జనవరి 1 ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
జనవరి 3 రవిశాస్త్రి ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
భారత్
జనవరి 20 మహమ్మద్ అజారుద్దీన్ బెంగళూరులో ఇంగ్లండ్పై వన్డే అరంగేట్రం చేసి అజేయంగా 47 పరుగులు చేశారు.
భారత్
ఫిబ్రవరి 19 స్పానిష్ జెట్ లైనర్, స్పెయిన్ లోని 'బిల్బావొ' దగ్గర కూలి 150 మంది మరణించారు.
ఫిబ్రవరి 19 ఆమ్ స్టర్ డామ్ లోని ఏ.డి.ఎమ్. దివాళా తీసినట్లు ప్రకటించింది.
ఫిబ్రవరి 19 కృత్రిమ గుండె పెట్టుకున్న విలియం జె. స్క్రోడర్, ఆసుపత్రిని వదిలి బయటి ప్రపంచానికి వచ్చిన మొదటి మనిషి.
ఫిబ్రవరి 19 కోకా కోలా మొదటిసారిగా చెర్రీ కోక్ ని సీసాలలోను, డబ్బాలలోను (టిన్డ్) ప్రవేశపెట్టింది.
ఫిబ్రవరి 19 లైబీరియా ఏయిర్ లైన్స్ కి చెందిన బోయింగ్ 727 స్పెయిన్ లోని ఓయిజ్ పర్వతం (మౌంట్ ఓయిజ్) లో కూలిపోయి, 148 మంది ప్రయాణీకులు మరణించారు.
ఫిబ్రవరి 19 ప్రపంచ ప్రసిద్ధి పొందిన మికీ మౌస్ ని చైనా దేశం లోనికి ఆహ్వానించారు.
మార్చి 9 మధ్యంతర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్టీ రామారావు మూడోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
మార్చి 15 మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).
మార్చి 27 చిరంజీవి, సురేఖ దంపతులకు మద్రాసులో రామ్ చరణ్ జన్మించారు.
ఏప్రిల్ 8 భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.
భారత్
మే 19 సీపీఐ(ఎం) తొలి ప్రధాన కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య మద్రాసులో కన్నుమూశారు.
మే 24 బంగ్లాదేశ్లో వచ్చిన తుఫానుకి 10,000 మంది ప్రజలు మరణించారు.
జూన్ 1 ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నిర్ణయం మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధికారికంగా రద్దయింది.
జూన్ 23 ఎయిర్ ఇండియా విమానం కనిష్క జెంబో జెట్ అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోవటం వలన 329 మంది మరణించారు.
భారత్
జూలై 7 బోరిస్ బెకర్ అతి చిన్నవయసులో తన 17వ ఏట వింబుల్డన్ (టెన్నిస్) లో గెలిచాడు.
జూలై 7 రాబర్ట్ ముగాబే కొత్తగా ఏర్వడిన జింబాబ్వే అధ్యక్షుడు అయ్యాడు.
జూలై 17 1985 జూలై 17 న కారంచేడు, ప్రకాశం జిల్లాలొ జరిగిన ఉదంతం. ఈ ఘటనలో కమ్మకులం వారు మాదిగ కులం వారిపై దాడిచేసి 6 గురిని చంపారు, ముగ్గురు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. తాగునీరు విషయమై మొదలయిన ఈ గొడవ చాలా మంది జీవితాలను బలి తీసుకొంది.
ఆగస్టు 2 "లాక్హీడ్ ఎల్-1011 ట్రైస్టార్"కి చెందిన "డెల్టా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 191", "డల్లాస్ / ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం" వద్ద కూలిపోయింది. 137 మంది ప్రయాణీకులు, సిబ్బంది మరణించారు.
ఆగస్టు 13 పోప్ జాన్ పాల్ II, కెమరూన్లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన, అమెరికా, యూరప్ ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు.
ఆగస్టు 17 పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాలో రైల్ కోచ్ ఫ్యాక్టరీకి భారత ప్రధాని రాజీవ్ గాంధీచేత శంకుస్థాపన.
