ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 మణిపూర్‌ రాష్ట్రం అవతరించింది.
  • జనవరి 21 త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
  • జనవరి 31 నేపాల్ రాజుగా బీరేంద్ర అధికారంలోకి వచ్చాడు.
  • మే 7 మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఢిల్లీలో గుండెపోటుతో కన్నుమూశారు.
  • మే 10 అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
  • మే 20 కామెరూన్ రాజ్యాంగ దినం.
  • మే 22 సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది.
  • మే 24 అమెరికా నెవడా అణు పరీక్ష కేంద్రంలో, అణుబాంబు పేల్చి పరీక్షించింది (అణుపాటవపరీక్ష).
  • మే 26 అమెరికా, సోవియట్ యూనియన్లు క్షిపణి వ్యతిరేక ఒప్పందం పై సంతకాలు చేశాయి.
  • జూన్ 5 స్వీడన్ రాజధాని స్టాక్‌హోంలో మొట్టమొదటి పర్యావరణ సదస్సు నిర్వహించబడింది.
  • జూన్ 17 రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
  • జూన్ 18 బ్రిటిష్ యూరోపియన్ ఎయిర్ వేస్ ఫ్లైట్ 548, లండన్ లోని హీత్రూ విమానాశ్రయం నుంచి బయలుదేరిన 3 నిమిషాలలో స్టెయిన్స్ నగరం దగ్గర కూలి, 118 మంది మరణించారు. బ్రిటన్ లో జరిగిన ఘోర విమానప్రమాదంలో ఇది ఒకటి. భారత్
  • జూలై 16 భారత పోలీసు వ్యవస్థలో తొలి మహిళా ఐ.పి.ఎస్ అధికారిణిగా కిరణ్ బేడీ నియమించబడింది. భారత్
  • జూలై 22 రష్యా ప్రయోగించిన వెనెరా 8 పేరు గల రోదసీ నౌక శుక్ర గ్రహం మీద నెమ్మదిగా దిగింది.
  • జూలై 23 మొట్టమొదటి 'ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.
  • ఆగస్టు 4 అలబామా గవర్నర్ అయిన జార్జి వాలెస్ని హత్య చేయబోయిన ఆర్థర్ బ్రెమెర్ (21 సంవత్సరాలు) కి అమెరికా లోని మేరీలేండ్ న్యాయస్థానం, 63 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ హత్యాప్రయత్నంలో, జార్జి వాలెస్కి పక్షవాతం వచ్చింది. మరో ముగ్గురు గాయపడ్డారు.15 మే 1972 నాడు హత్యాప్రయత్నం జరిగింది. 4 ఆగష్టు 1972 నాడు శిక్ష వేసారు (న్యాయస్థానం 77 రోజులు సమయం తీసుకుంది) . ఆ తరువాత శిక్షను 53 సంవత్సరాలకు తగ్గించారు. విడుదల అయ్యే సమయానికి నిందితుడి వయస్సు 74 సంవత్సరాలు ఉంటుంది.
  • ఆగస్టు 7 ఉగాండా నియంత, ఇడి అమిన్ ఆసియా దేశస్తులందరూ, ఉగాండాని 90 రోజులలోగా, విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీచేశాడు.
  • ఆగస్టు 23 టంగుటూరి ప్రకాశం శత జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఆంధ్ర కేసరి శత జయంతుత్సవ జూనియర్ కళాశాల ప్రారంభమైంది.
  • ఆగస్టు 26 20వ వేసవి ఒలింపిక్ క్రీడలు మ్యూనిచ్ లో ప్రారంభమయ్యాయి.
  • సెప్టెంబరు 15 మాయాబజార్, పాతాళ భైరవి వంటి కళాఖండాల దర్శకుడు కె.వి.రెడ్డి అనారోగ్యంతో మరణించారు.
  • అక్టోబరు 2 భారతదేశపు మొట్టమొదటి టెలివిజన్ స్టేషన్ బొంబాయిలో మొదలయ్యింది. భారత్
  • అక్టోబరు 16 టంగుటూరి ప్రకాశం గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదలైంది.
  • అక్టోబరు 28 కరువు బాధితుల సహాయ నిధి కోసం కృష్ణ తోటి నటీనటులతో కలిసి సినిమా తారల యాత్ర కార్యక్రమాలను ప్రారంభించారు.
  • నవంబరు 18 భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు. భారత్
  • డిసెంబరు 21 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖరరెడ్డి, విజయమ్మ దంపతులకు జన్మించారు.

