ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 15 స్టీవ్ జాబ్స్ మ్యాక్‌బుక్ ఎయిర్ని విడుదల చేసారు.
  • జనవరి 17 టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు. భారత్
  • జనవరి 25 గాయని పి. సుశీలను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
  • జనవరి 29 మార్కెట్లోకి మ్యాక్‌బుక్ ఎయిర్ విడుదల చేయబడింది.
  • ఫిబ్రవరి 5 వన్డే క్రికెట్ లో సచిన్ టెండుల్కర్ 16000 పరుగులు పూర్తి చేసిన ఘనతను పొందినాడు.
  • ఫిబ్రవరి 9 ప్రసిద్ధ గాంధేయవాది, కుష్టువ్యాధి పీడుతులపాలిట ఆపద్భాందవుడుగా పిలువబడే మురళిదాస్ దేవదాస్ ఆమ్టే (బాబా ఆమ్టే,మెగసెసే అవార్డు గ్రహీత) దివంగతులయ్యారు.
  • ఫిబ్రవరి 14 దామోదరం సంజీవయ్య గౌరవార్థం భారత తపాలా శాఖ స్మారక స్టాంపు విడుదల చేసింది.
  • ఫిబ్రవరి 19 1959 నుంచి అధికారంలో ఉన్న క్యూబా అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో పదవికి రాజీనామా.
  • ఫిబ్రవరి 25 క్యూబా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో సోదరుడు రాల్ క్యాస్ట్రో ఎన్నికయ్యాడు.
  • ఫిబ్రవరి 29 2008-09 సంవత్సరపు భారతదేశపు ఆర్థిక బడ్జెట్‌ను ఆర్థికమంత్రి చిదంబరం లోక్‌సభలో ప్రవేశపెట్టినాడు. భారత్
  • మార్చి 1 బంగ్లాదేశ్తో చిట్టగాంగ్లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
  • మార్చి 2 కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ లో భారత్ విజేతగా నిలిచింది. భారత్
  • మార్చి 3 రష్యా అధ్యక్ష ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
  • మార్చి 3 తెలంగాణ ఉద్యమంలో భాగంగా కేసీఆర్ మరోసారి లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
  • మార్చి 14 హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ చే ప్రారంభోత్సవం జరిగింది.
  • మార్చి 15 హైదరాబాదు శివారు శంషాబాద్‌లో కొత్తగా నిర్మించిన రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది.
  • మార్చి 20 నటభూషణగా పేరొందిన ప్రముఖ తెలుగు కథానాయకుడు శోభన్ బాబు చెన్నైలో మరణించారు.
  • మార్చి 24 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.
  • మార్చి 25 పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు. భారత్
  • మార్చి 26 భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. భారత్
  • మార్చి 27 వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.
  • మే 8 తెలుగు వికీపీడియా 40,000 వ్యాసాల మైలు రాయిని దాటిన రోజు.
  • మే 12 చైనాలోని సిచుయాన్లో రెక్టర్ స్కేల్ మీద 8.0 మేగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం వచ్చి, 69,000 మంది మరణించారు.
  • మే 13 పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.
  • మే 20 తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
  • మే 22 నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
  • మే 28 సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన తరువాత నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
  • మే 30 కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం. భారత్
  • జూన్ 5 3000 మీటర్ల పరుగులో సురేంద్రసింగ్ భారత జాతీయ రికార్డు సృష్టించాడు. 16 సంవత్సరాల బహదూర్ ప్రసాద్ రికార్డు ఛేదించబడింది. భారత్
  • జూలై 1 ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది. భారత్
  • జూలై 8 కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
  • జూలై 8 మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
  • జూలై 10 సల్మాన్ రష్డీ రచించిన నవల "మిడ్‌నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
  • ఆగస్టు 1 భారతదేశంకు చెందిన వైద్య దంపతులు ప్రకాష్ ఆమ్టే, మందాకినీ ఆమ్టేలకు రామన్ మెగ్సేసే అవార్డు లభించింది. భారత్
  • ఆగస్టు 3 హిమాచల్ ప్రదేశ్ లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 145 మంది భక్తులు మృతి చెందారు.
  • ఆగస్టు 8 రాత్రి 8 గంటల 8 సెకెన్లకు చైనా దేశపు రాజధాని బీజింగ్ నగరములో 2008 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం.
