ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 24 తొలి భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శితమైన ఏకైక దక్షిణ భారత చిత్రంగా కె.వి.రెడ్డి తీసిన పాతాళ భైరవి నిలిచింది. భారత్
  • జనవరి 24 బొంబాయిలో జరిగిన తొలి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శితమైన తొలి దక్షిణ భారత చిత్రంగా తెలుగు సినిమా 'పాతాళ భైరవి' చరిత్ర సృష్టించింది.
  • ఫిబ్రవరి 6 విక్టోరియా మహారాణి అనంతరం ఎలిజబెత్ II యునైటెడ్ కింగ్డం మహారాణిగా కిరీటాన్ని ధరించింది.
  • ఫిబ్రవరి 24 ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇ.ఎస్.ఇ.సి) వార్షికోత్సవము. ఇ.ఎస్.ఇ.సి. మొదటిసారిగా కాన్పుర్, ఢిల్లీలలో ప్రారంభించారు. ది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్ చట్టం 1948 ఆధారంగా ఇ.ఎస్.ఐ.సి. ఏర్ఫడింది. చూడు. భారత్
  • మార్చి 6 హైదరాబాదు రాజ్యంలో బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
  • ఏప్రిల్ 20 దామోదరం సంజీవయ్య రాజాజీ మంత్రివర్గంలో మద్రాసు రాష్ట్ర మున్సిపల్, సహకార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
  • మే 2 ప్రపంచంలోని మొట్టమొదటి జెట్ లైనర్ (ది డె హావిల్లాండ్ కామెట్ 1) లండన్ నుంచి జోహన్నెస్ బర్గ్ కి తన మొట్టమొదటి ప్రయాణం చేసి, 'జెట్ యుగాని' కి తెరతీసింది.
  • మే 12 'గజ్ సింగ్' జోధ్‌పూర్ మహారాజుగా కిరీట ధారణ జరిగింది.
  • మే 13 భారతదేశంలో మొట్టమొదటి రాజ్యసభ సమావేశం జరిగింది. భారత్
  • మే 15 భారత లోక్‌సభ స్పీకర్‌గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు. భారత్
  • జూన్ 22 విశాలాంధ్ర, తెలుగు దినపత్రిక ప్రారంభమైంది.
  • జూలై 23 ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం).
  • అక్టోబరు 2 సంఘ ప్రెంపుదల కార్యక్రమం ప్రారంభమైంది.
  • అక్టోబరు 7 పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్ ఎంపిక. భారత్
  • అక్టోబరు 19 ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని కోరుతూ పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టాడు.
  • అక్టోబరు 19 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు మద్రాసులోని బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
  • అక్టోబరు 19 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట నిరాహారదీక్ష ఆరంభించారు.
  • డిసెంబరు 15 ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పొట్టి శ్రీరాములు అర్ధరాత్రి అమరులయ్యారు; తెలుగునాట ఆందోళనలు పెల్లుబికాయి.
  • డిసెంబరు 15 58 రోజుల ఆమరణ దీక్షతో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం కోసం రాత్రి 11.23 గంటలకు ప్రాణత్యాగం చేశారు.
  • డిసెంబరు 19 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు.
  • డిసెంబరు 19 మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించారు. భారత్
  • డిసెంబరు 19 పొట్టి శ్రీరాములు బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును ప్రధాని నెహ్రూ ప్రకటించారు.

