మే 6 మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
మే 7 దామోదరం సంజీవయ్య ఉపాధ్యాయిని కృష్ణవేణిని వివాహం చేసుకున్నారు.
మే 24 భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట మొదటిసారిగా వెళ్ళింది (ఎగిరింది). (న్యూమెక్సికో లోని 'వైట్సాండ్స్'. ఇది ఎడారి ప్రాంతం).
మే 24 జర్మన్ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పుట్టిన రోజు.
మే 24 ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఒక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది.
జూన్ 16 ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
జూలై 5 గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
జూలై 5 బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది.
భారత్
జూలై 8 భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభించాడు.
భారత్
జూలై 21 జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు.
జూలై 21 ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవాలో ఒప్పుకున్నది.
భారత్
జూలై 31 ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
ఆగస్టు 4 హఫీజ్ జలంధ్రీ రాసిన, అహ్మద్ జి. ఛగియ కంపోజ్ (కూర్చిన) చేసిన, ఖయుమి తరానా జాతీయగీతాన్ని, పాకిస్థాన్, "ప్రభుత్వ జాతీయ గీతం"గా ఆమోదించింది. విను.
సెప్టెంబరు 28 హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు.
అక్టోబరు 2 ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్నగర్ పశ్చిమ బెంగాల్లో భాగంగా మారింది.
భారత్
అక్టోబరు 18 'టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్' సంస్థ ట్రాన్సిస్టర్రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది.
అక్టోబరు 19 బీజింగ్లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావోను కలిసాడు.
భారత్
అక్టోబరు 21 పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది.
భారత్
నవంబరు 4 టంగుటూరి ప్రకాశం ప్రభుత్వంపై కృషికార్ లోక్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
నవంబరు 15 టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు).
నవంబరు 15 ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
నవంబరు 15 అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో టంగుటూరి ప్రకాశం నేతృత్వంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది.
జననాలు
జనవరి 1 శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
భారత్
జనవరి 1 తారాచంద్ భగోరా, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. లోక్సభ సభ్యుడు.
భారత్
జనవరి 19 సి.హెచ్.మోహనరావు, రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు.
ఫిబ్రవరి 16 మైకెల్ హోల్డింగ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
ఫిబ్రవరి 17 కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు.
ఫిబ్రవరి 23 సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది.
మార్చి 12 దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.