జనవరి 5 జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.
భారత్
జనవరి 6 బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
భారత్
జనవరి 9 ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
జనవరి 20 అమెరికా 44వ అధ్యక్షుడిగా బరాక్ ఒబామా పదవీ బాధ్యతలు చేపట్టారు.
జనవరి 28 పవన్ కళ్యాణ్ నటి రేణూ దేశాయ్ను వివాహం చేసుకున్నారు.
జనవరి 31 ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్ కు చెందిన యూకీ బాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.
భారత్
ఫిబ్రవరి 19 మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఫిబ్రవరి 23 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.
భారత్
మార్చి 3 పాకిస్తాన్లో లాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.
మార్చి 6 న్యూయార్క్లో జరిగిన వేలంలో మహాత్మా గాంధీ వస్తువులను విజయ్ మాల్యా 1.8 మిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు.
భారత్
మార్చి 7 మహిళల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంటు ఆస్ట్రేలియాలో ప్రారంభమైనది.
మార్చి 11 వన్డే క్రికెట్లో అతితక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన భారతీయుడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు.
భారత్
మార్చి 22 జానపద చిత్రాల కథానాయకుడు 'కత్తుల' కాంతారావు క్యాన్సర్ వ్యాధితో హైదరాబాదు యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు.
మార్చి 26 ఎన్నికల ప్రచారం అనంతరం సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జూనియర్ ఎన్.టి.ఆర్ గాయపడ్డారు.
ఏప్రిల్ 12 థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది.
ఏప్రిల్ 19 భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
భారత్
మే 20 ఇండోనేషియాలో విమానం కూలి 100 మంది మరణించారు.
మే 20 వై.ఎస్.రాజశేఖరరెడ్డి వరుసగా రెండో పర్యాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మే 22 భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్ సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు. (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
భారత్
మే 23 ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
మే 26 ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
జూన్ 14 ఇరాన్ అధ్యక్షుడిగా అహ్మదీ నెజాద్ ఎన్నికయ్యాడు.
జూన్ 19 32 సంవత్సరముల అనంతరం భారతదేశపు ద్రవ్యోల్బణం ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది.
భారత్
జూన్ 21 ఇండోనేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నెగ్గిన తొలి భారతీయురాలిగా సైనా నెహ్వాల్ రికార్డు సృష్టించింది.
భారత్
జూలై 2 స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది.
భారత్
జూలై 3 మార్క్ II.5 స్కై ట్రెయిన్ పేరు గల కార్లు కెనడా లోని వాన్ కూవర్ మెట్రో నగరంలో ప్రవేశపెట్టారు.
జూలై 30 మగధీర సంగీతానికి కీరవాణి ఫిల్మ్ఫేర్ ఉత్తమ సంగీత దర్శకుడు పురస్కారం అందుకున్నారు.
జూలై 30 రాజమౌళి తీసిన మగధీర అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రంగా నిలిచి ఆయనకు నంది, ఫిల్మ్ఫేర్ ఉత్తమ దర్శకుడు పురస్కారాలు తెచ్చింది.
జూలై 30 రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన మగధీర సంచలన విజయం సాధించి, ఆయనకు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది.
ఆగస్టు 2 16మంది ప్రయాణికులతో బయలుదేరిన మెర్పాతి నుసంతారా ఎయిర్ లైన్స్ ఫ్లయిట్ 9760, ట్విన్ ఓట్టర్ విమానం, పాపువా, ఇండోనేషియా ప్రాంతంలో కనిపించకుండా పోయింది.
ఆగస్టు 2 ఎయిడ్స్ (AIDS) కలిగించే కొత్తరకం వైరస్ ను, కామెరూన్ దేశంలో నివసిస్తున్న ఒక మహిళలో కనుగొన్నారు.
ఆగస్టు 4 క్రమం తప్పకుండా యూరోపియన్లు 50% కంటే ఎక్కువ మంది, ఇంటర్నెట్ (అంతర్జాలం) లో విహరిస్తారని, (గత ఐదు సంవత్సరాలలో 33% పెరిగింది) యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.
ఆగస్టు 4 తొలి స్వైన్ ఫ్లూ మరణం, మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది.
భారత్
ఆగస్టు 7 ఉత్తరాఖండ్ గవర్నర్గా మార్గరెట్ ఆల్వా ప్రమాణస్వీకారం.
ఆగస్టు 10 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి.
ఆగస్టు 12 ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా చూడగల సాంకేతిక పరిజ్ఞానం భువన్ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
భారత్
ఆగస్టు 13 భారతదేశం H1N1 స్వైన్ ఫ్లూ వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడానికి ముంబైలో మూసివేతలు ప్రారంభించింది.
భారత్
ఆగస్టు 13 మహిళా బాక్సింగ్ ను మొదటిసారి 2012 ఒలింపిక్స్ లో చేర్చేందుకు నిర్ణయించారు.
ఆగస్టు 13 బ్రిటన్ లో నిరుద్యోగ సంఖ్య 2.4 మిలియన్లకు పెరిగింది.
సెప్టెంబరు 2 ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల్లో ప్రమాదానికి గురై ఆయన దుర్మరణం చెందారు.
సెప్టెంబరు 3 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టాడు.
సెప్టెంబరు 3 హెలికాప్టర్ ప్రమాదంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహా ఐదుగురు మరణించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ధృవీకరించింది.
సెప్టెంబరు 4 కొణిజేటి రోశయ్య, ఆంధ్రప్రదేశ్ 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
సెప్టెంబరు 4 వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంత్యక్రియలు కడప జిల్లా ఇడుపులపాయలో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి.
సెప్టెంబరు 14 విశాఖపట్నం క్రికెట్ స్టేడియానికి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు.
సెప్టెంబరు 15 తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.
సెప్టెంబరు 19 సోనీ టీవీ కార్యక్రమం '10 కా దమ్'లో శ్రీదేవి అతిథిగా కనిపించారు.
భారత్
సెప్టెంబరు 23 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2, మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
భారత్
సెప్టెంబరు 23 నుంచి, HP ఎంటర్ప్రైజ్ సర్వీసెస్' గా EDS మార్కెట్ కార్యకలాపాలు మొదలుపెట్టింది, '.
సెప్టెంబరు 29 అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ 75 కేజీల వర్గంలో బిజేందర్ కుమార్ కి మొదటి స్థానం దక్కింది.
అక్టోబరు 2 తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
అక్టోబరు 8 2009 అక్టోబరు 8న, ఒబామా మాథ్యూ, షెపర్డ్, జేమ్స్ బైర్డ్, Jr. హేట్ ప్రతీకార నేరాల నిరోధక చట్టంపై సంతకం చేశారు.
అక్టోబరు 15 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు టివి ఛానెల్ ప్రారంభమైంది. ఎ.బి.ఎన్ అంటే ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్.
అక్టోబరు 19 హైదరాబాదులో పి.వి.నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ప్రారంభమైంది.
నవంబరు 29 తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో 'ఆమరణ నిరాహార దీక్ష' ప్రారంభించాడు.
నవంబరు 29 తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
డిసెంబరు 3 తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడిగా కాసోజు శ్రీకాంతాచారి నిలిచారు.
డిసెంబరు 8 డెన్మార్క్ రాజధాని నగరం కోపెన్హాగెన్ లో 15వ ప్రపంచ వాతావరణ సదస్సు ప్రారంభమైనది.
డిసెంబరు 9 అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటన చేశారు.
డిసెంబరు 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి చిదంబరం అధికారికంగా ప్రకటించారు.
భారత్
డిసెంబరు 17 హైదరాబాదులో కొమరం భీమ్ విగ్రహం నెలకొల్పుతామని ప్రభుత్వం ప్రకటించింది.
డిసెంబరు 19 భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కరి నియమించబడ్డాడు.
భారత్
డిసెంబరు 23 రాష్ట్రంలోని అన్ని పార్టీల ఏకాభిప్రాయం వచ్చేవరకు తెలంగాణపై చర్యలు ఉండవని కేంద్రం ప్రకటించడంతో ఉద్యమం మళ్లీ భగ్గుమంది.
భారత్
డిసెంబరు 26 ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించాడు.
డిసెంబరు 30 జార్ఖండ్ ముఖ్యమంత్రిగా శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.
మరణాలు
జనవరి 1 కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవి. (జ.1947).
జనవరి 6 జీ.ఎం.షా, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి.
భారత్
జనవరి 27 ఆర్.వెంకట్రామన్, భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1910).
భారత్
జనవరి 31 నగేష్, దక్షిణ భారతదేశానికి చెందిన హాస్యనటుడు, రంగస్థల నటుడు (జ.1933).
భారత్
ఫిబ్రవరి 1 రణబీర్ సింగ్ హుడా, భారత రాజ్యాంగ నిర్మాణసభ సభ్యుడు.
భారత్
ఫిబ్రవరి 19 నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (జ. 1920).
మార్చి 11 విమలా థాకర్, గాంధేయవాది, వినోబా భావే సన్నిహితురాలు.
మార్చి 11 కె.ఎన్.వై.పతంజలి, తెలుగు రచయిత. (జ.1952).
మార్చి 22 టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923).
ఏప్రిల్ 27 ఫిరోజ్ ఖాన్, హిందీ సినిమా నటుడు. (జ.1939).
భారత్
ఏప్రిల్ 29 గుత్తా రామినీడు, తెలుగు సినీ దర్శకుడు, సారథి స్టూడియో వ్యవస్థాపకుడు. (జ.1929).
మే 12 గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1915).
భారత్
జూన్ 7 భాను ప్రకాష్, తెలుగునాట నాటక వికాసానికి దోహదం చేసిన కళాకారుడు, చలనచిత్ర నటుడు. (జ.1939).
జూన్ 25 మైకల్ జాక్సన్, అమెరికా సంగీత కళాకారుడు. (జ.1958).