  • ఆగస్టు 11 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో అభినవ్ బింద్రా షూటింగ్‌ లో స్వర్ణపతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో స్వర్ణపతకం రావడం భారత్‌కు ఇదే తొలిసారి. భారత్
  • ఆగస్టు 13 చైనా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల లోని కొంతభాగం మోస పూరితమని, అధికారులు, అంగీకరించారు.
  • ఆగస్టు 13 ఒలింపిక్ ముఖ్యాంశాలు: 2008 ఆగష్టు 13.
  • ఆగస్టు 14 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికను కేంద్ర ప్రభుత్వం చిన్న చిన్న మార్పులతో ఆమోదించింది.
  • ఆగస్టు 17 నటుడు చిరంజీవి తన రాజకీయ రంగ ప్రవేశాన్ని పత్రికా ముఖంగా ప్రకటించారు.
  • ఆగస్టు 18 పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ తన రాజీనామాను ప్రకటించాడు.
  • ఆగస్టు 26 తెలుగు సినిమా నటుడు చిరంజీవి, ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు.
  • ఆగస్టు 26 చిరంజీవి తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించి ప్రజారాజ్యం పార్టీని ఆవిష్కరించారు.
  • సెప్టెంబరు 1 భారతీయ రిజర్వ్ బాంక్ గవర్నర్‌గా దువ్వూరి సుబ్బారావు నియమితుడైనాడు. భారత్
  • సెప్టెంబరు 1 ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
  • సెప్టెంబరు 17 థాయిలాండ్ ప్రధానమంత్రిగా పీపుల్ పవర్ పార్టీకి చెందిన సొంచాయ్ వాంగ్‌సవత్ ఎన్నికైనాడు. భారత్
  • సెప్టెంబరు 27 చైనా టైకోనాట్ ఝూయ్ జియాంగ్ రోదసీ నడక చేయడంతో ఈ ఘనత సాధించిన మూడవ దేశంగా చైనా ఆవిర్బవించింది.
  • సెప్టెంబరు 27 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితుడైనాడు. భారత్
  • సెప్టెంబరు 28 అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది. భారత్
  • సెప్టెంబరు 30 రాజస్థాన్ లోని జోధ్‌పూర్లో చాముండీ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 మంది భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు. భారత్
  • అక్టోబరు 2 భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది. భారత్
  • అక్టోబరు 22 భారతదేశం తొలి మానవరహిత చంద్రమండల నౌక చంద్రయాన్-1ను ప్రయోగించింది. భారత్
  • అక్టోబరు 22 ఇస్రో తొలి చంద్ర యాత్ర చంద్రయాన్-1ను సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించింది. భారత్
  • నవంబరు 8 ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 వ్యోమనౌక విజయవంతంగా చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. భారత్
  • నవంబరు 26 ముంబై తీవ్రవాద దాడులు. భారత్
  • డిసెంబరు 11 చెన్నైలోని ఎంజీఆర్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సానియా మీర్జాకు డాక్టర్ ఆఫ్ లెటర్స్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
  • డిసెంబరు 30 హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.

మరణాలు

  • జనవరి 1 ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి. భారత్
  • జనవరి 6 శోభన్, తెలుగు చలనచిత్ర దర్శకుడు (జ.1968).
  • జనవరి 7 ప్రమోద్ కరణ్ సేథీ, జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927).
  • జనవరి 11 ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919).
  • జనవరి 17 బాబీ ఫిషర్, చదరంగం క్రీడాకారుడు. (జ.1943).
  • జనవరి 20 సయ్యద్‌ హుసేన్‌ బాషా, నాటక,చలనచిత్ర నటుడు. కవి. నాటకరచయిత.(జ.1939).
  • జనవరి 27 సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (జ.1921).
  • ఫిబ్రవరి 6 కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (జ.1950).
  • ఫిబ్రవరి 7 లక్ష్మీపతి , తెలుగు హాస్యనటుడు (జ.1957).
  • ఫిబ్రవరి 9 మురళీధర్ దేవదాస్ ఆమ్టే, సంఘసేవకుడు. (జ.1914).
