ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 17 తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామంలో జన్మించారు.
  • మార్చి 11 కె.వి.రెడ్డి తీసిన సాంఘిక వ్యంగ్య చిత్రం పెద్దమనుషులు విడుదలై జాతీయ పురస్కారం పొందిన తొలి తెలుగు చిత్రమైంది.
  • మే 1 రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.
  • మే 6 మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
  • మే 7 దామోదరం సంజీవయ్య ఉపాధ్యాయిని కృష్ణవేణిని వివాహం చేసుకున్నారు.
  • మే 24 భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట మొదటిసారిగా వెళ్ళింది (ఎగిరింది). (న్యూమెక్సికో లోని 'వైట్‌సాండ్స్'. ఇది ఎడారి ప్రాంతం).
  • మే 24 జర్మన్ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పుట్టిన రోజు.
  • మే 24 ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఒక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది.
  • జూన్ 16 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు స్విట్జర్లాండ్ లో ప్రారంభమయ్యాయి.
  • జూలై 5 గుంటూరులో 1954 జూలై 5 నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు. కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై 1937 నవంబరు 15 న సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హైకోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
  • జూలై 5 బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బి.బి.సి.) తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహినిని ప్రసారం చేసింది. భారత్
  • జూలై 8 భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభించాడు. భారత్
  • జూలై 21 జెనీవా సమావేశంలో వియత్నాం దేశాన్ని, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలుగా విడదీసారు.
  • జూలై 21 ఫ్రాన్స్, ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం దేశాలకు స్వాతంత్ర్యం ఇచ్చుటకు, జెనీవాలో ఒప్పుకున్నది. భారత్
  • జూలై 31 ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
  • ఆగస్టు 4 హఫీజ్ జలంధ్రీ రాసిన, అహ్మద్ జి. ఛగియ కంపోజ్ (కూర్చిన) చేసిన, ఖయుమి తరానా జాతీయగీతాన్ని, పాకిస్థాన్, "ప్రభుత్వ జాతీయ గీతం"గా ఆమోదించింది. విను.
  • సెప్టెంబరు 28 హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు.
  • అక్టోబరు 2 ఫ్రెంచ్ ఆధీనంలో ఉన్న చందర్‌నగర్ పశ్చిమ బెంగాల్‌లో భాగంగా మారింది. భారత్
  • అక్టోబరు 18 'టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌' సంస్థ ట్రాన్సిస్టర్‌రేడియోను ప్రపంచానికి పరిచయం చేసింది.
  • అక్టోబరు 19 బీజింగ్లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావోను కలిసాడు. భారత్
  • అక్టోబరు 21 పాండిచ్చేరి, కారైక్కల్, మాహే లను ఫ్రాన్సు నుండి భారత్కు బదిలీ చెయ్యడంపై రెండు దేశాలు సంతకం చేసాయి. నవంవర్ 1 న బదిలీ జరిగింది. భారత్
  • నవంబరు 4 టంగుటూరి ప్రకాశం ప్రభుత్వంపై కృషికార్ లోక్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
  • నవంబరు 15 టంగుటూరి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్ కాదు) ముఖ్యమంత్రిగా పదవీ విరమణ (1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబరు 15 వరకు).
  • నవంబరు 15 ఆంధ్ర రాష్ట్రంలో (ఆంధ్రప్రదేశ్ కాదు) రాష్ట్రపతి పాలన మొదలు (1954 నవంబరు 15 నుంచి 1955 మార్చి 28 వరకు).
  • నవంబరు 15 అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో టంగుటూరి ప్రకాశం నేతృత్వంలోని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పడిపోయింది.

