జనవరి 1 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు.
మూలం
ఫిబ్రవరి 4 క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ న్యూఢిల్లీలోని టెరీ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
మూలం
ఫిబ్రవరి 13 పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్తో జూనియర్ ఎన్.టి.ఆర్ ఘన పునరాగమనం చేశారు.
మూలం
ఫిబ్రవరి 18 మూవీ మొఘల్గా పేరొందిన నిర్మాత డి. రామానాయుడు హైదరాబాదులో క్యాన్సర్ వ్యాధితో మరణించారు.
మూలం
మార్చి 29 సైనా నెహ్వాల్ తొలిసారి ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు.
మూలం
మార్చి 30 భారత ప్రభుత్వం నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.
మూలం
ఏప్రిల్ 1 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గుంటూరు–విజయవాడ మధ్య నిర్మించ తలపెట్టిన నవ్యాంధ్ర రాజధాని నగరానికి అమరావతి అని పేరు పెట్టారు.
మూలం
ఏప్రిల్ 2 సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు అందుకున్న తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
మూలం
ఏప్రిల్ 9 త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఎస్/ఓ సత్యమూర్తి చిత్రం విడుదలైంది.
మూలం
జూలై 7 రామ్ చరణ్ ప్రమోటర్గా ఉన్న ట్రూజెట్ విమానయాన సంస్థకు ప్రాంతీయ సర్వీసుల కోసం ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభించింది.
భారత్
మూలం
జూలై 10 ప్రభాస్ కథానాయకుడిగా బాహుబలి: ది బిగినింగ్ విడుదలై భారతీయ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
మూలం
జూలై 10 రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.
మూలం
జూలై 14 గోదావరి పుష్కరాల ప్రారంభదినం సందర్భంగా, రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన త్రొక్కిసలాటలో 27 మంది చనిపోయారు.
మూలం
జూలై 18 ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు.
మూలం
జూలై 29 ముబై పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారకుడైన యాకుబ్ మెమన్ను నాగపూరు జైలులో ఉరి తీశారు.
మూలం
ఆగస్టు 7 మహేష్ బాబు తొలిసారి సహనిర్మాతగా వ్యవహరించిన 'శ్రీమంతుడు' విడుదలై ఘనవిజయం సాధించింది.
మూలం
ఆగస్టు 20 తాడేపల్లిగూడెంలో నిట్ (నేషనల్ ఇంస్టిట్యూట్ ఓఫ్ టెక్నాలజీ) సంస్థకు శంకుస్థాపన జరిగింది.
మూలం
ఆగస్టు 27 ఇస్రో జీఎస్ఎల్వీ-డీ6 యాత్రలో జీశాట్-6 ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది.
భారత్
మూలం
అక్టోబరు 22 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది.
మూలం
మరణాలు
జనవరి 2 వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933).
భారత్
మూలం
జనవరి 4 ఆహుతి ప్రసాద్, తెలుగు సినీ నటుడు. (జ.1958).
మూలం
జనవరి 5 గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (జ.1945).
మూలం
ఫిబ్రవరి 13 ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937).
మూలం
ఫిబ్రవరి 18 దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936).
మూలం
ఫిబ్రవరి 19 రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965).
మూలం
మార్చి 2 పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్ స్థాపకుడు. ఆఫ్సెట్ ముద్రణాయంత్రం కంప్యూటర్ కంట్రోల్స్తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924).
మూలం
మార్చి 15 రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (జ.1961).
మూలం
మార్చి 23 లీ క్వాన్ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్ జాతి పితగా ప్రసిద్ధుడు. (జ.1923).
భారత్
మూలం
మార్చి 23 మల్లి మస్తాన్ బాబు, ప్రపంచ పర్వతారోహకుడు. (జ.1974).
మూలం
మార్చి 27 మనుభాయ్ పటేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజరాత్ మాజీ మంత్రి.
భారత్
మూలం
ఏప్రిల్ 9 నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి. (జ.1924).
మూలం
సెప్టెంబరు 15 వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. (జ.1928).
భారత్
మూలం
సెప్టెంబరు 19 నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).
మూలం
అక్టోబరు 4 ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934).
మూలం