జననాలు

  • జనవరి 1 నానా పటేకర్, నటుడు.
  • జనవరి 1 గౌరీ శంకర్ బైసెన్, రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు. భారత్
  • జనవరి 15 జనువాడ రామస్వామి, చెందిన కవి, రచయిత, విశ్రాంత ఆచార్యుడు.
  • జనవరి 18 వీరప్పన్, చందనం చెట్ల స్మగ్లర్.
  • జనవరి 24 సి.ఉమామహేశ్వర రావు, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
  • జనవరి 25 సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (మ.1999).
  • జనవరి 27 ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (మ.2018).
  • ఫిబ్రవరి 14 సుష్మాస్వరాజ్, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు. భారత్
  • ఫిబ్రవరి 15 రాధా రెడ్డి, కూచిపూడి కళాకారులు, నాట్య గురువులు.
  • ఫిబ్రవరి 19 ఆలపాటి లక్ష్మి, రంగస్థల, సినిమా, ధారావాహిక నటి.
  • మార్చి 1 సాగర్(విద్యాసాగర్ రెడ్డి) తెలుగు చలన చిత్ర దర్శకుడు.(2023).
  • మార్చి 1 పొన్ రాధాకృష్ణన్, తమిళనాడుకు చెందిన రాజకీయనాయకుడు. లోకసభ సభ్యుడు. కేంద్ర సహాయమంత్రి. భారత్
  • మార్చి 7 వివియన్ రిచర్డ్స్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్.
  • మార్చి 19 మోహన్ బాబు, తెలుగు సినిమా నటుడు.
  • మార్చి 19 బాబూ మోహన్ , తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు.
  • మార్చి 21 తాతినేని లక్ష్మీ వరప్రసాద్ , తెలుగు, హిందీ, బెంగాలీ, మరాఠీ చిత్రాల దర్శకుడు, రచయత, నిర్మాత.
  • మార్చి 29 కె.ఎన్‌.వై.పతంజలి, తెలుగు రచయిత. (మ.2009).
  • ఏప్రిల్ 10 స్టీవెన్ సీగల్, అమెరికా యాక్షన్ చలన చిత్ర నటుడు, నిర్మాత, రచయిత, యుద్ధ కళాకారుడు, గిటారు వాద్యకారుడు.
  • ఏప్రిల్ 10 నారాయణ్‌ రాణె, మహారాష్ట్రకు మాజీ ముఖ్యమంత్రి. భారత్
  • ఏప్రిల్ 24 చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (మ.2016).
  • మే 1 టి.జీవన్ రెడ్డి, 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి.
  • మే 29 అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (మ.2018).
  • మే 30 ఎల్.బీ. శ్రీరాం ,తెలుగు నటుడు,రచయిత , దర్శకుడు.
  • జూన్ 1 సబ్బం హరి, రాజకీయనాయకుడు.
  • జూన్ 3 బండి నారాయణస్వామి, కథారచయిత, నవలాకారుడు. 'స్వామి' పేరుతో పేరొందాడు.
  • జూలై 2 భానుచందర్ , తెలుగు ,తమిళ, చిత్రాల నటుడు, దర్శకుడు.
  • జూలై 25 లోకనాథం నందికేశ్వరరావు, నాలుగు దశాబ్దాలుగా మిమిక్రీ, వెంట్రిలాక్విజం ప్రదర్శనలలో తనదైన గుర్తింపును స్వంతం చేసుకున్నారు.
  • ఆగస్టు 2 పాల్ డేవిడ్ క్రూస్ ఎస్సీ, హంతకుడు -ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బి.ఐ) మోస్ట్ వాంటెడ్ జాబితా లోని వ్యక్తి.
  • ఆగస్టు 13 ప్రతాప్ పోతన్, తెలుగు తమిళ, హిందీ, మలయాళ, చిత్రాల నటుడు, నిర్మాత, దర్శకుడు. (మ.2022).
  • ఆగస్టు 13 హిందీ చలనచిత్ర నటీమణి యోగీతా బాలీ జననం. భారత్
  • ఆగస్టు 21 గౌతమ్ రాధాకృష్ణ దేసిరాజు, క్రిస్టల్ ఇంజనీరింగ్, ఉదజని బంధం.
  • ఆగస్టు 25 దులీప్ మెండిస్, శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
  • ఆగస్టు 25 విజయ కాంత్ , తమిళ సినిమా నాయకుడు, రాజకీయ నాయకుడు(మ.2023). భారత్
  • సెప్టెంబరు 3 శక్తికపూర్, భారతీయ భాషల నటుడు, హాస్యనటుడు. భారత్
  • సెప్టెంబరు 12 అల్లాబక్షి బేగ్ షేక్‌, రంగస్థల రచయిత, నటుడు.
  • అక్టోబరు 5 కంచ ఐలయ్య, భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. భారత్
  • అక్టోబరు 14 వేదగిరి రాంబాబు, రచయిత (మ.2018).
  • నవంబరు 5 వందన శివ, ఒక తత్త్వవేత్త, పర్యావరణ ఉద్యమకారిణి, పర్యావరణ, స్త్రీవాద రచయిత్రి.
  • నవంబరు 24 బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
  • నవంబరు 25 ఇమ్రాన్ ఖాన్, పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు.
  • నవంబరు 30 జీవా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో ప్రతినాయక, హాస్య పాత్రల నటుడు.
  • డిసెంబరు 10 సుజాత, దక్షిణ భారత సినిమా నటి. (మ.2011). భారత్
  • డిసెంబరు 13 యెర్రగుడిపాటి లక్ష్మి, దక్షిణ భారతీయ నటీమణి, జూలీలో ప్రధాన పాత్ర పోషించిన నటిగా ప్రసిద్ధి చెందింది. భారత్
  • డిసెంబరు 28 ఇండియా - అరుణ్ జైట్లీ, రాజకీయవేత్త. భారత్

మరణాలు

  • మార్చి 7 పరమహంస యోగానంద, భారతదేశంలో గురువు. (జ.1893). భారత్
  • మే 19 బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (జ.1878).
  • జూన్ 27 సి.ఆర్.సుబ్బరామన్, తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు, నిర్మాత (జ.1916).
  • సెప్టెంబరు 9 వేపా కృష్ణమూర్తి, తెలుగువాడైన ఇంజనీరు. (జ.1910).
  • సెప్టెంబరు 22 అడివి బాపిరాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, స్వాంతంత్ర్య సమరయోధుడు, రచయిత, కళాకారుడు, నాటక కర్త. (జ.1895).
  • నవంబరు 21 బెల్లంకొండ సుబ్బారావు, రంగస్థల నటుడు, న్యాయవాది. (జ.1902).
  • డిసెంబరు 15 పొట్టి శ్రీరాములు, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరజీవి.
  • డిసెంబరు 18 గరిమెళ్ళ సత్యనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1893). భారత్

ఈ సంవత్సరపు ప్రస్థానాలు