జనవరి 1 ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
ఫిబ్రవరి 4 భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది.
భారత్
ఫిబ్రవరి 21 2007 ఫిబ్రవరి 21 నాడు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి చూడు విశాఖపట్నం వార్డులు.
ఫిబ్రవరి 24 52వ ఫిల్మ్ఫేర్ వేడుకలో శ్రీదేవి తన పాత హిట్ పాటలకు నృత్యం చేసి ప్రేక్షకులను అలరించారు.
భారత్
మార్చి 12 భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది.
భారత్
ఏప్రిల్ 25 నకిలీ పాసుపోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాస అగ్రనేత ఆలె నరేంద్రను పార్టీ నుండి సస్పెండు చేసారు.
మే 2 ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి 22 సంవత్సరాలు తరువాత పునరుద్దించబడిన రోజు.
మే 10 మొదటి ప్రపంచయుద్ధంలో బతికి బట్ట కట్టిన ఒకే ఒక్క వీరుడు కెనడాలో ఇంకా బతికి వున్నడు.
మే 16 ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.
మే 16 లావోస్ లో భూకంపం రెక్టర్ స్కేల్ పై 6.3 ప్రమాణంతో వచ్చింది.
మే 18 అంటార్కిటిక్ సముద్రంలో 700 కొత్త జీవులను కనుగొన్నారు.
మే 20 డేవిడ్ హిక్స్ను గ్వాంటనామా బే నుంచి ఆస్ట్రేలియా జైలుకి బదిలీ చేసారు.
జూన్ 23 అట్లాంటిస్ రోదసి నౌక 195 రోజుల అంతరిక్షయానం ముగించి ఈ రోజు హుస్టన్ లోని ఎడర్డ్స్ బేస్ లో దిగింది.
జూన్ 26 ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
జూన్ 27 యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం.
భారత్
జూలై 21 జె.కె. రౌలింగ్ రాసిన హారీ పాటర్ వరుస నవలలో చివరిదైన హారీ పాటర్ అండ్ ది డెత్లో హాలోస్ విడుదలైంది.
జూలై 25 భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది.
భారత్
జూలై 28 ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
జూలై 31 పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.
ఆగస్టు 13 అమెరికా దానశీలి, పరోపకారి బ్రూక్ ఏస్టర్ తన 105వ ఏట మరణించాడు.
ఆగస్టు 13 భారతదేశం ఇంగ్లాండ్ మీద టెస్ట్ క్రికెట్ సిరీస్ లో విజయం పొందింది.
భారత్
ఆగస్టు 13 ఉత్తర అర్థగోళంలో కనిపించే వార్షిక పెర్సెయిడ్స్ ఉల్కాపాతం.
ఆగస్టు 13 ప్రపంచ డెఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్- డే 1: యూరోపియన్ ఈతగాళ్ళు పెరుగుతున్నారు.
ఆగస్టు 15 పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఇకా, పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు.
ఆగస్టు 19 ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నారాయణదత్ తివారీ నియమితుడయ్యాడు.
ఆగస్టు 25 హైదరాబాద్లో లుంబినీ పార్క్, కోఠి (గోకుల్ ఛాట్) బాంబు పేలుళ్ళ వల్ల 42 మందికి పైగా మృతిచెందారు.
సెప్టెంబరు 24 మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది.
భారత్
సెప్టెంబరు 30 మెక్సికోలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ను గెలుచుకోవడం ద్వారా భారతీయ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ కొత్త ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు.
భారత్
అక్టోబరు 29 బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20, 000 దాటి రికార్డు సృష్టించింది.
డిసెంబరు 21 రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది.
డిసెంబరు 25 గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం.
భారత్
ఆగస్టు 17 దశరథ్ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్గా పేరు పొందిన సామాన్యవ్యక్తి (జ.1934).
సెప్టెంబరు 4 భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, హస్య రచయిత. (జ.1929).
సెప్టెంబరు 4 వై.రుక్మిణి, తెలుగు, తమిళ, హిందీ నటి.
సెప్టెంబరు 28 పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920).
సెప్టెంబరు 29 కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920).
అక్టోబరు 3 స్వరాజ్ ప్రకాష్ గుప్తా, భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు. (జ.1931).
భారత్
అక్టోబరు 7 పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929).
అక్టోబరు 23 ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927).
నవంబరు 4 అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (జ.1926).
నవంబరు 19 పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931).
డిసెంబరు 13 తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. (జ.1924).
భారత్
డిసెంబరు 27 బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953).
భారత్
సినిమా
ఏప్రిల్ 27 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రం విడుదలైంది.