ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 14 హాస్యబ్రహ్మగా పేరొందిన రచయిత, దర్శకుడు జంధ్యాల పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు.
  • మార్చి 15 కె. విశ్వనాథ్ పాతాళ భైరవి చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తూ దర్శకత్వ శాఖలో అడుగుపెట్టారు.
  • మార్చి 15 కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన జానపద చిత్రరాజం పాతాళ భైరవి విడుదలైంది.
  • మే 12 మొదటి ఉదజని బాంబు (హైడ్రోజన్ బాంబు)ను 'ఎనెవెటక్ అటోల్' అనే చోట పరీక్షించారు.
  • మే 24 అమెరికా 'ఎన్వెటక్' అనేచోట వాతావరణంలో 'అణుపాటవపరీక్ష' ను చేసింది.
  • అక్టోబరు 2 శ్యామ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. భారత్
  • అక్టోబరు 25 భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి. భారత్
  • నవంబరు 5 పశ్చిమ, మధ్య రైల్వేలు ముంబయిలో ఏర్పాటయ్యాయి.
  • నవంబరు 19 మొదటి ఆర్దిక సంఘము (ఫైనాన్స్ కమిషన్) ఏర్పడిన రోజు. భారత రాజ్యాంగంలోని 280 అధికరణం ఇచ్చిన అధికారంతో, భారత దేశ అధ్యక్షుడు, ఈ ఆర్ధిక సంఘము ఏర్పాటు చేయవచ్చును. భారత్
  • డిసెంబరు 16 సాలార్‌జంగ్‌ మ్యూజియంను అప్పటి ప్రధానమంత్రి, జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించాడు. భారత్
  • డిసెంబరు 20 బి.ఎన్.రెడ్డి రూపొందించిన మల్లీశ్వరి తెలుగు సినీ చరిత్రలో అపురూప దృశ్యకావ్యంగా ఖ్యాతి గాంచింది.
  • డిసెంబరు 20 మల్లీశ్వరి చిత్రానికి పాటలు రాసి దేవులపల్లి కృష్ణశాస్త్రి సినీరంగ ప్రవేశం చేశారు.
  • డిసెంబరు 20 ఎన్టీఆర్ నటించిన పాతాళభైరవి, మల్లీశ్వరి చిత్రాలు విడుదలై ఆయనకు నటుడిగా గొప్ప కీర్తిని తెచ్చిపెట్టాయి.

జననాలు

  • జనవరి 1 వేణు సంకోజు, కవి, సాహితీవేత్త, ఉద్యమకారుడు.
  • జనవరి 1 అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి.
  • జనవరి 7 కె.వాసు , తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.(మ.2023).
  • జనవరి 14 జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (మ.2001).
  • ఫిబ్రవరి 1 జూలియా గ్రీన్‌వుడ్, ఇంగ్లాండుకు చెందిన మాజీ మహిళా క్రికెటర్.
  • ఫిబ్రవరి 21 డా.దేవరాజు మహారాజు, బహుముఖ ప్రజ్ఞాశాలి, హేతువాది, జంతుశాస్త్ర నిపుణుడు.
  • ఫిబ్రవరి 28 కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు. భారత్
  • మార్చి 1 నితీశ్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. భారత్
  • మార్చి 5 జి. సాయన్న, రాజకీయ నాయకుడు, ఎమ్మెల్యే (మ. 2023).
  • ఏప్రిల్ 11 రోహిణి హట్టంగడి, భారతీయ చలనచిత్ర నటి. భారత్
  • ఏప్రిల్ 16 ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (మ.2015).
  • మే 4 నారమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.(2019).
  • మే 12 గున్నార్ లార్సన్ స్వీడెన్, 200 మీటర్లు / 400 మీటర్లు ఈతగాడు (1972 లో ఒలింపిక్ బంగారుపతకాన్ని గెలిచాడు).
  • మే 22 మంద జగన్నాథం రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ. 2025). భారత్
  • జూన్ 4 తిగుళ్ళ శ్రీహరిశర్మ, సంస్కృతాంధ్ర కవి, అష్టావధాని. భారత్
  • జూన్ 9 తెలంగాణ శకుంతల, తెలుగు సినిమా రంగంలో క్యారెక్టర్ నటి, ప్రతినాయకురాలు, హాస్య నటి. (మ.2014).
  • జూన్ 10 మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు.
  • జూన్ 16 పూసపాటి అశోక్ గజపతి రాజు, రాజకీయ నేత, విమానయాన కేంద్ర మంత్రి.
  • జూన్ 23 హంసలేఖ,సంగీత దర్శకుడు, పాటల రచయిత.
  • జూలై 3 రిచర్డ్ హాడ్లీ, న్యూజీలాండ్ క్రికెట్ ఆటగాడు.
  • జూలై 10 మెడియం బాబూరావ్, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గం నుండి 14 వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) లో క్రియాశీల సభ్యులు. భారత్
  • జూలై 11 నారమల్లి డాక్టర్ శివప్రసాద్ , చలనచిత్ర దర్శకుడు , చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యుడు (మ.2019).
  • జూలై 31 శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (మ. 2023).
  • సెప్టెంబరు 8 మాధవపెద్ది సురేష్, తెలుగు సినీ సంగీత దర్శకుడు.
  • సెప్టెంబరు 14 కొమ్మాజోస్యుల ఇందిరాదేవి, రంగస్థల నటి.
  • సెప్టెంబరు 18 కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, లోక్‌సభకు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యాడు. భారత్
  • సెప్టెంబరు 30 రేలంగి నరసింహారావు, తెలుగు చలనచిత్ర దర్శకుడు, హాస్య చిత్రాలకు ప్రసిద్ధి.
  • అక్టోబరు 1 జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (మ.2002).
  • అక్టోబరు 20 కందుకూరి శ్రీరాములు, నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.
  • నవంబరు 20 గన్నమరాజు గిరిజా మనోహర్ బాబు, కవి, రచయిత.
  • నవంబరు 25 సుధామ, కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.
  • డిసెంబరు 20 కన్నేపల్లి చలమయ్య, కథా రచయిత.
  • డిసెంబరు 25 చంద్రకళ, తెలుగు చలన చిత్ర నటి, నిర్మాత. (మ.1999).
  • డిసెంబరు 26 నరసింహరాజు, తెలుగు చలన చిత్ర నటుడు(ఆంధ్రా కమలహాసన్ గా పేరు).

మరణాలు

  • ఫిబ్రవరి 24 కట్టమంచి రామలింగారెడ్డి, సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (జ.1880).
  • జూన్ 22 చిలుకూరి నారాయణరావు, భాషావేత్త, చరిత్రకారుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1889). భారత్
  • జూలై 20 జోర్డాన్ రాజు, అబ్దుల్లా ఇబిన్ హుస్సేన్, ని జెరూసలెంలో హత్య చేసారు.
  • ఆగస్టు 6 ఆచంట రుక్మిణమ్మ.
  • నవంబరు 6 హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (జ. 1890). భారత్

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు