జనవరి 31 నెమలిని జాతీయ పక్షిగా భారత్ ప్రకటించింది.
భారత్
ఫిబ్రవరి 8 మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాదులో జన్మించారు.
మే 1 సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్).
మే 10 పోప్ జాన్ XXIIIకి బల్జాన్ శాంతి బహుమతి పొందాడు. ఇప్పటివరకు ఒక పోప్ (క్రైస్తవ మతాధిపతి) కి ప్రదానం చేసిన మొదటి శాంతి బహుమతి ఇదే.
జూన్ 11 బౌద్ధ భిక్షువులపై జరుగుతున్న అమానుష దాడులకు నిరసనగా దక్షిణ వియత్నాంలోని సైగాన్ పట్టణపు కూడలిలో టాయ్ క్వాంగ్ డుచ్ అనే బౌద్ధ భిక్షువు నిప్పంటించుకొని నిలువునా దహనమయ్యాడు.
జూన్ 16 లెఫ్టినెంట్ వాలెంటీనా తెరెష్కోవా తన 26వ ఏట, మొట్టమొదటి మహిళా రోదసీ యాత్రికురాలుగా (రోదసీలోనికి వెళ్ళిన 5వ వ్యక్తి),వోస్తోక్-6 (రోదసీ నౌక పేరు) లో, రోదసీలోనికి ప్రయాణించింది. ఆమె 2 రోజుల్ 22 గంటల 50 నిమిషములలో, భూమి ఛుట్టూ 49 సార్లు తిరిగి 12,50,000 మైళ్ళూ ప్రయాణించింది.
జూన్ 24 భారత తంతి తపాలాశాఖ టెలెక్స్ సేవలను ప్రారంభించింది.
భారత్
జూలై 1 అమెరికాలోని తపాలా కార్యాలయాలు 5 అంకెలు గల జిప్ కోడ్ను (జోనల్ ఇంప్రూవ్ మెంట్ ప్లాన్) ప్రవేశపెట్టాయి.
జూలై 22 బీటిల్స్ (నలుగురు గాయకుల గుంపు) 'ఇంట్రడ్యూసింగ్ ది బీటిల్స్' అనే మొదటి ఆల్బంని విడుదల చేసారు.
ఆగస్టు 5 ఆణ్వస్త్రాలు, భూమిలోపలే పరీక్షించాలి (వాతావరణంలో గాని, రోదసీలో గాని, నీటిలోపల గాని పరీక్షించకూడదు) అన్న మినహాయింపుతో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్ దేశాలు సంతకాలు చేసాయి.
ఆగస్టు 5 అమెరికా, ప్రయోగించిన రోదసీ నౌక, మారినర్-7, మొట్టమొదటి సారి, కుజగ్రహం చిత్రాలను, ప్రసారంచేసింది.
ఆగస్టు 13 ప్రఖ్యాత నటి శ్రీదేవి తమిళనాడులోని శివకాశి సమీపంలో జన్మించారు.
ఆగస్టు 30 అమెరికా అధ్యక్షుడు (శ్వేత సౌధము), రష్యా అధ్యక్షుడు (క్రెమ్లిన్) మధ్య హాట్లైన్ (టెలిఫోన్ సర్వీసు) ప్రారంభమైంది. ఎందుకంటే, అనుకోకుండా, రెండు దేశాల మధ్య ప్రమాదవశాత్తు యుద్ధం జరిగితే ఆపటానికి.
అక్టోబరు 6 హైదరాబాదులో నెహ్రూ జంతుప్రదర్శనశాల ప్రారంభించబడింది.
అక్టోబరు 29 స్టార్ ఆఫ్ ఇండియాతో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్కు లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి.
భారత్
నవంబరు 18 మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
డిసెంబరు 1 నాగాలాండ్ భారతదేశానికి 16 వ రాష్ట్రంగా అవతరించింది.
భారత్
నవంబరు 16 మీనాక్షి శేషాద్రి , భారతీయ చలనచిత్ర నటి, నృత్య కారిణి.
భారత్
డిసెంబరు 14 భరత్ అరుణ్ భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు.
భారత్
మరణాలు
ఫిబ్రవరి 28 బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884).
భారత్
మార్చి 16 ఎం. పతంజలి శాస్త్రి, భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889).
భారత్
మార్చి 24 అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.
ఏప్రిల్ 14 రాహుల్ సాంకృత్యాయన్, రచయిత, చరిత్రకారుడు, కమ్యూనిస్టు నాయకుడు (జ.1893).
జూన్ 11 టాయ్ క్వాంగ్ డుచ్, దక్షిణ వియత్నాం బౌద్ధ భిక్షువు.
జూలై 4 పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.
భారత్
ఆగస్టు 30 రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (జ.1885).
సెప్టెంబరు 8 గరికపాటి రాజారావు, తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రయోక్త, ఆంధ్ర ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు. (జ.1915).
సెప్టెంబరు 15 పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892).
భారత్
అక్టోబరు 8 సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (జ.1907).