ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 1 యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
  • జనవరి 3 ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
  • ఫిబ్రవరి 19 నేపాల్ పోలీసులు ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ఎనిమిది మంది ప్రదర్శకులను చంపారు.
  • మార్చి 11 అమెరికా లోని నాస్‌డాక్ స్టాక్‌ఎక్ఛేంజీలో లిస్టు అయిన తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ అవతరించింది. భారత్
  • మే 20 15 ఏళ్ల బాలుడు, కన్యేర్స్ లోని హెరిటేజ్ హై స్కూల్ లో, తుపాకితో కాల్పులు జరపగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.
  • మే 24 ఉక్రెయిన్ లో, గని లోపల, 'గాస్' వలన జరిగిన పేలుడు లో, 39 మంది గని కార్మికులు మరణించారు.
  • మే 30 హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన ఎన్టీఆర్ మెమోరియల్‌ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
  • జూన్ 12 మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హైదరాబాదులో కన్నుమూశారు.
  • జూలై 15 పవన్ కళ్యాణ్ కిక్ బాక్సర్‌గా నటించిన 'తమ్ముడు' చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది.
  • జూలై 22 మైక్రోసాప్ట్ కంపెనీ ఎమ్.ఎస్.ఎన్. మెసెంజర్ మొదటి వెర్షన్ (మొదటి తరం) ని విడుదల చేసింది.
  • ఆగస్టు 18 టర్కీలో జరిగిన భూకంపంలో (7.4 మేగ్నిట్యూడ్), 17, 000 మందికి పైగా మరణించారు.
  • ఆగస్టు 30 ఐక్యరాజ్య సమితి అజమాయిషీలో ఏర్పాటు చేసిన ఎన్నికలలో తూర్పు తైమూర్ ప్రజలు ఇండోనీషియా నుంచి స్వతంత్రము కోరుతూ ఓటు వేసారు.
  • అక్టోబరు 12 ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరిన రోజుగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
  • డిసెంబరు 2 గ్లెన్‌బ్రూక్ రైలు ప్రమాదం: సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్ దగ్గర రెండు రైళ్లు కొట్టుకొని ఏడుగురు ప్రయాణీకులు మరణించారు.
  • డిసెంబరు 13 ఖాట్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. భారత్
  • డిసెంబరు 24 ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కామ్దహార్‌కు హైజాక్ చేయబడింది.
  • డిసెంబరు 24 కాఠ్మండు నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండియన్‌ ఎయిర్‌లైన్‌ విమానాన్ని టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. భారత్

జననాలు

  • జనవరి 26 మాళవిక శర్మ, తెలుగు, తమిళ చిత్రాల నటి , మోడల్.
  • ఏప్రిల్ 17 వాడుకరి:ARUVA RAMATEJA.
  • నవంబరు 30 శ్రస్తి వర్మ, జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్.
  • డిసెంబరు 6 నేహా శెట్టి మోడల్ , కన్నడ,తెలుగు,చిత్రాల నటి.

మరణాలు

  • ఫిబ్రవరి 2 వేదుల సూర్యనారాయణ శర్మ, ‘శే్లషయమక చక్రవర్తి’ వేంకటాధ్వరి సంస్కృతంలో రాసిన లక్ష్మీసహస్ర మహాకావ్యాన్ని శర్మగారు అతి మనోహరంగా తెలుగులో అనువదించి తన ప్రతిభను చాటుకున్నారు.
  • ఏప్రిల్ 1 మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1930).
  • ఏప్రిల్ 13 షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924).
  • ఏప్రిల్ 13 దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935).
  • ఏప్రిల్ 24 ఎమ్.వి.రాజమ్మ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలసినిమా నటి, నిర్మాత (జ.1923).
  • మే 3 అప్పలాచార్య, సినిమారచయత.
  • మే 16 మారొజు వీరన్న, బహుజన ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (బీడీఎస్ఎఫ్‌) స్థాపకుడు.
  • మే 27 సంపత్ కుమార్, ఆంధ్ర జాలరి, క్లాసికల్, ఫోక్ డాన్సర్. (జ.1927).
  • మే 28 బి.విఠలాచార్య, 'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. (జ.1920).
  • జూన్ 12 జలగం వెంగళరావు, ఆంధ్రప్రదేశ్ 6వ ముఖ్యమంత్రి, నక్సలైట్లను ఉక్కుపాదంతో అణచి వేసిన ముఖ్యమంత్రిగా ఆయన దేశవ్యాప్తంగా పేరొందాడు. (జ.1921).
  • జూన్ 21 చంద్రకళ, తెలుగు సినీ నటి (జ.1951).
  • జూలై 6 ఎం.ఎల్.జయసింహ, హైదరాబాదుకు చెందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు.
  • జూలై 12 రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929). భారత్
  • జూలై 16 ఒకే ఇంజన్ గల విమానాన్ని జాన్ ఎఫ్. కెన్నెడి (జూనియర్) నడుపుతున్నప్పుడు, మార్తాస్ వైన్‌యార్డ్ (మసాచుసెట్స్) దగ్గర అట్లాంటిక్ సముద్రంలో కూలి జాన్ ఎఫ్.కెన్నెడీ (జూనియర్), అతని భార్య కేరొలిన్, అతని సోదరి మరణించారు.
  • ఆగస్టు 25 సూర్యదేవర సంజీవదేవ్, తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత, కవి. (జ.1924).
  • సెప్టెంబరు 4 చదలవాడ ఉమేశ్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ కి చెందిన పోలీస్ ఉన్నతోద్యోగి. (జ.1966).
  • సెప్టెంబరు 17 రాజేశ్వర్ దయాళ్, భారతీయ దౌత్యవేత్త, రచయిత. (జ.1909). భారత్
  • సెప్టెంబరు 20 టి.ఆర్.రాజకుమారి, తమిళ సినిమా నటి. (జ.1922). భారత్
  • సెప్టెంబరు 26 పి. సుదర్శన్ రెడ్డి, నిజాం పాలన వ్యతిరేక ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు.
  • అక్టోబరు 25 సాలూరు రాజేశ్వరరావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు (జ.1922).

సినిమా

  • మార్చి 5 'యమజాతకుడు' చిత్రం విడుదలైంది.
  • జూన్ 18 'స్పీడ్ డాన్సర్' చిత్రం విడుదలైంది.
  • సెప్టెంబరు 2 'అనగనగా ఒక అమ్మాయి' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 19 'ప్రేయసి రావే' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు