ఫిబ్రవరి 1 ఘంటసాల సినీ జీవిత రజతోత్సవ వేడుకలు హైదరాబాదు లాల్ బహదూర్ స్టేడియంలో ముప్పై వేల మందికి పైగా అభిమానుల మధ్య జరిగాయి.
ఫిబ్రవరి 2 ఆంధ్ర ప్రదేశ్లో ఒంగోలు జిల్లా అవతరణ. తరువాత 1972 డిసెంబర్ 5 వ తేదీన జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
ఫిబ్రవరి 18 దామోదరం సంజీవయ్య ఇందిరా గాంధీ ప్రభుత్వంలో కేంద్ర శ్రామిక, పునరావాస శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
భారత్
ఫిబ్రవరి 19 స్పుత్నిక్ 52, మొల్నియ 1-13 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను సోవియట్ రష్యా ప్రయూగించింది.
ఏప్రిల్ 24 చైనా పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 1.
మే 5 అమెరికా, నెవడా పరీక్షా కేంద్రంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.
మే 20 వాసిరెడ్డి శ్రీనివాస్,సుప్రసిద్ధ జర్నలిస్టు,తెలుగు గేట్ వే స్థాపకుడు.
మే 31 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు మెక్సికోలో ప్రారంభమయ్యాయి.
జూలై 1 పి.వి.నరసింహారావు సతీమణి సత్యమ్మ కన్నుమూశారు.
ఆగస్టు 7 ఇంగ్లాండ్ లోని ఆక్స్ఫర్డ్షైర్కి చెందిన వేలెరీ గనె, కి ఒక నాలుగు సంవత్సరాల బర్మా జాతికి చెందిన తారావుడ్ ఆంటిగొనె, అనే పేరుగల పిల్లి ఉంది. అధి ఒకే కాన్పులో (ఈత), పందొమ్మిది పిల్లి పిల్లలకు, జన్మనిచ్చింది. జీవించి ఉన్న పదిహేను పిల్లి పిల్లలలో, ఒకటి ఆడది మిగిలిన 14 మగ పిల్లిపిల్లలు. నాలుగు పిల్లిపిల్లలు మరణించాయి. ఇప్పటికీ, ఇదే రికార్డు.
ఆగస్టు 24 ఆరవ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
సెప్టెంబరు 8 మూడవ అలీన దేశాల సదస్సు లుసాకా లో ప్రారంభమైనది.
సెప్టెంబరు 23 కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కమిషన్ సిఫార్సుల మేరకు 92 కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వు జారీ చేసింది.
అక్టోబరు 19 పూర్వపు సంస్థానాధీశుల ప్రీవీ పర్సు లను ప్రభుత్వం రద్దు చేసింది.
డిసెంబరు 16 భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎం. హిదయతుల్లా పదవీ విరమణ.
భారత్
జననాలు
జనవరి 1 ఊహా, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, చిత్రాల నటి.
జనవరి 11 సుకుమార్, తెలుగు చలన చిత్ర దర్శకుడు, రచయిత.