సంఘటనలు
- జనవరి 1 GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
- జనవరి 8 ఆంధ్ర ప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి వద్ద ఒ.ఎన్.జి.సికి చెందిన రిగ్గులో బ్లో ఔట్ జరిగింది.
- జనవరి 12 జపాన్ లోని కోబే నగరంలో పెను భూకంపం వచ్చి 5,092 మంది చనిపోయారు.
- మే 2 రాజేంద్ర కుమారి పాండిచ్చేరి గవర్నరుగా నియామకం.
- మే 14 14వ దలైలామా 6 సంవత్సరాల 'గెధున్ చోక్యి నీమా' (జననం :1989 ఏప్రిల్ 25) ను 'పంచన్లామా' 11వ అవతారంగా ప్రకటించాడు.
- మే 18 నటి ఎలిజబెత్ మాంట్ గోమెరి, లాస్ ఏంజిల్స్లో మరణించింది.
- జూన్ 5 "బోస్-ఐన్స్టీన్ కండెన్సేట్"ను మొదటి సారి సృష్టించారు.
- జూలై 5 సోవియట్ రష్యా నుంచి స్వతంత్రం పొందిన నాలుగు సంవత్సరాల తరువాత, ఆర్మీనియా దేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది.
- జూలై 5 భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు హైదరాబాదులో వాలీబాల్ క్రీడాకారులైన పి.వి. రమణ, విజయ దంపతులకు జన్మించింది.
- ఆగస్టు 27 ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
- ఆగస్టు 30 బోస్నియన్ సెర్బ్ సైన్యాన్ని ఎదుర్కోవటానికి నాటో 'ఆపరేషన్ డెలిబెరేట్ ఫోర్స్'ని అమలు చేసింది.
- సెప్టెంబరు 1 నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ 19వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
- సెప్టెంబరు 1 నారా చంద్రబాబునాయుడు తొలిసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
- సెప్టెంబరు 1 ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి కోల్పోగా ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
జననాలు
- జనవరి 9 దేవేంద్ర హర్నె 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి ప్రణమ్య మెనారియకి కూడా 25 వేళ్ళు ఉన్నాయి.
భారత్
- జనవరి 13 వైష్ణవ తేజ్ , తెలుగు సినిమా నటుడు.
- ఫిబ్రవరి 1 జాఫర్ గోహర్, పాకిస్తానీ క్రికెట్ ఆటగాడు.
- మే 8 ఐశ్వర్య మీనన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి.
భారత్
- జూలై 5 పి.వి. సింధు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పలు అంతర్జాతీయ పోటీలలో విజయకేతనం ఎగురవేసింది.
- జూలై 8 మెట్టు అనిల్ కిరణ్, ఏఐయస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ.
- జూలై 22 అర్మాన్ మాలిక్, గేయ రచయిత, సింగర్.
- ఆగస్టు 20 కావ్య ధాపర్, తమిళ, తెలుగు, హిందీ, చిత్రాల నటి, మోడల్.
- సెప్టెంబరు 11 సంయుక్త మీనన్ , దక్షిణ భారత చలన చిత్ర నటి.
భారత్
- నవంబరు 2 నివేదా థామస్, మోడల్, మలయాళ, తమిళ, తెలుగు నటి.
- నవంబరు 5 మోహ్రీన్ పిర్జాదా, హిందీ, తెలుగు, చిత్రాల నటి, మోడల్.
- డిసెంబరు 11 నభా నటేష్, కన్నడ, తెలుగు, చలన చిత్ర నటి, మోడల్.
మరణాలు
- జనవరి 1 యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త.
- జనవరి 8 మధు లిమాయె, భారత రాజకీయనేత. (జ.1922).
భారత్
- జనవరి 19 కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు. (జ.1912).
- ఫిబ్రవరి 8 మంచికంటి రాంకిషన్ రావు, వీరతెలంగాణా విప్లవ పోరాట యోధుడు.
- ఫిబ్రవరి 18 మిలన్ గుప్తా, భారతీయ హార్మోనికా వాద్యకారుడు. (జ.1930).
భారత్
- ఫిబ్రవరి 25 ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (జ.1920).
- మార్చి 6 మోటూరి సత్యనారాయణ, దక్షిణ భారతదేశంలో హిందీ వ్యాప్తిచేసిన మహా పండితుడు, స్వాతంత్ర్య సమరయోధులు. (జ.1902).
భారత్
- మార్చి 7 బి.ఎన్.బి.రావు, భారతీయ వైద్యుడు, పరిశోధకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (జ.1910).
భారత్
- మార్చి 31 సెలీనా, మెక్సికన్-అమెరికన్ గాయని, గీత రచయిత్రి. నర్తకి (జ.1971).
- ఏప్రిల్ 10 మొరార్జీ దేశాయి, భారత మాజీ ప్రధాన మంత్రి. (జ.1896).
భారత్
- మే 5 నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1921).
- జూన్ 9 ఎన్.జి.రంగా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు, రైతు నాయకుడు. (జ.1900).
భారత్
- జూలై 2 గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు". (జ.1929).
- జూలై 18 రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922).
- సెప్టెంబరు 5 గిరిజ, తెలుగు చలన చిత్ర హాస్య నటి(జ.1936).
- అక్టోబరు 1 ఆదిత్య విక్రమ్ బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త.
- నవంబరు 5 ఇల్జక్ రాబిన్, ఇజ్రాయిల్ మాజీ ప్రధానమంత్రి.
భారత్
- నవంబరు 14 పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు.
భారత్
- నవంబరు 19 రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి, ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు, సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1908).
భారత్
- నవంబరు 19 మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (జ.1920).
- నవంబరు 26 ఆవేటి పూర్ణిమ, తెలుగు రంగస్థల నటీమణి (జ.1918).
- నవంబరు 26 ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు (జ.1915).
- డిసెంబరు 1 మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (జ.1947).
- డిసెంబరు 5 కాశీనాయన, పాడుబడిన ఆలయాలకు జీర్ణోద్ధరణ చేసి అక్కడ ప్రతిరోజు అన్నదానం జరిగేలా ఏర్పాటు చేసారు.
- డిసెంబరు 6 కాశీనాయన, ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత.