ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు.
  • ఫిబ్రవరి 4 క్రికెటర్ వి.వి.యస్. లక్ష్మణ్ న్యూఢిల్లీలోని టెరీ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
  • ఫిబ్రవరి 13 పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్‌తో జూనియర్ ఎన్.టి.ఆర్ ఘన పునరాగమనం చేశారు.
  • ఫిబ్రవరి 18 మూవీ మొఘల్‌గా పేరొందిన నిర్మాత డి. రామానాయుడు హైదరాబాదులో క్యాన్సర్ వ్యాధితో మరణించారు.
  • మార్చి 29 సైనా నెహ్వాల్ తొలిసారి ఇండియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు.
  • మార్చి 30 భారత ప్రభుత్వం నుంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది.
  • ఏప్రిల్ 1 ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం గుంటూరు–విజయవాడ మధ్య నిర్మించ తలపెట్టిన నవ్యాంధ్ర రాజధాని నగరానికి అమరావతి అని పేరు పెట్టారు.
  • ఏప్రిల్ 2 సైనా నెహ్వాల్ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు అందుకున్న తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు.
  • ఏప్రిల్ 9 త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఎస్/ఓ సత్యమూర్తి చిత్రం విడుదలైంది.
  • జూలై 7 రామ్ చరణ్ ప్రమోటర్‌గా ఉన్న ట్రూజెట్ విమానయాన సంస్థకు ప్రాంతీయ సర్వీసుల కోసం ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్ లభించింది. భారత్
  • జూలై 10 ప్రభాస్ కథానాయకుడిగా బాహుబలి: ది బిగినింగ్ విడుదలై భారతీయ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.
  • జూలై 10 రాజమౌళి తీసిన బాహుబలి: ది బిగినింగ్ జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం పొందిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది.
  • జూలై 14 గోదావరి పుష్కరాల ప్రారంభదినం సందర్భంగా, రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నదిలో పుణ్య స్నానాలను ఆచరించడానికి వచ్చిన జనాలలో ఏర్పడిన త్రొక్కిసలాటలో 27 మంది చనిపోయారు.
  • జూలై 18 ఇరవై ఏళ్లకు ఒకసారి వచ్చే పూరీ జగన్నాథస్వామి నవకళేబర యాత్రలో సుమారు 15 లక్షలమంది పాల్గొన్నారు.
  • జూలై 29 ముబై పేలుళ్ల కేసులో 257 మంది మృతికి కారకుడైన యాకుబ్ మెమన్ను నాగపూరు జైలులో ఉరి తీశారు.
  • ఆగస్టు 7 మహేష్ బాబు తొలిసారి సహనిర్మాతగా వ్యవహరించిన 'శ్రీమంతుడు' విడుదలై ఘనవిజయం సాధించింది.
  • ఆగస్టు 20 తాడేపల్లిగూడెంలో నిట్ (నేషనల్ ఇంస్టిట్యూట్ ఓఫ్ టెక్నాలజీ) సంస్థకు శంకుస్థాపన జరిగింది.
  • ఆగస్టు 27 ఇస్రో జీఎస్‌ఎల్‌వీ-డీ6 యాత్రలో జీశాట్-6 ఉపగ్రహాన్ని భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టింది. భారత్
  • అక్టోబరు 22 ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శంకుస్థాపన ఉద్దండరాయుని పాలెంలో జరిగింది.

మరణాలు

  • జనవరి 2 వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (జ.1933). భారత్
  • జనవరి 4 ఆహుతి ప్రసాద్, తెలుగు సినీ నటుడు. (జ.1958).
  • జనవరి 5 గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (జ.1945).
  • జనవరి 8 గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త.
  • జనవరి 12 వి.బి.రాజేంద్రప్రసాద్, తెలుగు, తమిళ నిర్మాత, దర్శకుడు (జ.1932).
  • జనవరి 21 ఎల్కోటి ఎల్లారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి. (జ.1939).
