జనవరి 1 ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
ఏప్రిల్ 7 గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
ఏప్రిల్ 8 అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ జన్మించాడు.
ఏప్రిల్ 21 సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఏప్రిల్ 27 దక్షిణ ఆఫ్రికా దేశానికి స్వతంత్రం లభించింది.
మే 9 దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనాడు.
మే 10 నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా మొట్ట మొదటి నల్లజాతి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేసాడు.
మే 20 మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి హైదరాబాదులో కన్నుమూశారు.
మే 28 ఐ.ఎన్.ఎస్. షంకుల్ (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
భారత్
జూన్ 17 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి.
జూన్ 22 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, తెలుగు సినీ వైతాళికుడు ఎల్.వి.ప్రసాద్ 82 ఏళ్ళ వయసులో కన్నుమూశారు.
జూలై 3 టెక్సాస్ ట్రాఫిక్ చరిత్రలో (రోడ్డు ప్రమాదాలలో ) ఈ రోజున 46 మంది మరణించటం అత్యంత విషాదకరమైన విషయమని టెక్సాస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ చెప్పింది.
ఆగస్టు 13 హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్ (పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది.
ఆగస్టు 13 గోదావరి యాస డైలాగులతో తెలుగు విలనీకి కొత్త ఒరవడి తెచ్చిన నటుడు రావు గోపాలరావు మరణించారు.
ఆగస్టు 23 టంగుటూరి ప్రకాశం పేరిట ఆంధ్ర కేసరి పట్టభద్ర కళాశాల రాజమండ్రిలో ప్రారంభమైంది.
అక్టోబరు 2 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
అక్టోబరు 10 ఎన్టీఆర్ ఆహ్వానంతో నటి జయప్రద తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ ప్రవేశం చేశారు.
అక్టోబరు 14 బొగద సొరంగానికి నిర్మాణపు పనులు మొదలుపెట్టారు.
డిసెంబరు 18 గయ్యాళి అత్త పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన నటి సూర్యకాంతం మరణించారు.
జననాలు
జనవరి 17 దిశా పాండే , హిందీ , తెలుగు తమిళ, కన్నడ, చిత్రాల నటి,మోడల్.