జననాలు

  • జనవరి 7 ఎస్.పి.బి.చరణ్, భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత. భారత్
  • జనవరి 18 వినోద్ కాంబ్లి, భారత క్రికెట్ ఆటగాడు. భారత్
  • జనవరి 22 నమ్రత శిరోద్కర్ , మిస్ ఇండియా , సినీ నటి. భారత్
  • జనవరి 31 కళ్యాణ్ మాలిక్ , గాయకుడు,సంగీత. దర్శకుడు.
  • ఫిబ్రవరి 4 శేఖర్ కమ్ముల, తెలుగు సినీదర్శకుడు, నిర్మాత, సినీ రచయిత.
  • ఫిబ్రవరి 13 నూనె శ్రీనివాసరావు, సామాజిక శాస్త్రవేత్త.
  • ఫిబ్రవరి 24 పూజా భట్ , భారతీయ నటి ,మోడల్, నిర్మాత, దర్శకురాలు. భారత్
  • మార్చి 9 ఆర్. పి. పట్నాయక్, తెలుగు సినీ సంగీత దర్శకుడు, నటుడు, రచయిత, చిత్ర దర్శకుడు.
  • మార్చి 10 ఆర్.పి.పట్నాయక్, సంగీత దర్శకుడు, గాయకుడు,రచయిత , నటుడు, నిర్మాత.
  • మార్చి 26 మధుబాల, భారతీయ చలన చిత్ర నటి. భారత్
  • ఏప్రిల్ 1 వెంకట్ గోవాడ, రంగస్థల నటుడు, దర్శకుడు, నిర్మాత, టి.వి., చలనచిత్ర నటుడు.
  • ఏప్రిల్ 14 కునాల్ గంజ్వాల, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. భారత్
  • ఏప్రిల్ 16 జె. డి. చక్రవర్తి , నటుడు, దర్శకుడు.
  • ఏప్రిల్ 17 ఇంద్రగంటి మోహన కృష్ణ, తెలుగు సినిమా దర్శకుడు.
  • ఏప్రిల్ 20 మమతా కులకర్ణి, హిందీ సినీనటి. భారత్
  • ఏప్రిల్ 20 అంజలా జవేరి, టాలీవుడ్, బాలీవుడ్ సినీ నటి.
  • ఏప్రిల్ 30 వి.ఎన్.ఆదిత్య ,రచయిత , నిర్మాత దర్శకుడు.
  • మే 25 కరణ్ జోహార్, భారత దేశ సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత, నటుడు. భారత్
  • జూన్ 3 టి. హరీశ్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
  • జూలై 8 సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు. భారత్
  • జూలై 15 వి.ఎన్.ఆదిత్య, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత.
  • జూలై 18 సౌందర్య, సినీనటి. (మ.2004).
  • జూలై 18 సుఖ్విందర్ సింగ్, నేపథ్య గాయకుడు.
  • జూలై 28 ఆయేషా జుల్కా , హిందీ, ఒరియా, తెలుగు, కన్నడ ,నటి.
  • ఆగస్టు 9 మురళిశర్మ , తెలుగు తో పాటు పలు ఇతర భాషలలో ప్రతి నాయకుడు.
  • ఆగస్టు 19 మురళీ శర్మ , తెలుగు చలన చిత్ర సహాయ పాత్రల నటుడు.
  • ఆగస్టు 27 ఖలీ, భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు. భారత్
  • సెప్టెంబరు 10 అనురాగ్ కశ్యప్, భారతీయ చిత్ర దర్శకుడు, చిత్ర రచయిత. భారత్
  • సెప్టెంబరు 23 కోరుకంటి చందర్ తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.
  • సెప్టెంబరు 24 శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు.
  • సెప్టెంబరు 30 శాంతను ముఖర్జీ (షాన్), పేరుగాంచిన భారత గాయకుడు. భారత్
  • అక్టోబరు 11 సంజయ్ బంగర్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
  • నవంబరు 1 పరిపూర్ణానంద స్వామి, మత సామరస్య బోధకుడు.
  • నవంబరు 17 రోజా సెల్వమణి, దక్షిణ భారతదేశంలో సినిమా నటి, రాజకీయవేత్త. భారత్
  • నవంబరు 18 జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత. భారత్
  • డిసెంబరు 21 వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు.
  • డిసెంబరు 21 తుంపిల్ల శ్రీనివాస్, న్యాయవాది, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.

మరణాలు

  • జనవరి 10 పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. పింగళి కాటూరి జంటకవులలో పింగళి ఈయనే. (జ.1894).
  • జనవరి 22 స్వామి రామానంద తీర్థ, స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903).
  • జనవరి 23 కె. అచ్యుతరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు, మంత్రివర్యులు. (జ. 1914). భారత్
  • జనవరి 24 కాండూరు నరసింహాచార్యులు కవి, రచయిత, ఆయుర్వేద వైద్యుడు. (జ. 1900).
  • జనవరి 31 మహేంద్ర, నేపాల్ రాజు.
  • మార్చి 21 పప్పూరు రామాచార్యులు, తెలుగు కవి,మాజీశాసనసభ్యుడు. (జ.1896).
  • మార్చి 31 మీనా కుమారి, భారత చలనచిత్ర నటీమణి. (జ.1932). భారత్
  • మే 7 దామోదరం సంజీవయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921).
  • మే 29 పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (జ.1906). భారత్
  • జూన్ 20 కొచ్చెర్లకోట రంగధామరావు, స్పెక్ట్రోస్కోపీ రంగంలో పేరొందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1898).
  • జూలై 8 పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) యొక్క నాయకుడు ఘసన్ కనాఫానీ.
  • జూలై 19 కలుగోడు అశ్వత్థరావు, స్వయంకృషితో తెలుగు కన్నడ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు. (జ.1901).
  • జూలై 20 గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (జ.1930). భారత్
  • జూలై 28 చారు మజుందార్, నక్సల్బరీ ఉద్యమ నేత. (జ.1918).
  • సెప్టెంబరు 15 కె.వి.రెడ్డి , తెలుగు చలనచిత్ర దర్శకుడు .(జ.1912).
  • సెప్టెంబరు 27 షియాలి రామామృత రంగనాథన్, భారతదేశానికి చెందిన లైబ్రేరియన్ ఇంకా గణిత శాస్త్రవేత్త. (జ.1892). భారత్
  • నవంబరు 5 సుభద్రా శ్రీనివాసన్, ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకురాలు. (జ.1925).
  • నవంబరు 18 జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899).
  • డిసెంబరు 21 దాసరి కోటిరత్నం, రంగస్థలనటి, తెలుగు సినిమా నటి, తెలుగు సినిమారంగలో తొలి మహిళా చిత్ర నిర్మాత. (జ.1910).
  • డిసెంబరు 25 చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878). భారత్
  • డిసెంబరు 25 కాకాని వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.

సినిమా

  • జనవరి 15 'భార్యాబిడ్డలు' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 11 'బీదలపాట్లు' చిత్రం విడుదలైంది.
  • మే 12 'మంచి రోజులొచ్చాయి' చిత్రం విడుదలైంది.
  • మే 26 'గూడుపుఠాని' చిత్రం విడుదలైంది.
  • జూన్ 9 'దత్తపుత్రుడు' చిత్రం విడుదలైంది.
  • సెప్టెంబరు 28 'కులగౌరవం' చిత్రం విడుదలైంది.
  • అక్టోబరు 6 'అక్కా తమ్ముడు' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 22 'కొడుకు కోడలు' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు