జనవరి 7 కె.వి.రెడ్డి తొలి దర్శకత్వ చిత్రం భక్త పోతన విడుదలై దక్షిణ భారతదేశమంతటా ఘనవిజయం సాధించింది.
జనవరి 13 అడాల్ఫ్ హిట్లర్ పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించాడు.
జనవరి 15 ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం 'ద పెంటగాన్' (అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం) నిర్మాణం పూర్తయింది.
జనవరి 16 హేతువాదాన్ని తెలుగు సాహిత్యంలోకి ప్రవేశపెట్టిన కవిరాజు త్రిపురనేని రామస్వామి కన్నుమూశారు.
జనవరి 31 రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ సైన్యాలు రష్యా లోని స్టాలిన్గ్రాడ్ వద్ద రష్యా సైన్యానికి లొంగిపోయాయి.
మార్చి 2 రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా బిస్మార్క్ సముద్రంలో యుద్ధం.
మే 12 జర్మన్ సైన్యం, ఉత్తర ఆఫ్రికాలో లొంగిపోయింది.
మే 31 సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు.
ఆగస్టు 2 ఈ రోజు లెఫ్టినెంట్ (జె.జి – జూనియర్ గ్రేడ్) జాన్ ఎఫ్ కెన్నెడీ (తరువాత అమెరికన్ అధ్యక్షుడు) ki ఒక చెడ్డ రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, అమెరికాకి చెందిన పి.టి. 109 (పెట్రోల్ టార్పెడో బోట్) జాన్ ఎప్ కెన్నెడి నడుపుతున్న సమయంలో, ’అమగిరి లేదా అమిగిరి’ పేరుగల జపాన్ వారి డిస్ట్రాయర్ యుద్ధనౌక ఆ పి.టి. 109ని ముంచివేసింది. ఆ సమయంలో, కెన్నెడీ, తన బోట్ లోని సిబ్బందిని అందరినీ (ఇద్దరిని తప్ప) రక్షించి, యుద్ధ హీరో అయ్యాడు. ఆ సంఘటన, జాన్ కెన్నెడీకి సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని ఇచ్చి, అమెరికా అధ్యక్షపదవిని కట్టబెట్టింది. ఆ సమయంలో, వెన్నుపూసకు తగిలిన గాయం కూడా అలాగే జీవితాంతం వెంటాడింది. పి.టి 109 యొక్కకథ జాన్ ఎప్ కెన్నెడీగా క్లిఫ్ రాబర్ట్సన్ నటించిన, 1963సంవత్సరంలో తీసిన చిత్రం, పి.టి. 109లో హాలీవుడ్ శైలిలో చెప్పారు.
ఆగస్టు 2 ట్రెబ్లింకా లోని నాజీ మరణం శిబిరంలో తిరుగుబాటు జరిగింది.
ఆగస్టు 8 నటి భానుమతి చిత్ర నిర్మాత, దర్శకుడు పి.ఎస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడారు.
అక్టోబరు 21 నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సింగపూర్లో స్వతంత్ర భారత ప్రభుత్వం (ఆజాద్ హింద్ ప్రభుత్వం) ఏర్పాటు చేసాడు.
భారత్
నవంబరు 14 హైదరాబాదు స్టాక్ ఎక్స్ఛేంజి ప్రారంభమైంది.
జననాలు
జనవరి 1 రఘునాథ్ అనంత్ మషెల్కర్, భారతీయ శాస్త్రవేత్త. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత.
భారత్
జనవరి 2 మల్లు అనంత రాములు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.1990).
భారత్
ఫిబ్రవరి 4 ఫాదర్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ లా డాక్టర్ కండే ప్రసాద రావు.
ఫిబ్రవరి 27 బి.ఎస్.యడ్యూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
భారత్
మార్చి 30 జిత్ మోహన్ మిత్ర , తెలుగు సుప్రసిద్ధ గాయకుడు, నటుడు.
ఏప్రిల్ 25 దేవిక, తెలుగు,తమిళ, మళయాళ చిత్రాల నటీ(మ.2002).
మే 1 కొలకలూరి స్వరూపరాణి, తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది.
మే 1 ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి.
మే 2 దేవిక, అందాల తారగా తెలుగు, తమిళ సినీరంగాలలో వెలుగొందింది. తెలుగు, తమిళ, మలయాళంలలో 150కి పైగా సినిమాలలో నటించింది.