జనవరి 14 హాస్యబ్రహ్మగా పేరొందిన రచయిత, దర్శకుడు జంధ్యాల పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు.
మార్చి 15 కె. విశ్వనాథ్ పాతాళ భైరవి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో అడుగుపెట్టారు.
మార్చి 15 కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన జానపద చిత్రరాజం పాతాళ భైరవి విడుదలైంది.
మే 12 మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు)ను 'ఎనెవెటక్ అటోల్' అనే చోట పరీక్షించారు.
మే 24 అమెరికా 'ఎన్వెటక్' అనేచోట వాతావరణంలో 'అణుపాటవపరీక్ష' ను చేసింది.
అక్టోబరు 2 శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ను స్థాపించారు.
భారత్
అక్టోబరు 25 భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి.
భారత్
నవంబరు 5 పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి.
నవంబరు 19 మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును.
భారత్
డిసెంబరు 16 సాలార్జంగ్ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించాడు.
భారత్
డిసెంబరు 20 బి.ఎన్.రెడ్డి రూపొందించిన మల్లీశ్వరి తెలుగు సినీ చరిత్రలో అపురూప దృశ్యకావ్యంగా ఖ్యాతి గాంచింది.
డిసెంబరు 20 మల్లీశ్వరి చిత్రానికి పాటలు రాసి దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీరంగ ప్రవేశం చేశారు.
డిసెంబరు 20 ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలై ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి.
జననాలు
జనవరి 1 వేణు సంకోజు, కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు.
జూలై 3 రిచర్డ్ హాడ్లీ, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
జూలై 10 మెడియం బాబూరావ్, భద్రాచలం లోక్సభ నియోజకవర్గం నుండి 14 వ లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు.
భారత్
జూలై 11 నారమల్లి డాక్టర్ శివప్రసాద్ , చలనచిత్ర దర్శకుడు , చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు (మ.2019).