జనవరి 12 ఐ.ఎన్.ఎస్. సింధు ధ్వజ్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
భారత్
జనవరి 14 దూరదర్శన్ తెలుగు ప్రసారాలు పూర్తిస్థాయిలో హైదరాబాదు నుంచే ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని 16 ప్రాంతాలలో ఉన్న ట్రాన్స్మిటర్లను ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రానికి అనుసంధానించారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి ప్రసారమయ్యే హిందీ కార్యక్రమాలనూ హైదరాబాద్ కేంద్రం నుంచి రోజులో కొద్దిసేపు మాత్రమే ప్రసారమయ్యే తెలుగు ప్రసారాలనే ప్రేక్షకులు చూసేవారు.
మార్చి 27 ఆంధ్రప్రదేశ్ కళావేదిక హైదరాబాదులో ఎల్.వి.ప్రసాద్ను 'ఆంధ్రరత్న' పురస్కారంతో సత్కరించింది.
మే 5 ప్రాన్స్, మురౌరా దీవిలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.
మే 30 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి 16 జనవరి 1967 నాడు ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు.
భారత్
జూన్ 12 కోల్డ్ వార్: బెర్లిన్ గోడను పగలగొట్టమని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ బహిరంగంగా మిఖయిల్ గోర్బచెవ్కు సవాల్ విసిరాడు.
జూన్ 12 13 సంవత్సరాల క్రూర పాలనకు శిక్షగా మధ్య ఆఫ్రికా మహారాజు జీన్-బెడెల బొకాస్సాకు మరణశిక్ష విధించబడింది.
జూన్ 17 డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.
జూలై 22 సోయుజ్ టి.ఎమ్-3 అనే రోదసీ నౌకను ముగ్గురు రోదసీయాత్రికులతో (అందులో ఒకడు సిరియా దేశస్థుడు) రష్యా ప్రయోగించింది.
జూలై 23 తూర్పు జర్మనీకి చెందిన 'పెత్రా ఫెల్కె' 78.89 మీటర్ల దూరం 'జావెలిన్' విసిరింది (మహిళల రికార్డు).
జూలై 23 మొరాకోకి చెందిన 'సయిద్ ఆఔత' 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.
జూలై 25 భారత రాష్ట్రపతిగా జ్ఞాని జైల్ సింగ్ పదవీ విరమణ.
భారత్
జూలై 25 భారత రాష్ట్రపతిగా ఆర్.వెంకటరామన్ పదవిని అధిష్టించాడు.
భారత్
ఆగస్టు 7 30 సంవత్సరాల వయసు ఉన్న లైనే కాక్స్, ఆర్కిటిక్, పసిఫిక్ సముద్రాల వేరుచేసే బేరింగ్ జలసంధిని, స్విమ్ సూట్ (ఈత దుస్తుల) లో, అలస్కా నుండి సైబీరియాకు 2.7 మైళ్ళు (4.3 కిలోమీటర్లు) దూరాన్ని, రెండు గంటల ఆరు నిమిషాలలో ఈదింది. ఆమె ఈదుతున్నప్పుడు నీరు 50 సెంటిగ్రేడ్ వేడ్ మాత్రమే ఉంది. అంతేకాదు, సంవత్సరంలో, ఎక్కువ భాగం ఈ ప్రాంతం అంతా గడ్డకట్టుకుని ఉంటుంది.
ఆగస్టు 13 బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడు డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది.
అక్టోబరు 19 అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఘోరపతనం. డౌ జోన్స్ సగటు సూచి అత్యంత కనిష్ఠంగా 22శాతానికి పడిపోయింది. స్టాక్మార్కెట్ చరిత్రలో ఈ పతనం బ్లాక్మండేగా ప్రసిద్ధి చెందింది.
నవంబరు 5 నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన కవి దాశరథి కృష్ణమాచార్య కన్నుమూశారు.
జననాలు
జనవరి 1 గియా కొప్పోలా, అమెరికన్ సినిమా దర్శకురాలు, స్క్రీన్ ప్లే రచయిత.
జనవరి 12 ప్రగ్యా జైస్వాల్ , తెలుగు, తమిళ, హిందీ,చిత్రాల నటి.
సెప్టెంబరు 22 ఉన్ని ముకుందన్ , మలయాళ,తమిళ, తెలుగు, నటుడు.
అక్టోబరు 15 సాయి ధరమ్ తేజ్, తెలుగు నటుడు, "మెగాస్టార్" చిరంజీవికి మేనల్లుడు.
అక్టోబరు 19 సాకేత్ మైనేని, ఒక టెన్నిస్ ఆటగాడు. 2014లో జరిగిన ఆసియా క్రీడలలో సానియా మీర్జాతో కలిసి మిక్స్డ్ డబుల్స్ పోటీలలో మనదేశానికి స్వర్ణపతకం సాధించాడు.
అక్టోబరు 20 రాధికా చౌదరి , హిందీ,తెలుగు,తమిళ,నటి , దర్శకురాలు.
అక్టోబరు 25 ఉమేష్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు.
భారత్
అక్టోబరు 30 రామ్ మిరియాల , గాయకుడు,సంగీత దర్శకుడు, రచయత.