జనవరి 8 హైదరాబాదు నగర చరిత్రలో అత్యల్పంగా 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
ఫిబ్రవరి 18 18 ఫిబ్రవరి 1946లో ముంబాయిలో ఓడలలోను, రేవులలోను "రాయల్ ఇండియన్ నేవీ"లో పనిచేసే భారతీయ నావికుల సమ్మె, తదనంతర తిరుగుబాటు, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు (RIN Mutiny)గా పిలువబడ్డాయి. ముంబయి రేవులో మొదలైన తిరుగుబాటు కరాచీ నుండి కలకత్తా వరకు వ్యాపించింది. ఇందులో 78 ఓడలు, 20 రేవులు, 20వేల నావికులు పాలు పంచుకున్నారు.
భారత్
ఫిబ్రవరి 18 బొంబాయిలో రాయల్ ఇండియన్ నేవీ నావికుల సమ్మె తిరుగుబాటుగా మారి కరాచీ నుంచి కలకత్తా వరకు వ్యాపించింది.
భారత్
ఫిబ్రవరి 20 నటి, దర్శకురాలు విజయనిర్మల నరసరావుపేట మూలాలున్న కుటుంబంలో జన్మించారు.
మార్చి 22 బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది.
భారత్
ఏప్రిల్ 30 మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు పదవి చేపట్టాడు.
భారత్
జూలై 5 బికినీ ఈత దుస్తులను, పారిస్ ఫేషన్ షో లో, మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు.
ఆగస్టు 1 అమెరికన్ ప్రెసిడెంటు ట్రూమన్ రెండు చారిత్రాత్మకమైన చట్టాల మీద సంతకం చేసాడు. ఒకటి అటామిక్ ఎనర్జీ కమిషన్ చట్టం, మరొకటి పుల్బ్రైట్ స్కాలర్షిప్ చట్టం.
డిసెంబరు 7 ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు.
డిసెంబరు 8 భారత రాజ్యాంగ సభ తొలిసారి సమావేశమైంది.
భారత్
డిసెంబరు 11 భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
భారత్
డిసెంబరు 11 ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
డిసెంబరు 11 సరోజినీ నాయుడు రాజ్యాంగ పరిషత్తులో తన ఏకైక ప్రసంగం చేశారు.
భారత్
జననాలు
జనవరి 1 బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు.
భారత్
జనవరి 1 పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి 14వ లోక్సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
జనవరి 10 వేదవ్యాస రంగభట్టర్, రంగస్థల నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, పాటల రచయిత (మ. 2019).
ఫిబ్రవరి 20 ; విజయ నిర్మల, తెలుగు సినీ నటి, దర్శకురాలు . (మ.2019).
మార్చి 10 పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (మ.2015).
మే 1 కె.సి.శేఖర్బాబు తెలుగు సినిమా నిర్మాత. (మ.2017).
మే 5 రమాప్రభ, హాస్య నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న రమాప్రభ ఎన్నో సినిమాల్లో, ఎంతోమంది సరసన నటించింది.
మే 5 అక్కినేని కుటుంబరావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
మే 8 జయప్రకాశ్ రెడ్డి, రంగస్థల సినీ నటుడు, దర్శకుడు. (మ.2020).
మే 14 అప్పాసాహెబ్ ధర్మాధికారి, మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
భారత్