ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 31 నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది. భారత్
  • ఫిబ్రవరి 8 మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాదులో జన్మించారు.
  • మే 1 సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్).
  • మే 10 పోప్ జాన్ XXIIIకి బల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే.
  • జూన్ 11 బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
  • జూన్ 16 లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.
  • జూన్ 17 దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.
  • జూన్ 24 భారత తంతి తపాలాశాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది. భారత్
  • జూలై 1 అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్‌ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.
  • జూలై 22 బీటిల్స్ (నలుగురు గాయకుల గుంపు) 'ఇంట్రడ్యూసింగ్ ది బీటిల్స్' అనే మొదటి ఆల్బంని విడుదల చేసారు.
  • ఆగస్టు 5 ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి.
  • ఆగస్టు 5 అమెరికా, ప్రయోగించిన రోదసీ నౌక, మారినర్-7, మొట్టమొదటి సారి, కుజగ్రహం చిత్రాలను, ప్రసారంచేసింది.
  • ఆగస్టు 13 ప్రఖ్యాత నటి శ్రీదేవి తమిళనాడులోని శివకాశి సమీపంలో జన్మించారు.
  • ఆగస్టు 30 అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్‌లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
  • అక్టోబరు 6 హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంభించబడింది.
  • అక్టోబరు 29 స్టార్ ఆఫ్ ఇండియాతో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి. భారత్
  • నవంబరు 18 మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
  • డిసెంబరు 1 నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది. భారత్

జననాలు

  • జనవరి 1 అబ్దుల్ హకీం జాని షేక్ - బాలసాహితీవేత్త.
  • జనవరి 4 మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.
  • ఫిబ్రవరి 8 ముహమ్మద్ అజహరుద్దీన్, భారతీయ క్రికెట్ మాజీ కాప్టన్. భారత్
  • మార్చి 1 చరణ్‌జిత్ సింగ్ చన్నీ, రాజకీయ నాయకుడు. పంజాబ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్
  • మార్చి 2 విద్యాసాగర్, సంగీత దర్శకుడు.
  • మార్చి 12 అక్కినేని శ్రీకర్ ప్రసాద్, తెలుగు సినిమా ఎడిటర్. జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీత.
  • మార్చి 17 రోజర్ హార్పర్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
  • మార్చి 31 సుజాత మోహన్ , భారతీయ సినీ నేపథ్య గాయని. భారత్
  • ఏప్రిల్ 1 వినోద్ కుమార్, ప్రముఖ సినీ నటుడు.
  • మే 5 సబితా ఇంద్రారెడ్డి, మంత్రివర్గంలో కీలకమైన హోంశాఖా మంత్రి పదవిని పొంది హోంశాఖా మంత్రిపదవిని అధిష్టించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించింది.
  • మే 23 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు.
  • జూన్ 14 గోనె రాజేంద్ర ప్ర‌సాద్, మోటివేష‌న్ కౌన్సెల‌ర్.
  • జూలై 1 ఎస్.ఎం. బాషా, రంగస్థల నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు.
  • జూలై 27 కె. ఎస్. చిత్ర, మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, ఒరియా, హిందీ, అస్సామీ, బెంగాలీ భాషల సిని నేపథ్య గాయని.
  • జూలై 30 మందాకిని, బాలీవుడ్ నటి.
  • ఆగస్టు 7 సంజయ్ రథ్, భారతీయ జ్యోతిష పండితుడు. భారత్
  • ఆగస్టు 13 శ్రీదేవి, సినిమా నటి (మ. 2018).
  • ఆగస్టు 21 రాధిక తెలుగు, తమిళ చలన చిత్ర కథానాయకి.
  • ఆగస్టు 23 పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత.
  • ఆగస్టు 23 సురేష్ , తెలుగు,తమిళ, మలయాళ చిత్రాల నటుడు.
  • ఆగస్టు 26 వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (మ.2008).
  • ఆగస్టు 27 సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమా నటి.
  • ఆగస్టు 30 ఆనంద్ బాబు, తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల నటుడు.(హాస్యనటుడు నగేష్ కొడుకు).
  • సెప్టెంబరు 1 కోనేటి సుబ్బరాజు, అన్నమయ్య జిల్లాకు చెందిన రంగస్థల నటుడు.
  • సెప్టెంబరు 9 లక్ష్మీ. టి, రంగస్థల నటి.
  • సెప్టెంబరు 21 కర్ట్‌లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
  • అక్టోబరు 31 సారా జేన్ బ్రౌన్.
  • నవంబరు 3 పైడి తెరేష్ బాబు, కవి. (మ.2014).
  • నవంబరు 16 మీనాక్షి శేషాద్రి , భారతీయ చలనచిత్ర నటి, నృత్య కారిణి. భారత్
  • డిసెంబరు 14 భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. భారత్

మరణాలు

  • ఫిబ్రవరి 28 బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884). భారత్
  • మార్చి 16 ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889). భారత్
  • మార్చి 24 అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.
  • ఏప్రిల్ 14 రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (జ.1893).
  • జూన్ 11 టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు.
  • జూలై 4 పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత. భారత్
  • ఆగస్టు 30 రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (జ.1885).
  • సెప్టెంబరు 8 గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915).
  • సెప్టెంబరు 15 పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892). భారత్
  • అక్టోబరు 8 సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (జ.1907).
  • నవంబరు 20 జీ: రామనాదన్ , సంగీత దర్శకుడు.
  • నవంబరు 22 జాన్ ఎఫ్ కెనడి, అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 35వ అధ్యక్షుడు. (జ.1917).

సినిమా

  • ఫిబ్రవరి 6 'పెంపుడు కూతురు' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 9 'వాల్మీకి' చిత్రం విడుదలైంది.
  • మే 9 'పరువు ప్రతిష్ఠ (1963 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • మే 29 'ఆప్తమిత్రులు' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 29 'పునర్జన్మ (1963 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 7 'మంచి చెడు' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు