ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
  • ఫిబ్రవరి 4 భారతీయ సంతతితికి చెందిన అమెరికన్ మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ 22 గంటల 27 నిమిషాలు రోదసిలో నడచి కొత్త రికార్డు సృష్టించింది. భారత్
  • ఫిబ్రవరి 21 2007 ఫిబ్రవరి 21 నాడు విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల జరిగాయి చూడు విశాఖపట్నం వార్డులు.
  • ఫిబ్రవరి 24 52వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలో శ్రీదేవి తన పాత హిట్ పాటలకు నృత్యం చేసి ప్రేక్షకులను అలరించారు. భారత్
  • మార్చి 12 భారత సమాచార ఉపగ్రహం ఇన్సాట్-4బి విజయవంతంగా ప్రయోగించబడింది. భారత్
  • ఏప్రిల్ 25 నకిలీ పాసుపోర్టుల కుంభకోణంలో పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తెరాస అగ్రనేత ఆలె నరేంద్రను పార్టీ నుండి సస్పెండు చేసారు.
  • మే 2 ఆంధ్ర ప్రదేశ్ విధాన మండలి 22 సంవత్సరాలు తరువాత పునరుద్దించబడిన రోజు.
  • మే 10 మొదటి ప్రపంచయుద్ధంలో బతికి బట్ట కట్టిన ఒకే ఒక్క వీరుడు కెనడాలో ఇంకా బతికి వున్నడు.
  • మే 16 ఫ్రాన్సు అధ్యక్షుడిగా నికోలాస్ సర్కోజీ బాధ్యతలు చేపట్టాడు.
  • మే 16 లావోస్ లో భూకంపం రెక్టర్ స్కేల్ పై 6.3 ప్రమాణంతో వచ్చింది.
  • మే 18 అంటార్కిటిక్ సముద్రంలో 700 కొత్త జీవులను కనుగొన్నారు.
  • మే 20 డేవిడ్ హిక్స్ను గ్వాంటనామా బే నుంచి ఆస్ట్రేలియా జైలుకి బదిలీ చేసారు.
  • జూన్ 23 అట్లాంటిస్ రోదసి నౌక 195 రోజుల అంతరిక్షయానం ముగించి ఈ రోజు హుస్టన్ లోని ఎడర్డ్స్ బేస్ లో దిగింది.
  • జూన్ 26 ఆంధ్ర ప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయము ప్రారంభం.
  • జూన్ 27 యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి పదవికి టోనీ బ్లెయిర్ రాజీనామా, కొత్త ప్రధానిగా గోర్డాన్ బ్రౌన్ నియామకం. భారత్
  • జూలై 21 జె.కె. రౌలింగ్ రాసిన హారీ పాటర్ వరుస నవలలో చివరిదైన హారీ పాటర్ అండ్ ది డెత్లో హాలోస్ విడుదలైంది.
  • జూలై 25 భారత రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ పదవిని స్వీకరించింది. భారత్
  • జూలై 28 ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాలు చేసిన ఉద్యమంలో భాగంగా జరిగిన ఆంధ్రప్రదేశ్వ్యాప్త బందులో ఖమ్మం జిల్లా ముదిగొండలో పోలీసు కాల్పులు జరిగి ఏడుగురు మరణించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
  • జూలై 31 పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.
  • ఆగస్టు 13 అమెరికా దానశీలి, పరోపకారి బ్రూక్ ఏస్టర్ తన 105వ ఏట మరణించాడు.
  • ఆగస్టు 13 భారతదేశం ఇంగ్లాండ్ మీద టెస్ట్ క్రికెట్ సిరీస్ లో విజయం పొందింది. భారత్
  • ఆగస్టు 13 ఉత్తర అర్థగోళంలో కనిపించే వార్షిక పెర్సెయిడ్స్ ఉల్కాపాతం.
  • ఆగస్టు 13 ప్రపంచ డెఫ్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్స్- డే 1: యూరోపియన్ ఈతగాళ్ళు పెరుగుతున్నారు.
  • ఆగస్టు 15 పసిఫిక్ మహాసముద్రం తీరంలోని ఇకా, పెరూ దేశంలోని పలుప్రాంతాలలో, భూకంపం, 8.0- (మేగ్నిట్యూడ్) రెక్టర్ స్కేల్ మీద వచ్చి, 514 మంది మరణించగా, 1,090 మంది గాయపడ్డారు.
  • ఆగస్టు 19 ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నారాయణదత్ తివారీ నియమితుడయ్యాడు.
  • ఆగస్టు 25 హైదరాబాద్లో లుంబినీ పార్క్, కోఠి (గోకుల్ ఛాట్) బాంబు పేలుళ్ళ వల్ల 42 మందికి పైగా మృతిచెందారు.
  • సెప్టెంబరు 24 మొట్టమొదటి ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్ ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో పాకిస్తాన్ పై విజయం సాధించింది. భారత్
  • సెప్టెంబరు 30 మెక్సికోలో జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా భారతీయ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ కొత్త ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. భారత్
  • అక్టోబరు 29 బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ 20, 000 దాటి రికార్డు సృష్టించింది.
  • డిసెంబరు 21 రెండో ఎలిజబెత్ రాణి అత్యధిక వయస్సు ఉన్న బ్రిటన్ రాణిగా రికార్డు సృష్టించింది.
  • డిసెంబరు 25 గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం. భారత్

మరణాలు

  • జనవరి 1 డూండీ, తెలుగు సినిమా నిర్మాత.
  • జనవరి 1 టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912).
  • జనవరి 2 వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937).
  • జనవరి 4 కోరాడ నరసింహారావు, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1936).
  • జనవరి 5 బరాటం నీలకంఠస్వామి, ఆధ్యాత్మికవేత్త. (జ.1918).
  • జనవరి 22 నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (జ.1919).
  • మార్చి 22 ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (జ.1918).
  • ఏప్రిల్ 7 నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917).
  • ఏప్రిల్ 13 ధూళిపాళ సీతారామశాస్త్రి, రంగస్థల, సినిమా నటుడు. (జ.1921).
  • ఏప్రిల్ 13 వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (జ.1933).
  • మే 17 టి.కె.దొరైస్వామి, భారతదేశ కవి, రచయిత. (జ.1921). భారత్
  • మే 18 జ్యోతి, దక్షిణ భారత చలన చిత్ర నటి(జ.1963). భారత్
  • మే 30 గుంటూరు శేషేంద్ర శర్మ, తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
  • జూన్ 3 రత్నమాల (నటి), నటన సినీ ప్రపంచములో పలువురి మన్ననలను అందుకొన్నది.
  • జూన్ 17 ఆమంచర్ల శేషగిరిరావు, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల దర్శకుడు(జ.1926).
  • జూలై 8 భారత మాజీ ప్రధానమంత్రి, చంద్రశేఖర్. భారత్
  • జూలై 11 సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939).
  • జూలై 29 ప్రతిమా పూరి, దూరదర్శన్‌లో మొట్టమొదటి న్యూస్ రీడర్.
  • జూలై 30 ఇంగ్మార్ బెర్గ్మాన్, స్వీడిష్ దర్శకుడు. (జ.1918).
  • ఆగస్టు 4 పాగల్ అదిలాబాదీ, తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (జ. 1941).
  • ఆగస్టు 13 మీనా కుమారి, తెలుగు చలన చిత్ర నటి.
  • ఆగస్టు 17 దశరథ్‌ మాంఝీ, పట్టుదలతో 22 సంవత్సరాలు శ్రమించి కొండను తొలిచి తన గ్రామానికి రహదారిని సుగమం చేసి మౌంటెన్ మ్యాన్‌గా పేరు పొందిన సామాన్యవ్యక్తి (జ.1934).
  • సెప్టెంబరు 4 భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు, హస్య రచయిత. (జ.1929).
  • సెప్టెంబరు 4 వై.రుక్మిణి, తెలుగు, తమిళ, హిందీ నటి.
  • సెప్టెంబరు 28 పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920).
  • సెప్టెంబరు 29 కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (జ.1920).
  • అక్టోబరు 3 స్వరాజ్ ప్రకాష్ గుప్తా, భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, చరిత్రకారుడు. (జ.1931). భారత్
  • అక్టోబరు 7 పి.యశోదారెడ్డి, రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (జ.1929).
  • అక్టోబరు 23 ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత (జ.1927).
  • నవంబరు 4 అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. (జ.1926).
  • నవంబరు 19 పులికంటి కృష్ణారెడ్డి, కథకుడు, కవి, రంగస్థల కళాకారుడు, బుర్రకథ గాయకుడు. (జ.1931).
  • డిసెంబరు 13 తేళ్ల లక్ష్మీకాంతమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత జాతీయ కాంగ్రెసు నాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు. (జ.1924). భారత్
  • డిసెంబరు 27 బెనజీర్ భుట్టో, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. (జ.1953). భారత్

సినిమా

  • ఏప్రిల్ 27 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 28 'గుండమ్మగారి మనవడు' చిత్రం విడుదలైంది.
  • మే 31 'వేడుక' చిత్రం విడుదలైంది.
  • జూన్ 15 'శివాజీ' చిత్రం విడుదలైంది.
  • జూన్ 29 'చంద్రహాస్' చిత్రం విడుదలైంది.
  • సెప్టెంబరు 28 'హ్యాపీ డేస్' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు