ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 15 తెలుగు చలనచిత్ర రంగ మార్గదర్శి రఘుపతి వెంకయ్య నాయుడు తన 72వ ఏట మరణించారు.
  • మే 24 హెచ్.ఎమ్.ఎస్. హుడ్, అనే బ్రిటిష్ యుద్ధనౌకను జర్మనీ యుద్ధనౌక డి.కె.ఎమ్. 'బిస్మార్క్' ముంచివేసింది. 1416 మంది మరణించారు.బ్రతికి బట్ట కట్టిన వారు ముగ్గురే ముగ్గురు. భారత్
  • జూలై 7 అమెరికన్ సైన్యం ఐస్ లాండ్ వచ్చింది.
  • జూలై 16 100 డిగ్రీల ఫారెన్‌హీట్ (38 డిగ్రీల సెంటిగ్రేడ్) వేడి (వాతావరణం) సీట్టెల్ నగరం (వాషింగ్టన్ రాష్ట్రం, అమెరికా) లో నమోదు అయ్యింది.
  • ఆగస్టు 30 రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడి మొదలైంది.

జననాలు

  • జనవరి 1 భోలేకర్ శ్రీహరి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి. (మ.2018).
  • జనవరి 4 అంజనా ముంతాజ్, హిందీ చలనచిత్ర నటి. భారత్
  • ఫిబ్రవరి 8 జగ్జీత్ సింగ్, ప్రఖ్యాతిగాంచిన భారతీయ గజల్ గాయకుడు. (మ.2011). భారత్
  • ఏప్రిల్ 1 అజిత్ వాడేకర్, భారత క్రికెటర్. భారత్
  • ఏప్రిల్ 10 మణి శంకర్ అయ్యర్, ఒక మాజీ భారత దౌత్యవేత్త. భారత్
  • ఏప్రిల్ 24 షరాఫ్ తులసీ రామాచారి , పేరెన్నికగని, వేల కార్టూన్లను పత్రికలలోనూ ప్రచురించాడు.
  • మే 19 పాగల్ అదిలాబాదీ, తెలంగాణకు చెందిన ఉర్దూ కవి. (మ. 2007).
  • మే 21 భమిడి కమలాదేవి, సంగీత విద్వాంసురాలు.
  • మే 28 సురేఖ, అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు, వ్యంగ్య చిత్రకారుడు.
  • జూన్ 1 మధుకర్ పిచాడ్, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, శాసనసభ సభ్యుడు. (మ. 2024). భారత్
  • జూన్ 5 ఆచార్య ఎస్వీ రామారావు, పి.హెచ్.డి. పరిశోధనా పర్యవేక్షకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇతని పర్యవేక్షణలో 19 పి.హెచ్.డి పరిశోధనలు, 15 ఎం.ఫిల్ పరిశోధనలు జరిగాయి.
  • జూన్ 14 కె.కె.రంగనాథాచార్యులు, సాహితీ చరిత్రకారుడు, కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్‌ (మ. 2021).
  • జూన్ 30 ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు.
  • జూలై 1 డి.కె.ఆదికేశవులు, చిత్తూరు లోక్‌సభ సభ్యులు.
  • జూలై 4 ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (మ.2017).
  • జూలై 13 టి. కల్పనాదేవి, పార్లమెంటు సభ్యురాలు. భారత్
  • జూలై 15 రావెల సాంబశివరావు, నాగార్జున విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ గా పనిచేశారు. కవిరాజు విజయం రూపకం రాశారు.
  • జూలై 17 భారతీరాజా , తమిళ, తెలుగు,చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత.
  • జూలై 20 వ్లాదిమిర్ ఎ ల్యాఖోవ్, రోదసీ యాత్రికుడు (సోయుజ్ 32, టి-9).
  • జూలై 31 అమర్‌సింహ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.2004). భారత్
  • ఆగస్టు 18 జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (మ.2016). భారత్
  • సెప్టెంబరు 24 హేమంత్ దత్తా, అస్సామీ నాటక రచయిత, సినిమా దర్శకుడు గీత రచయిత (మ.2025).
  • సెప్టెంబరు 30 కమలేశ్ శర్మ, భారత దౌత్యవేత్త, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్‌. భారత్

మరణాలు

  • జనవరి 15 న్యాపతి సుబ్బారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, సంస్కరణవాది, సాహిత్యవేత్త, పాత్రికేయుడు (జ.1856). భారత్
  • ఫిబ్రవరి 19 జయంతి రామయ్య పంతులు, ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. (జ.1860).
  • ఫిబ్రవరి 21 ఫ్రెడరిక్ బాంటింగ్, కెనడాకు చెందిన వైద్యుడు, వైద్య శాస్త్రవేత్త, ఇన్సులిన్ సహ ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత.
  • ఆగస్టు 7 రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (జ.1861). భారత్

ఈ సంవత్సరపు ప్రస్థానాలు