరిపాలన శాఖల మంత్రి అయ్యారు.
నవంబరు 3 పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం.
భారత్
నవంబరు 22 16వ వేసవి ఒలింపిక్ క్రీడలు మెల్బోర్న్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
జనవరి 9 నోముల నర్సింహయ్య, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020).
జనవరి 14 నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్, లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు.
జూన్ 5 కుట్టి పద్మిని, దక్షిణ భారత చలనచిత్ర నటి, నిర్మాత.
భారత్
జూన్ 6 జాన్ బోర్గ్, స్వీడన్కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
జూన్ 11 అనూరాధా లోహియా, అంటువ్యాధులపై పరిశోధనలు చేసే భారతీయ సూక్ష్మ పరాన్న జీవుల శాస్త్రవేత్త.
భారత్
జూలై 5 చౌలపల్లి ప్రతాపరెడ్డి,1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, షాద్నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు.
జూలై 7 చౌలపల్లి ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.
జూలై 14 తనికెళ్ళ భరణి, రంగస్థల, సినిమా రచయిత, నటుడు.
జూలై 28 దీవి శ్రీనివాస దీక్షితులు, రంగస్థల నటుడు, అధ్యాపకుడు.
ఆగస్టు 1 అనంత వెంకట రామిరెడ్డి, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు.
భారత్
ఆగస్టు 2 లాల్జాన్ బాషా, రాజకీయవేత్త, తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (మ.2013).
ఆగస్టు 3 టి. మీనాకుమారి, న్యాయవాది. మేఘాలయ రాష్టానికి చెందిన తొలి ప్రధాన న్యాయమూర్తి.
ఆగస్టు 23 మోహన్: తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, చిత్రాల నటుడు, నిర్మాత.
ఆగస్టు 26 మేనకా గాంధీ, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రిణి.
భారత్
సెప్టెంబరు 2 నందమూరి హరికృష్ణ, నటుడు, రాజకీయ నాయకుడు, నందమూరి తారక రామారావు కుమారుడు (మ. 2018).
అక్టోబరు 10 గుండు హనుమంతరావు, తెలుగు సినీ హాస్య నటుడు. (మ.2018).
అక్టోబరు 13 సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ రాష్ట్రానికిచెందిన రాజకీయ నాయకుడు ఆయన 12 జూన్ 2014 నుండి 16 జనవరి 2019 వరకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్గా పనిచేశాడు.
అక్టోబరు 18 మార్టినా నవ్రతిలోవా, మహిళా టెన్నిస్ క్రీడాకారిణి.