  • జనవరి 23 ఎం. ఎస్. నారాయణ, తెలుగు సినిమా హాస్యనటుడు, దర్శకుడు. (జ.1951).
  • జనవరి 26 ఆర్.కె.లక్ష్మణ్, వ్యంగ్య చిత్రకారుడు. common man సృష్టికర్త. (జ.1924).
  • ఫిబ్రవరి 6 ఆత్మారాం భెండే, రంగస్థల, సినిమా నటుడు, దర్శకుడు.
  • ఫిబ్రవరి 13 పి. కేశవ రెడ్డి, తెలుగు నవలా రచయిత. (జ.1946).
  • ఫిబ్రవరి 13 ఎస్.మునిసుందరం కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (జ.1937).
  • ఫిబ్రవరి 18 దగ్గుబాటి రామానాయుడు, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. (జ.1936).
  • ఫిబ్రవరి 19 రాగతి పండరి, తెలుగు వ్యంగ్య చిత్రకారులు, కార్టూనిస్టులలో ఏకైక మహిళా కార్టూనిస్ట్. (జ.1965).
  • మార్చి 2 పరుచూరి హనుమంతరావు, ప్రగతి ప్రింటర్స్‌ స్థాపకుడు. ఆఫ్‌సెట్‌ ముద్రణాయంత్రం కంప్యూటర్‌ కంట్రోల్స్‌తో సహా దేశంలోనే తొలిసారిగా 1988లో ఇక్కడే ప్రవేశించింది. (జ. 1924).
  • మార్చి 15 రాళ్ళబండి కవితాప్రసాద్, తెలుగు అవధాని, కవి. (జ.1961).
  • మార్చి 23 లీ క్వాన్‌ యూ, సింగపూర్ మొదటి ప్రధానమంత్రి. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడు. (జ.1923). భారత్
  • మార్చి 23 మల్లి మస్తాన్ బాబు, ప్రపంచ పర్వతారోహకుడు. (జ.1974).
  • మార్చి 27 మ‌నుభాయ్ ప‌టేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజ‌రాత్ మాజీ మంత్రి. భారత్
  • ఏప్రిల్ 9 నర్రా రాఘవ రెడ్డి, కమ్యూనిస్టు యోధుడు, ఆరుసార్లు చట్టసభకు ఎన్నికైన ప్రజాప్రతినిధి. (జ.1924).
  • ఏప్రిల్ 18 శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966).
  • ఏప్రిల్ 24 పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలో పేరొందిన వ్యక్తి. (జ. 1961).
  • మే 22 పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924).
  • మే 27 పవని నిర్మల ప్రభావతి, రచయిత్రి (జ.1933).
  • జూన్ 6 ఆర్తీ అగర్వాల్, తెలుగు సినిమా నటీమణి. (జ.1984).
  • జూన్ 8 దాశరథి రంగాచార్య, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928).
  • జూన్ 10 శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. (జ.1928).
  • జూన్ 24 పుల్లెల శ్రీరామచంద్రుడు, సంస్కృత పండితుడు (జ.1927). భారత్
  • జూలై 3 తెన్నేటి విద్వాన్, రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1924). భారత్
  • జూలై 6 భాట్టం శ్రీరామమూర్తి, వివాదరహితుడైన రాజకీయ నాయకుడు.
  • జూలై 14 ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చెందిన సంగీత దర్శకుడు. (జ.1928). భారత్
  • జూలై 16 వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (జ.1947).
  • జూలై 20 టి.కనకం, అలనాటి చలనచిత్ర హాస్యనటి, రంగస్థల నటి, గాయనీ.(జ.1927).
  • జూలై 25 చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (జ.1932).
  • జూలై 27 ఏ.పి.జె.అబ్దుల్ కలామ్, అంతరిక్ష శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి (జ.1931). భారత్
  • ఆగస్టు 14 గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1930).
  • ఆగస్టు 14 యోగానంద కృష్ణమూర్తి, ఆధ్యాత్మిక ప్రచారకుడు, గురువు. (జ.1931).
  • ఆగస్టు 19 పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (జ.1937).
  • ఆగస్టు 24 ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కతి, మాజీ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనమండలి సభ్యుడు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్.
  • ఆగస్టు 25 పటోళ్ల కృష్ణారెడ్డి, ఆంధ్రపదేశ్ శాసన సభలో నాలుగు పర్యాయాలు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత.
  • ఆగస్టు 28 బి.సత్యనారాయణ, తెలుగు సినిమా నిర్మాత.
  • సెప్టెంబరు 15 వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. (జ.1928). భారత్
  • సెప్టెంబరు 19 నడిచే గణితవిజ్ఞాన సర్వస్వంగా పేరుగాంచిన ఆచార్య నల్లాన్ చక్రవర్తుల పట్టాభిరామాచార్యులు, తన 82వ ఏట, వరంగల్లులో చనిపోయాడు. (చూ. సాక్షి, తే.21-9-2015) ఆయన వరంగల్లు లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి.) లో గణిత ఆచార్యునిగా పదవీ విరమణ చేశాడు (జ.1933).
  • అక్టోబరు 4 ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (జ.1934).
  • అక్టోబరు 9 రవీంద్ర జైన్,సంగీత దర్శకుడు (జ.1944).
  • అక్టోబరు 10 వినోద్ ప్రకాష్ శర్మ, భారతదేశానికి చెందిన కీటక శాస్త్రవేత్త. పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత. (జ.1938). భారత్
  • అక్టోబరు 11 మనోరమ, సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. (జ.1937). భారత్
  • అక్టోబరు 19 కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు (జ.1945).
  • అక్టోబరు 24 మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (జ.1950).
  • అక్టోబరు 25 జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955).
  • నవంబరు 2 కొండవలస లక్ష్మణరావు, తెలుగు నాటక, చలన చిత్ర నటుడు. (జ.1946).
  • నవంబరు 14 కె.ఎస్.గోపాలకృష్ణన్, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ సినిమా దర్శకుడు(జ.1929).
  • నవంబరు 17 అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (జ. 1926).
  • నవంబరు 25 ఆచంట వెంకటరత్నం నాయుడు, తెలుగు పౌరాణిక నాటక నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డ్ గహీత (జ.1935).
  • డిసెంబరు 11 హేమ ఉపాధ్యాయ, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కళాకారిణి, (జ.1972). భారత్
  • డిసెంబరు 12 శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. (జ.1935). భారత్
  • డిసెంబరు 18 చాట్ల శ్రీరాములు, తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు. (జ.1931).
  • డిసెంబరు 19 రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. (జ.1949).
  • డిసెంబరు 22 కాశీ విశ్వనాథ్, ప్రఖ్యాత రచయిత, నటుడు, రంగస్థల ప్రయోక్త (జ.1946).
  • డిసెంబరు 25 మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942).

సినిమా

  • ఫిబ్రవరి 6 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 13 'టెంపర్' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 27 'భమ్ భోలేనాథ్' చిత్రం విడుదలైంది.
  • మార్చి 13 'టామీ' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 17 'నూతిలోకప్పలు' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 24 'దోచెయ్' చిత్రం విడుదలైంది.
  • మే 8 'దొంగాట' చిత్రం విడుదలైంది.
  • మే 22 'మోసగాళ్లకు మోసగాడు' చిత్రం విడుదలైంది.
  • జూన్ 12 'జ్యోతి లక్ష్మి' చిత్రం విడుదలైంది.
  • జూన్ 19 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం విడుదలైంది.
  • జూలై 10 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 7 'శ్రీమంతుడు' చిత్రం విడుదలైంది.
  • సెప్టెంబరు 4 'డైనమైట్' చిత్రం విడుదలైంది.
  • సెప్టెంబరు 28 'మెల్లగా తట్టిందిమనసు తలుపు' చిత్రం విడుదలైంది.
  • అక్టోబరు 16 'రాజు గారి గది' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 6 'త్రిపుర' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 11 'అఖిల్' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 25 'భలే మంచి రోజు' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు