జూన్ 18 ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ని స్థాపించారు.
జూలై 22 అమి వాండెర్బిల్ట్. ఈమె 'కంప్లీట్ బుక్ ఆఫ్ ఎటికెట్ (ఎటిక్వెట్) రాసింది. ఎటికెట్ అంటే మర్యాదలు అనుకోవచ్చును. ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఈ పదాన్ని సరిగా నిర్వచించలేదు.
జూలై 22 విలియం లారెంజ్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) '#665 సబినె (సబిన్) ' ని కనుగొన్నాడు.
జూలై 23 'ఎ. కోఫ్' #666 డెస్డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు.
సెప్టెంబరు 9 ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై).
సెప్టెంబరు 28 మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
నవంబరు 16 ప్రఖ్యాత దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు.
జననాలు
జనవరి 1 లీలా మిశ్రా, హిందీ చలనచిత్ర నటి. (మ.1988).
భారత్
జనవరి 17 ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994).
ఫిబ్రవరి 4 మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969).
మార్చి 1 ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకులు. (మ.1986).
మార్చి 30 దేవికారాణి, భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994).
భారత్
ఏప్రిల్ 5 జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
భారత్
ఏప్రిల్ 13 బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది.
ఏప్రిల్ 26 సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1992).
భారత్
మే 15 వింజమూరి శివరామారావు, ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. (మ.1982).
మే 19 మానిక్ బందోపాధ్యాయ, బెంగాలీ నవలా రచయిత జననం. (మ.1956).