జనవరి 1 అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది.
జనవరి 5 మొట్టమొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ పోటీ జరిగింది - ఆస్ట్రేలియా, ఇంగ్లండుల మధ్య.
జనవరి 13 అక్కినేని నటించిన దసరా బుల్లోడు విడుదలై ఆయన తొలి స్వర్ణోత్సవ చిత్రంగా నిలిచింది.
జనవరి 25 హిమాచల్ ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది.
జనవరి 25 నరరూప రాక్షసుడుగా పేరొందిన ఉగాండా నియంత ఈడీ అమీన్ సైనిక కుట్ర ద్వారా అధికార పగ్గాలు చేజిక్కించుకున్నాడు.
మార్చి 18 దామోదరం సంజీవయ్య రెండోసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
భారత్
మార్చి 22 భారత లోక్ సభ స్పీకర్గా గుర్దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం.
భారత్
మార్చి 26 పాకిస్థాన్ నుండి తూర్పు పాకిస్థాన్ స్వాతంత్ర్యం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. (బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం).
భారత్
ఏప్రిల్ 19 మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
మే 19 ఐ.ఎన్.ఎస్. వీరబాహు భారతీయ నౌకాదళంలో చేరిన తేది (ఇది జలాంతర్గామి కాదు. ఒడ్డున ఉండే విశాఖపట్నంలోని కార్యాలయం).
జూన్ 30 రష్యన్ వ్యోమ నౌక సోయుజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.
జూలై 24 'గబ్బిలం' కావ్య రచయిత, మహాకవి గుఱ్ఱం జాషువా గుంటూరులో మరణించారు.
ఆగస్టు 1 అపోలో 15 వ్యోమనౌక నుంచి డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ అనే ఇద్దరు వ్యోమగాములు చంద్రగ్రహం పై దిగిన రెండవ రోజున, చంద్రగ్రహం పుట్టుక నాటి ’రాయి’ చంద్రశిలను అపెన్నైన్ పర్వతాల మీద వాలుగా ఉన్న స్పర్ క్రేటర్ అనే పెద్ద గోతి నుంచి తవ్వి సేకరించారు. చంద్రగ్రహం మీద మొదటి చంద్ర వాహనం నడిపిన వారు కూడా వీరే.
ఆగస్టు 4 అమెరికా మనుషులు ఉన్న అంతరిక్షనౌకనుంచి, మొదటి సారిగా ఒక ఉపగ్రహాన్ని, చంద్రుని కక్ష్యలోకి ప్రయోగించింది.
ఆగస్టు 15 బహ్రెయిన్, బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
భారత్
ఆగస్టు 15 అమెరికా అధ్యక్షుడు నిక్సన్, జీతాలు, ధరలు, అద్దెల మీద 90 రోజుల పాటు స్తంభింపచేసాడు.
సెప్టెంబరు 2 నటుడు, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ బాపట్లలో కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు.
సెప్టెంబరు 30 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టాడు.
సెప్టెంబరు 30 తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాసు బ్రహ్మానందరెడ్డి సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవీకాలం ముగిసింది.
సెప్టెంబరు 30 పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
సెప్టెంబరు 30 తెలంగాణ ఉద్యమ అనంతర పరిణామాల్లో పి.వి.నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.
అక్టోబరు 2 అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి గాంధీ సదన్గా ఇప్పుడు మనకు తెలిసిన బిర్లా హౌస్ను దేశానికి అంకితం చేశారు . ఇక్కడే మహాత్మా గాంధీ హత్య జరిగింది.
భారత్
అక్టోబరు 10 ప్రపంచపు అతిపెద్ద దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ (15 విభాగాలతో, 972 పేజీలతో, ఏడున్నర పౌండ్ల బరువుతో) వెలువడింది.
జూలై 3 జూలియన్ అసాంజే, ఆస్ట్రేలియన్ ప్రచురణకర్త, పాత్రికేయుడు, మాద్యమ, అంతర్జాల వ్యవస్థాపకుడు, మాద్యమ విమర్శకుడు, రచయిత, కంప్యూటర్ ప్రోగ్రామర్, రాజకీయ, అంతర్జాల కార్యకర్త.
సెప్టెంబరు 2 పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా కథానాయకుడు.
సెప్టెంబరు 3 కిరణ్ దేశాయ్, భారతదేశ రచయిత్రి.
భారత్
అక్టోబరు 10 అనిల్ రాచమళ్ళ, సాంకేతిక నిపుణుడు. కర్మవీర్ చక్ర పురస్కార గ్రహీత.