భారత్
సెప్టెంబరు 28 భారతదేశంలో మొదటిసారి తెరచాప పడవలో భూగోళాన్ని చుట్టే గుఱితో భారతీయ సేన జట్టు బొంబాయి నుండి తృష్ణ అనే చిన్నోడలో బయలుదేరింది. (పూర్తి 10-1-87).
భారత్
అక్టోబరు 2 వరకట్న నిషేధ సవరణ చట్టం అమలులోకి వచ్చింది.
అక్టోబరు 3 సహారావి అరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ని న్యూఢిల్లీ ఆమోదించినట్లు ప్రకటించిన తర్వాత మొరాకో భారతదేశంతో దౌత్య సంబంధాలను విచ్ఛిన్నం చేసింది.
భారత్
అక్టోబరు 10 ఎన్టీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఆస్తిలో కుమార్తెలకు సమాన వారసత్వ హక్కు బిల్లు చట్టరూపం దాల్చింది.
అక్టోబరు 14 అస్సాం గణ పరిషత్ స్థాపించబడింది.
భారత్
అక్టోబరు 16 భారతదేశంలో జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది. ఇందిరా గాంధీ హత్య పర్యవసానంగా దీనిని ఏర్పాటు చేసారు.
భారత్
నవంబరు 9 భారతదేశపు న్యాయసేవాదినం. పేద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయసహాయం అందించే చట్టం అమలులోకి వచ్చింది.
భారత్
నవంబరు 26 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా కుముద్ బెన్ జోషి నియమించబడింది.
డిసెంబరు 2 పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.
డిసెంబరు 19 భారత లోక్సభ స్పీకర్గా రబీ రాయ్ పదవిని స్వీకరించాడు.
భారత్
డిసెంబరు 21 ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎల్.వి.ప్రసాద్కు గౌరవ డాక్టరేట్ 'కళాప్రపూర్ణ' ప్రదానం చేసింది.
డిసెంబరు 30 తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసింది.
డిసెంబరు 30 ఆరు సూత్రాల పథకం ఉల్లంఘనలను సరిదిద్దేందుకు ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ప్రభుత్వం జీవో 610 జారీ చేసింది.
జననాలు
జనవరి 9 మిట్టపల్లి సురేందర్, తెలుగు జానపద, సినీ గీతరచయిత.
జనవరి 10 ద్రష్టి దామీ, భారతీయ టీవీ నటి, మోడల్, నృత్యకళాకారిణి.
భారత్
జనవరి 26 నవదీప్, భారతీయ సినీ నటుడు. పలు తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించాడు.
డిసెంబరు 18 స్నేహ ఉల్లాల్ , తెలుగు, హిందీ చిత్ర నటి.
డిసెంబరు 21 ఆండ్రియా జర్మియా, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల నటి, గాయని.
మరణాలు
జనవరి 5 గరికపాటి మల్లావధాని, స్వాతంత్ర్య సమరయోధులు, కవి, సంస్కృతాంధ్ర పండితులు. (జ.1899).
భారత్
ఫిబ్రవరి 16 నార్ల వేంకటేశ్వరరావు, పాత్రికేయుడు, కవి, సంపాదకుడు జననం. (జ.1908).
ఫిబ్రవరి 27 ఆకురాతి చలమయ్య, తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
మార్చి 11 ఇందుమతి చిమన్లాల్ షేత్, గుజరాత్కు చెందిన భారతీయ స్వాతంత్ర్యోద్యమరాలు, సామాజిక కార్యకర్త, విద్యావేత్త. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1906).
భారత్
మార్చి 27 గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918).
మే 19 పుచ్చలపల్లి సుందరయ్య, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు. (జ.1913).
మే 31 సముద్రాల రామానుజాచార్య, సముద్రాల జూనియర్ గా పేరొందిన తెలుగు సినిమా రచయిత (జ.1923).
జూన్ 23 యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (జ.1922).