  • ఫిబ్రవరి 25 జస్టిస్ హంస్‌రాజ్ ఖన్నా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. భారత్
  • మార్చి 3 నగ రాజ కుమారి, వాహినీ సంస్థ వారి దేవత, సుమంగళి వంటి చిత్రాలలో నటించిన నటీమణి.గాయనీ(జ.1921).
  • మార్చి 19 రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (జ.1958). భారత్
  • మార్చి 20 శోభన్ బాబు, తెలుగు సినీ నటుడు. (జ.1937).
  • మే 1 నిర్మలా దేశ్‌పాండే, గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు. (జ.1929). భారత్
  • మే 19 విజయ్ టెండూల్కర్, రచయిత మరణం (జ.1928).
  • జూన్ 14 నాగబైరవ కోటేశ్వరరావు‎, కవి, సాహితీవేత్త, సినిమా మాటల రచయిత. (జ.1931).
  • జూన్ 22 జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, రచయిత. (జ.1937).
  • జూన్ 24 మల్లికార్జునరావు, తెలుగు సినీ, రంగస్థల హాస్యనటులు (జ.1960).
  • జూన్ 27 మానెక్‌షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (జ.1914). భారత్
  • జూలై 7 వాడపల్లి వెంకటేశ్వరరావు, దౌత్యవేత్త, కీర్తిచక్ర పొందిన మొట్టమొదటి సైనికేతర పౌరుడు. (జ.1963).
  • ఆగస్టు 3 పువ్వుల లక్ష్మీకాంతం, తొలితరం సినిమా నటి, గాయని, నర్తకీమణి, రంగస్థల నటి.
  • ఆగస్టు 13 శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7' 7 1/4" (232 సెంటిమీటర్లు)), (జ.1955).
  • ఆగస్టు 30 కృష్ణ కుమార్ బిర్లా, పారిశ్రామికవేత్త, బిర్లా గ్రూపుల అధినేత. (జ.1918).
  • సెప్టెంబరు 22 కొండముది శ్రీరామచంద్ర మూర్తి, నవలలు, సినికథా రచయిత.(జ. ).
  • సెప్టెంబరు 26 పాల్ న్యూమాన్, అమెరికన్ నటుడు, చిత్ర దర్శకుడు, సాహసికుడు, మానవతావాది. (జ.1925).
  • సెప్టెంబరు 29 జాగర్లమూడి వీరాస్వామి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ గా, కులనిర్మూలన సంఘ అధ్యక్షునిగా చేశాడు (జ.1919).
  • సెప్టెంబరు 29 పేర్వారం జగన్నాధం, తెలుగు కవి, విమర్శకుడు, విద్యావేత్త (జ.1934).
  • సెప్టెంబరు 29 సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ, ఎం.ఐ.ఎం పార్టీ నాయకుడు. (జ.1931).
  • అక్టోబరు 8 చిటిమెళ్ళ బృందావనమ్మ, విద్యావేత్త సంఘ సేవకురాలు, చిత్రకారిణి. (జ.1917).
  • అక్టోబరు 20 సి.వి శ్రీధర్, తమిళ, తెలుగు, హిందీ చిత్రాల దర్శకుడు, నిర్మాత, రచయత(జ.1933).
  • నవంబరు 26 "ఏంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్" అధిపతి హేమంత్ కర్కరే.
  • నవంబరు 26 ముంబై పోలీసు అడిషనల్ కమీషనర్ అశోక్ కాంమ్టే. భారత్
  • నవంబరు 26 సీనియర్ పోలీసు అధికారి, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ సలస్కర్.
  • నవంబరు 27 విశ్వనాధ్ ప్రతాప్ సింగ్, భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి. (జ.1931). భారత్
  • డిసెంబరు 2 ఎం. కె. జగన్నాథరాజా, బహుభాషాపండితుడు. ఆముక్తమాల్యదను తమిళంలోనికి అనువదించాడు. (జ.1933). భారత్
  • డిసెంబరు 5 కొమ్మినేని శేషగిరిరావు,. తెలుగుసినిమా దర్శకుడు, నటుడు (జ.1939).
  • డిసెంబరు 5 మహ్మద్ ఇస్మాయిల్, సాహితీకారుడు (జ.1943).
  • డిసెంబరు 14 జ్వాలాముఖి, రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. (జ.1938). భారత్

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు