← 1947 1948 — ఆ సంవత్సరం చరిత్రలో 83 విశేషాలు
1949 → సంఘటనలు జనవరి 1 విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది.
భారత్ జనవరి 13 గాంధీజీ తన చిట్టచివరి నిరాహారదీక్ష చేపట్టాడు. హిందూ, ముస్లిముల సమైక్యత కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నాడు.
భారత్ జనవరి 30 మహాత్మా గాంధీ హత్య.
భారత్ ఫిబ్రవరి 28 ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.
భారత్ ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.
ఏప్రిల్ 26 రజాకార్ల చర్యలతో హైదరాబాదు ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని నెహ్రూ బొంబాయి పాత్రికేయుల సభలో ప్రకటించారు.
భారత్ మే 14 ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది. 'డేవిడ్ బెన్ గురియన్' ప్రధానమంత్రి.
భారత్ మే 14 ఇజ్రాయెల్ రేడియో స్టేషను 'కోల్ ఇజ్రాయెల్' మొదటిసారిగా తన ప్రసారాలను మొదలుపెట్టింది.
మే 14 ఇజ్రాయెల్ దేశాన్ని, అమెరికా గుర్తించింది.
మే 14 అమెరికా, అణుబాంబును 'ఎన్వెటక్' అనే చోట, వాతావరణంలో పేల్చి పరీక్షించింది.
జూన్ 17 డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.
జూన్ 21 స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్గా లూయీ మౌంట్బాటన్ పదవీ విరమణ.
భారత్ జూన్ 30 రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడవచ్చునని బెల్ లాబరేటరీస్ ప్రకటించింది.
జూలై 31 కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్.
భారత్ ఆగస్టు 3 ప్రఖ్యాత నటి వాణిశ్రీ నెల్లూరులో జన్మించారు.
ఆగస్టు 10 అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ (ఎ.బి.సి.) నెట్వర్క్ టి.వి దశ లోకి ప్రవేశించింది.
ఆగస్టు 21 భారత్తో తీవ్ర వివాదం తలెత్తిందంటూ హైదరాబాదు ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఫిర్యాదు చేసింది.
ఆగస్టు 29 హైదరాబాదు సమస్యకు శాంతియుత పరిష్కారం అసాధ్యమని, సైనిక చర్య అనివార్యమని నెహ్రూ కృష్ణ మీనన్కు లేఖ రాశారు.
భారత్ సెప్టెంబరు 7 రజాకార్లపై నిషేధం విధించాలని, భారత సైన్యాన్ని సికింద్రాబాదుకు అనుమతించాలని నిజాంకు నెహ్రూ అల్టిమేటం ఇచ్చారు.
భారత్ సెప్టెంబరు 13 హైద్రాబాద్ పైకి పటేల్ సైన్యాన్ని పంపాడు.
సెప్టెంబరు 13 హైదరాబాదు సంస్థానంపై 'ఆపరేషన్ పోలో' పేరిట భారత సైన్యం పోలీసు చర్య ప్రారంభించింది; మూడు వైపుల నుంచి ముట్టడి మొదలైంది.
సెప్టెంబరు 16 హైదరాబాదు ఫిర్యాదు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అజెండాలో చేరి పారిస్లో జరిగిన 357వ సమావేశంలో చర్చకు వచ్చింది.
సెప్టెంబరు 17 హైదరాబాదు సంస్థానం నిజాం పరిపాలన నుండి విముక్తి పొంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడింది.
సెప్టెంబరు 17 ఆపరేషన్ పోలో పేరిట జరిగిన పోలీసు చర్యతో నిజాం పాలన ముగిసి హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైంది.
సెప్టెంబరు 17 పోలీసు చర్యలో హైదరాబాదు సైన్యం, రజాకార్లు అన్ని రంగాల్లో ఓడిపోవడంతో నిజాం సాయంత్రం 5 గంటలకు కాల్పుల విరమణ ప్రకటించారు.
సెప్టెంబరు 17 నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగిపోవడంతో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది.
సెప్టెంబరు 18 మేజర్ జనరల్ జె.ఎన్. చౌదరి సేనలు హైదరాబాదు నగరంలో ప్రవేశించగా నిజాం సైన్యం లొంగిపోయింది; ఐదు రోజుల్లో పోలీసు చర్య ముగిసింది.
సెప్టెంబరు 20 భద్రతా మండలి ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని నిజాం ఆదేశించినట్లు భద్రతా మండలి 359వ సమావేశంలో భారత ప్రతినిధి తెలిపారు.
సెప్టెంబరు 22 ఐరాసలో హైదరాబాదు ప్రతినిధి బృందానికి ఎలాంటి అధికారం లేదని నిజాం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి కేబుల్ పంపారు.
సెప్టెంబరు 23 నిజాం తొలిసారి రేడియో ప్రసంగం చేస్తూ ఖాసిం రజ్వీ ముఠా తీరును ఖండించారు; హైదరాబాదు భారత్లో విలీనమైనట్లు ప్రకటించారు.
నవంబరు 8 మహత్మా గాంధీని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
భారత్ డిసెంబరు 18 జాగృతి తెలుగు వారపత్రిక ప్రారంభమైనది.
జననాలు జనవరి 1 షేక్ బడేసాహెబ్ తెలుగు రచయిత.
జనవరి 1 మంచాల సూర్యనారాయణ, తెలుగు నాటకరంగ, టీవీ, సినీ నటుడు. (మ.2020).
జనవరి 1 ఫగు చౌహాన్, మేఘాలయా గవర్నర్.
జనవరి 3 ఐతా చంద్రయ్య: తెలంగాణ ప్రాంతానికి చెందిన కవి, రచయిత.