జననాలు

  • జనవరి 1 శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి. భారత్
  • జనవరి 1 తారాచంద్ భగోరా, భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. లోక్‌సభ సభ్యుడు. భారత్
  • జనవరి 19 సి.హెచ్.మోహనరావు, రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు.
  • ఫిబ్రవరి 16 మైకెల్ హోల్డింగ్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
  • ఫిబ్రవరి 17 కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపకుడు.
  • ఫిబ్రవరి 23 సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది.
  • మార్చి 12 దుశర్ల సత్యనారాయణ, నీటి హక్కుల కార్యకర్త, జల సాధన సమితి (జెఎస్ఎస్) సంస్థ వ్యవస్థాపకుడు.
  • మార్చి 19 ఇందూ షాలిని, భారత విద్యావేత్త. భారత్
  • మార్చి 20 దాట్ల దేవదానం రాజు, కథకుడు, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆదర్శ-అభ్యుదయవాది.
  • మార్చి 28 మూన్ మూన్ సేన్, భారతీయ సినీ నటీ, టీ వీ నటీ,రాజకీయ నాయకురాలు. భారత్
  • ఏప్రిల్ 6 ఆడారి వెంకటరమణ (దీపశిఖ), కథా రచయిత.
  • మే 23 వాసిరెడ్డి నవీన్, సాహితీకారుడు.
  • జూన్ 9 ఎం. ఎఫ్. గోపీనాథ్, తెలుగు రచయిత, రాజకీయ విశ్లేషకుడు, భారతదేశపు తొలి దళిత కార్డియాలజిస్టు.
  • జూన్ 22 దేవినేని నెహ్రూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ రాష్ట్ర మంత్రి. (మ.2017).
  • జూలై 4 మంజుల , భారతీయ సినీనటి (మ.2013). భారత్
  • జూలై 14 శరత్ కుమార్, భారతీయ నటుడు, విలేకరి, రాజకీయ నాయకుడు. భారత్
  • జూలై 19 దామెర రాములు, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఉద్యమించిన కవి.
  • జూలై 27 రాజ్, తెలుగు సినిమా సంగీత దర్శకుడు (మ. 2023).
  • ఆగస్టు 4 ఉండవల్లి అరుణ కుమార్, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్
  • ఆగస్టు 13 రేణుకా చౌదరి, కాంగ్రెస్ నాయకురాలు, మాజీ మంత్రి.
  • ఆగస్టు 18 VK శశికళ, రాజకీయవేత్తగా మారిన భారతీయ వ్యాపారవేత్త. భారత్
  • సెప్టెంబరు 20 ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.2013).
  • అక్టోబరు 3 సత్యరాజ్, దక్షిణ భారత చలన చిత్రాలుతో పాటు హిందీ చిత్రాల్లో, సహాయ, ప్రతి నాయక నటుడు. భారత్
  • అక్టోబరు 5 ఎం.వి.రఘు, ఛాయాగ్రాహకుడు, కళ్లు సినిమా దర్శకుడు.
  • అక్టోబరు 10 రేఖ, బాలీవుడ్ చిత్రాలలో నటిస్తున్న ఒక భారతీయ నటి. ప్రతిభావంతమైన నటిగా గుర్తింపు పొందినది. భారత్
  • అక్టోబరు 27 అనురాధ పౌడ్వాల్ , భారతీయ నేపథ్య గాయని , పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారత్
  • నవంబరు 7 కమల్ హాసన్, చలనచిత్ర నటుడు.
  • నవంబరు 9 శంకర్ నాగ్, కన్నడ సినిమాలో పాపులర్ నటుడు, దర్శకుడు జననం.
  • నవంబరు 19 చింతా మోహన్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు.
  • నవంబరు 25 సౌభాగ్య, కవితాసంపుటి 'సంధ్యాబీభత్సం' ప్రతిష్ఠాత్మక ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది.
  • నవంబరు 29 పూసపాటి కృష్ణసూర్యకుమార్, గణిత మేధావి.
  • నవంబరు 30 వి.ఆర్.గౌరీశంకర్ సామాజిక కార్యకర్త, శృంగేరి శారదా పీఠం నిర్వాహకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
  • డిసెంబరు 1 మేధా పాట్కర్, నర్మదా బచావో ఉద్యమంతో పేరుగాంచిన సామాజిక ఉద్యమకారిణి.
  • డిసెంబరు 10 జలీల్ ఖాన్, విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు.

మరణాలు

  • నవంబరు 28 ఎన్రికో ఫెర్మి, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
  • నవంబరు 29 హెచ్. దేవదానము , కవి, రచయిత. (మ. 1902).

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు