జనవరి 6 మదర్ తెరెసా భారతదేశంలోని కలకత్తా నగరం వచ్చి పేదలకు, రోగులకు సేవ చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.
భారత్
మార్చి 30 భారత ఇంగ్లండు ల మధ్య విమాన సేవలు మొదలయ్యాయి.
భారత్
ఏప్రిల్ 8 1929 ఏప్రిల్ 8 తారీకున ప్రజారక్షణ, వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్, బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.
ఏప్రిల్ 8 ప్రజారక్షణ, వ్యాపార వివాద బిల్లులకు నిరసనగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ కేంద్ర శాసనసభలో బాంబులు విసిరారు.
భారత్
మే 11 రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
మే 16 మొదటి అకాడమీ అవార్డులు, హాలీవుడ్ దగ్గర ఉన్న రూజ్వెల్ట్ హోటల్ లో ఒక విందు సమయంలో బహూకరించారు. వింగ్స్ సినిమా ఉత్తమచత్రం, ఎమిల్ జన్నింగ్స్ ఉత్తమ నటుడు, జానెట్ గేనర్ ఉత్తమ నటి.
జూలై 7 వాటికన్ సిటీ ని, క్రైస్తవ మతాధిపతి (పోప్) కోసం ఏర్పాటు చేసారు.
జూలై 27 జెనీవా కన్వెన్షన్ యుద్ధ ఖైదీలకు సంబంధించిన విధివిధానాలను 53 దేశాలు కలిసి రూపొందించాయి.
ఆగస్టు 4 జిడ్డు కృష్ణమూర్తి, దివ్యజ్ఞాన సమాజం, దాని అనుబంధ సంస్థల నుంచి రాజీనామా చేసాడు.
నవంబరు 29 భూ దక్షిణ ధ్రువం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ భయర్డ్ ఎగిరాడు.
జననాలు
జనవరి 1 ముకురాల రామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.2003).
జనవరి 5 పొట్టి ప్రసాద్, తెలుగు చలన చిత్ర హాస్య నటుడు.
జనవరి 15 మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అమెరికాకు చెందిన పాస్టర్, ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు.
జనవరి 28 రాజారామన్న, భారత అణు శాస్త్రవేత్త. (మ.2004).
భారత్
ఫిబ్రవరి 1 జువ్వాడి గౌతమరావు, భాషాభిమాని, సాహితీకారుడు. (మ.2012).
ఫిబ్రవరి 24 అనంత్ పాయ్, భారతీయ కామిక్ రచయిత, అమర్ చిత్రకథ సృష్టికర్త.
భారత్
ఏప్రిల్ 24 రాజ్కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (మ.2006).
భారత్
మే 2 పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, ఆంధ్రప్రభ దినపత్రిక విజయవాడలో ఛీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేశారు, "స్వప్న లిపి" పేరుతో వెలువరించిన వీరి కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
మే 8 గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (మ.2017).
భారత్
జూన్ 3 చిమన్భాయి పటేల్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.1994).
భారత్
జూన్ 6 సునీల్ దత్, భారత సినిమా నటుడు, రాజకీయవేత్త. (మ.2005).
భారత్
జూలై 1 ఏ.ఎం. రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (మ.1989).
ఆగస్టు 8 పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (మ.2007).
ఆగస్టు 10 పి. శివశంకర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి (మ.2017).
ఆగస్టు 15 ద్వివేదుల విశాలాక్షి, కథా, నవలా రచయిత్రి. (మ.2014).
సెప్టెంబరు 19 బి.వి. కారంత్, కన్నడ నాటక రచయిత, నటుడు, దర్శకుడు. (మ.2002).