ఫిబ్రవరి 4 భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రాకేష్ శుక్లా.
భారత్ ఫిబ్రవరి 24 జయలలిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి. (మ.2016).
భారత్ ఫిబ్రవరి 25 డానీ డెంజోంగ్ప, భారతీయ చలనచిత్ర నటుడు.
భారత్ ఫిబ్రవరి 28 పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి.
మార్చి 28 ఐ.వి.శశి , దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు(మ.2017).
భారత్ మార్చి 30 కన్నడ ప్రభాకర్ , దక్షిణ భారతీయ భాషా చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా ప్రతినాయకుడు .(మ.2001).
భారత్ ఏప్రిల్ 9 జయ బచ్చన్, హింది నటి,, అమితాబ్ బచ్చన్ భార్య.
ఏప్రిల్ 20 పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు.
మే 25 మాదాల రంగారావు, తెలుగు సినీ నటుడు, నిర్మాత,దర్శకుడు (మ.2018).
జూన్ 16 ఉత్పల హనుమంతరావు, కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్ నుండి భారత రాజ్యసభకు ప్రాతినిథ్యము వహిస్తున్నాడు.
జూన్ 30 తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు.
జూలై 6 ఛాయరాజ్, కవి, రచయిత. (మ.2013).
జూలై 27 ఎం. వి. ఎస్. హరనాథ రావు, నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. (మ.2017).
ఆగస్టు 3 వాణిశ్రీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినినటి.
ఆగస్టు 4 శత్రుచర్ల విజయరామరాజు, విజయనగరం జిల్లాలోని చినమేరంగి సంస్థానాదిపతి, పార్లమెంటుకు పార్వతీపురం లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.
ఆగస్టు 5 వడ్డేపల్లి కృష్ణ, కవి ,లలిత గీతాలు, గేయ రచయిత,(మ.2024).
ఆగస్టు 15 భారతి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల నటి.గాయనీ, దర్శకురాలు.
సెప్టెంబరు 4 అనంత్ నాగ్, భారతీయ చలనచిత్ర నటుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత.
భారత్ సెప్టెంబరు 20 మహేష్ భట్, భారతీయ చలనచిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత.
భారత్ సెప్టెంబరు 22 మల్లాది గోపాలకృష్ణ, రంగస్థల నటుడు, దర్శకుడు, రూపశిల్పి, నటశిక్షణ అధ్యాపకులు.
సెప్టెంబరు 25 రేమెళ్ళ అవధానులు, తెలుగు శాస్త్రవేత్త.
సెప్టెంబరు 25 భూపతిరాజు సోమరాజు, పేరొందిన గుండె వ్యాధి నిపుణుడు, కేర్ హాస్పిటల్ హెడ్, ఛైర్మన్.
అక్టోబరు 12 ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (మ.1998).
భారత్ అక్టోబరు 16 నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, రచయిత.
అక్టోబరు 16 హేమా మాలిని, నటి, భరత నాట్యకారిణి.
అక్టోబరు 16 రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, రచయిత, విమర్శకులు.
అక్టోబరు 17 అన్నపూర్ణ (నటి), ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి.
నవంబరు 6 ముంతాజ్ అలి, ఆధ్యాత్మిక వేత్త.
నవంబరు 9 గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, పేరొందిన సంగీత విద్వాంసులు, కర్ణాటక సంగీతంలో, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరొందాడు.
భారత్ నవంబరు 14 యండమూరి వీరేంధ్రనాథ్, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు.
నవంబరు 14 మధుబాబు, పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవల రచయిత.
నవంబరు 14 నిజాం వెంకటేశం, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త. (మ. 2022).
నవంబరు 28 వేముల మోహనరావు, రంగస్థల కళాకారుడు.
నవంబరు 30 కె. ఆర్. విజయ, భారతీయ సినిమా నటి.
భారత్ డిసెంబరు 10 రేకందార్ ఉత్తరమ్మ, తెలుగు రంగస్థల, సినిమా నటి.
డిసెంబరు 11 రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు. (మ.2008).
భారత్ డిసెంబరు 30 సురీందర్ అమర్నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్మెన్.
భారత్ మరణాలు జనవరి 30 మహాత్మా గాంధీ, భారత జాతి పిత. (జ.1869).
భారత్ జనవరి 30 రైటు సోదరులలో ఒకడైన ఓర్విల్లే మరణం (జ.1871).
మార్చి 1 క్లారా కెర్న్ బేలిస్, అమెరికన్ రచయిత్రి, విద్యావేత్త. (జ.1848).
ఏప్రిల్ 4 రాజా నర్సాగౌడ్, సంఘసేవకుడు, మహాదాత. (జ.1866).
జూన్ 18 హరిలాల్ గాంధీ, మహాత్మాగాంధీ ప్రథమ పుత్రుడు (జ.1888).
భారత్ జూలై 21 అర్షిలె గోర్కీ, అబ్స్ట్రాక్ట్ ఎక్ష్ప్రెషనిస్ట్, 43వ ఏట.
ఆగస్టు 9 యల్లాప్రగడ సుబ్బారావు, భారతీయ వైద్య శాస్త్రజ్ఞుడు. (జ.1895).
భారత్ ఆగస్టు 22 షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (జ.1920).
సెప్టెంబరు 11 ముహమ్మద్ అలీ జిన్నా, 20 వ శతాబ్దానికి చెందిన రాజకీయనాయకుడు. (జ.1876).
డిసెంబరు 18 కాట్రగడ్డ బాలకృష్ణ, అసాధారణ మేధావి, మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. (జ.1906).
భారత్ ← 1947 అన్ని సంవత్సరాలు 1949 →