జనవరి 15 స్టీవ్ జాబ్స్ మ్యాక్బుక్ ఎయిర్ని విడుదల చేసారు.
జనవరి 17 టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు.
భారత్
జనవరి 25 గాయని పి. సుశీలను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
జనవరి 29 మార్కెట్లోకి మ్యాక్బుక్ ఎయిర్ విడుదల చేయబడింది.
ఫిబ్రవరి 5 వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
ఫిబ్రవరి 9 ప్రసిద్ధ గాంధేయవాది, కుష్టువ్యాధి పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే,మెగసెసే అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
ఫిబ్రవరి 14 దామోదరం సంజీవయ్య గౌరవార్థం భారత తపాలా శాఖ స్మారక స్టాంపు విడుదల చేసింది.
ఫిబ్రవరి 19 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.
ఫిబ్రవరి 25 క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
ఫిబ్రవరి 29 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్సభలో ప్రవేశపెట్టినాడు.
భారత్
మార్చి 1 బంగ్లాదేశ్తో చిట్టగాంగ్లో జరుగిన టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
మార్చి 2 కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది.
భారత్
మార్చి 3 రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
మార్చి 3 తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ మరోసారి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మార్చి 14 హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
మార్చి 15 హైదరాబాదు శివారు శంషాబాద్లో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది.
మార్చి 20 నటభూషణగా పేరొందిన ప్రముఖ తెలుగు కథానాయకుడు శోభన్ బాబు చెన్నైలో మరణించారు.
మార్చి 24 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.
మార్చి 25 పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
భారత్
మార్చి 26 భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
భారత్
మార్చి 27 వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.
మే 8 తెలుగు వికీపీడియా 40,000 వ్యాసాల మైలు రాయిని దాటిన రోజు.
మే 12 చైనాలోని సిచుయాన్లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.
మే 13 పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.
మే 20 తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
మే 22 నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
మే 28 సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
మే 30 కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.
భారత్
జూన్ 5 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది.
భారత్
జూలై 1 ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.
భారత్
జూలై 8 కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
జూలై 8 మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
జూలై 10 సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
ఆగస్టు 1 భారతదేశంకు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది.
భారత్
ఆగస్టు 3 హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు.
ఆగస్టు 8 రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం.
ఆగస్టు 11 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్కు ఇదే తొలిసారి.
భారత్
ఆగస్టు 13 చైనా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల లోని కొంతభాగం మోస పూరితమని, అధికారులు, అంగీకరించారు.
ఆగస్టు 14 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.
ఆగస్టు 17 నటుడు చిరంజీవి తన రాజకీయ రంగ ప్రవేశాన్ని పత్రికా ముఖంగా ప్రకటించారు.
ఆగస్టు 18 పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ తన రాజీనామాను ప్రకటించాడు.
ఆగస్టు 26 తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.
ఆగస్టు 26 చిరంజీవి తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ఆవిష్కరించారు.
సెప్టెంబరు 1 భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు.
భారత్
సెప్టెంబరు 1 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
సెప్టెంబరు 17 థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్సవత్ ఎన్నికైనాడు.
భారత్
సెప్టెంబరు 27 చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
సెప్టెంబరు 27 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు.
భారత్
సెప్టెంబరు 28 అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
భారత్
సెప్టెంబరు 30 రాజస్థాన్ లోని జోధ్పూర్లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు.
భారత్
అక్టోబరు 2 భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
భారత్
అక్టోబరు 22 భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది.
భారత్
అక్టోబరు 22 ఇస్రో తొలి చంద్ర యాత్ర చంద్రయాన్-1ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించింది.
భారత్
నవంబరు 8 ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది.
భారత్