ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 12 చాలా దూర ప్రాంతాలకు రేడియో సందేశాలను ఈఫిల్ టవర్ నుండి మొట్టమొదటిసారి ప్రసారం చేసారు.
  • జనవరి 17 ప్రఖ్యాత దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా సోమవరప్పాడు గ్రామంలో జన్మించారు.
  • ఏప్రిల్ 27 నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్లో ప్రారంభమయ్యాయి.
  • ఏప్రిల్ 30 ముజఫర్‌పూర్‌లో విప్లవకారులు ఖుదీరాం బోస్, ప్రఫుల్ల చాకి బ్రిటిష్ న్యాయమూర్తి కింగ్స్‌ఫర్డ్‌పై బాంబు దాడికి యత్నించారు. భారత్
  • మే 10 మదర్స్ డే మొట్ట మొదటి సారిగా అమెరికా లోన పడమటి వర్జీనియా లోని గ్రాఫ్టన్ అనే వూరిలో జరిగింది.
  • మే 12 'నాథన్ బి. స్టబ్‌ల్‌ఫీల్డ్' 'వైర్‌లెస్ రేడియో ప్రసారానికి' పేటెంట్ హక్కులు తీసుకున్నాడు.
  • మే 14 ప్రయాణీకులతో మొదటి విమానం ఎగిరిన రోజు.
  • జూన్ 5 తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి భువనగిరి మండలం బొల్లేపల్లిలో జన్మించారు.
  • జూన్ 15 కలకత్తా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆరంభము. భారత్
  • జూన్ 18 ఫిలిప్పీన్స్ దేశపు యూనివర్సిటీ అయిన యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పీన్స్ని స్థాపించారు.
  • జూలై 22 అమి వాండెర్‌బిల్ట్. ఈమె 'కంప్లీట్ బుక్ ఆఫ్ ఎటికెట్ (ఎటిక్వెట్) రాసింది. ఎటికెట్ అంటే మర్యాదలు అనుకోవచ్చును. ఎందుకంటే ఇంగ్లీషులో కూడా ఈ పదాన్ని సరిగా నిర్వచించలేదు.
  • జూలై 22 విలియం లారెంజ్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) '#665 సబినె (సబిన్) ' ని కనుగొన్నాడు.
  • జూలై 23 'ఎ. కోఫ్' #666 డెస్‌డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు.
  • సెప్టెంబరు 9 ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది. 1914 ఏప్రిల్ 1 నాడు దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై).
  • సెప్టెంబరు 28 మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
  • నవంబరు 16 ప్రఖ్యాత దర్శక నిర్మాత బి.ఎన్.రెడ్డి కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లి గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు.

జననాలు

  • జనవరి 1 లీలా మిశ్రా, హిందీ చలనచిత్ర నటి. (మ.1988). భారత్
  • జనవరి 17 ఎల్.వి.ప్రసాద్, తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994).
  • ఫిబ్రవరి 4 మఖ్దూం మొహియుద్దీన్, కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969).
  • మార్చి 1 ఖండవల్లి లక్ష్మీరంజనం, సాహిత్యవేత్త, పరిశోధకులు. (మ.1986).
  • మార్చి 30 దేవికారాణి, భారతీయ నటి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994). భారత్
  • ఏప్రిల్ 5 జగ్జీవన్ రాం, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. భారత్
  • ఏప్రిల్ 13 బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది.
  • ఏప్రిల్ 26 సర్వ్ మిత్ర సిక్రి, భారతదేశ సుప్రీంకోర్టు పదమూడవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 1992). భారత్
  • మే 15 వింజమూరి శివరామారావు, ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. (మ.1982).
  • మే 19 మానిక్ బందోపాధ్యాయ, బెంగాలీ నవలా రచయిత జననం. (మ.1956).
  • మే 19 జేమ్స్ స్టీవర్ట్, అమెరికన్ నటుడు.
  • మే 30 రాచర్ల తిప్పయ్య గుప్త, కవి, రచయిత.
  • జూన్ 5 రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (మ.1991).
  • జూన్ 10 ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
  • జూలై 7 కొమ్మూరి పద్మావతీదేవి, తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ. 1970).
  • ఆగస్టు 5 చక్రపాణి, బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత, దర్శకులు. (మ.1975).
  • ఆగస్టు 17 పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1966).
  • ఆగస్టు 24 రాజ్ గురు, స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, భగత్ సింగ్ సహచరుడు. (మ.1931). భారత్
  • ఆగస్టు 27 డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001).
  • ఆగస్టు 27 లిండన్ బి జాన్సన్, రాజకీయవేత్త, రచయిత. (మ.1973).
  • సెప్టెంబరు 3 జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన వ్యక్తి. (మ.1953).
  • సెప్టెంబరు 8 చెలికాని అన్నారావు, తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి.
  • అక్టోబరు 1 గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (మ.1974).
  • అక్టోబరు 2 పర్వతనేని బ్రహ్మయ్య, ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980).
  • అక్టోబరు 6 ఈశ్వరప్రభు, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు.
  • అక్టోబరు 10 ముదిగొండ లింగమూర్తి, పాత తరానికి చెందిన నటుడు (1980).
  • అక్టోబరు 15 జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్, ఆర్థికవేత్త. (జ.2006).
  • నవంబరు 8 రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత (మ.2006).
  • నవంబరు 16 బి.ఎన్.రెడ్డి, తెలుగు సినిమా దర్శకులు. (మ.1977).
  • డిసెంబరు 1 నార్ల వేంకటేశ్వరరావు, ప్రఖ్యాత పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం (మ.1985).
  • డిసెంబరు 9 రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995). భారత్

మరణాలు

  • ఫిబ్రవరి 26 కొడాలి లక్ష్మీనారాయణ , గ్రంథాలయ పరిశోధకులు, ఉత్తమ ఉపాధ్యాయులు. (జ.1908).
  • మే 16 దాసు శ్రీరాములు, కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు.
  • జూన్ 24 గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1837).
  • ఆగస్టు 11 ఖుదీరాం బోస్, భారతీయ స్వాతంత్ర్య సమర వీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు (జ.1889). భారత్
  • ఆగస్టు 25 హెన్రీ బెక్వెరెల్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు