ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 10 నానాజాతి సమితిలో భారత్ సభ్యత్వం పొందింది. భారత్
  • ఏప్రిల్ 20 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్‌వెర్ప్ లో ప్రారంభమయ్యాయి.
  • జూలై 23 కీన్యా బ్రిటిష్ సామ్రాజ్యం లో వలసగా మారింది. భారత్
  • ఆగస్టు 16 కోట్ల విజయభాస్కరరెడ్డి కర్నూలు జిల్లా లద్దగిరి గ్రామంలో జన్మించారు.
  • అక్టోబరు 20 సెన్సార్‌ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్‌ జారీ చేసింది.
  • అక్టోబరు 27 భారత పదవ రాష్ట్రపతిగా పనిచేసిన కె.ఆర్.నారాయణన్ కేరళ లోని ఉఝవూరులో జన్మించాడు. భారత్
  • నవంబరు 5 భారతీయ రెడ్‌క్రాస్ ఏర్పడింది. భారత్
  • డిసెంబరు 23 'హైదరాబాదు కంపెనీస్ ఛట్టం ప్రకారం, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా 'ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్) ' అనే పేరుతో ఏర్పడింది. హైదరాబాదు (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ కి చెందిన సమస్త హక్కులను (అప్పులు, ఆస్తులు) మొందింది. కాలక్రమంలో, 1956 కంపెనీస్ చట్టం ప్రకారం, ప్రభుత్వ సంస్థగా అవతరించింది.

జననాలు

  • జనవరి 1 మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997).
  • జనవరి 2 ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత, బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992).
  • జనవరి 20 బి.విఠలాచార్య,'జానపద బ్రహ్మ' అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించారు. (మ.1999).
  • జనవరి 28 బి . విఠలాచార్య , తెలుగు, తమిళ, కన్నడ, నిర్మాత,దర్శకుడు(మ.1999).
  • జనవరి 29 బాలాంత్రపు రజనీకాంతరావు,రచయిత , వాగ్గేయ కారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, ఆకాశవాణి కళాకారుడు.(మ.2018).
  • ఫిబ్రవరి 5 షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (మ.1997).
  • ఫిబ్రవరి 28 ముక్కామల కృష్ణమూర్తి, తెలుగు చలనచిత్ర నటుడు, దర్శకుడు (మ.1987).
  • మార్చి 5 మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, తెలుగు సాహిత్యంలో కవి. (మ. 1992).
  • మార్చి 22 కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007).
  • ఏప్రిల్ 7 రవిశంకర్, భారతీయ సంగీత విద్వాంసుడు. (మ. 2012). భారత్
  • మే 12 వింజమూరి అనసూయ, జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత (మ.2019).
  • మే 17 శాంతకుమారి, సినీ నటి (మ.2006).
  • జూన్ 11 మహేంద్ర, నేపాల్ రాజుగా పనిచేశారు (మ. 1972).
  • జూన్ 28 బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.
  • జూలై 5 సచిన్ నాగ్, 1951 ఆసియా క్రీడలలో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం తెచ్చిపెట్టిన ఈతగాడు. (మ.1987). భారత్
  • జూలై 7 మద్దిపట్ల సూరి, రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త. (మ.1995).
  • జూలై 9 తమ్మారెడ్డి సత్యనారాయణ, భారత కమ్యూనిష్ఠు పార్టీ నేత. (మ.). భారత్
  • జూలై 10 పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (మ.2007).
  • జూలై 11 యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10).
  • జూలై 14 శంకర్‌రావు చవాన్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి (మ.2004). భారత్
  • జూలై 15 డి.వి.నరసరాజు, రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (మ.2006).
  • జూలై 15 కందాళ సుబ్రహ్మణ్య తిలక్‌, స్వాతంత్ర్యసమరయోధుడు, మొదటి లోక్‌సభ సభ్యుడు (మ.2018). భారత్
  • జూలై 18 నిర్మలమ్మ, తెలుగు సినిమా నటి. (మ. 2009).
  • జూలై 18 ఆవుల జయప్రదాదేవి, మహిళా ప్రగతికి విశేషంగా కృషిచేసిన వ్యక్తి. (మ.2004).
  • జూలై 20 లెవ్ అరోనిన్, యు.ఎస్.ఎస్.ఆర్. ప్రపంచ చదరంగపు ఆటగాడు (1950).
  • ఆగస్టు 16 కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్కు రెండుసార్లు ముఖ్యమంత్రి (మ.2001).
  • ఆగస్టు 18 హర్భజన్ సింగ్ పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. (మ.2002). భారత్
  • ఆగస్టు 20 రేమెళ్ళ సూర్యప్రకాశశాస్త్రి, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక గ్రంథ రచయిత.
  • ఆగస్టు 26 ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కవి, రచయిత, పాత్రికేయుడు. (మ.1955).
  • సెప్టెంబరు 10 కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు. భారత్
  • సెప్టెంబరు 12 పెరుగు శివారెడ్డి, ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు. (మ.2005).
  • సెప్టెంబరు 25 సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (మ.2002). భారత్
  • అక్టోబరు 11 మావేలికార కృష్ణన్ కుట్టి నాయర్, మృదంగ విద్వాంసుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.1988).
  • అక్టోబరు 15 మారియో పుజో, గాడ్‌ఫాదర్‌ నవలతో ప్రపంచానికి మాఫియా గురించి తెలియజెప్పిన అద్భుత నవలా రచయిత. (మ. 1999).
  • అక్టోబరు 15 భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (మ.2002).
  • అక్టోబరు 17 షోయబ్ ఉల్లాఖాన్, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు, బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి. (మ.1948).
  • అక్టోబరు 21 తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు. భారత్
  • అక్టోబరు 27 కె.ఆర్. నారాయణన్, భారత రాష్ట్రపతి. (మ.2005). భారత్
  • నవంబరు 2 పట్రాయని సంగీతరావు, ఆంధ్ర దేశానికి చెందిన సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు.
  • నవంబరు 7 బొల్లిముంత శివరామకృష్ణ, అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. (మ.2005).
  • నవంబరు 10 దత్తోపంత్ ఠెన్గడీ, హిందూత్వవాది, భారతీయ కార్మిక సంఘ నాయకుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు. (మ.2004). భారత్
  • నవంబరు 12 పెరుగు శివారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని నేత్రవైద్య నిపుణుడు., ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సలహాదారుగా, దేశ ప్రథమ పౌరుడి (రాష్ట్రపతి) కి గౌరవ నేత్ర చికిత్సకులుగా నియమితులయ్యారు.
  • నవంబరు 13 కె.జి.రామనాథన్, భారతీయ గణిత శాస్త్రవేత్త. (మ.1992). భారత్
  • నవంబరు 17 జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005). భారత్
  • నవంబరు 27 బొల్లిముంత శివరామకృష్ణ ,తెలుగు అభ్యుదయ రచయిత, సినీమాటల, పాటల రచయిత(మ.2005).
  • డిసెంబరు 10 గంటి కృష్ణవేణమ్మ, తెలుగు కవయిత్రి.
  • డిసెంబరు 22 తాతినేని చలపతిరావు ,సంగీత దర్శకుడు(మ.1994).

మరణాలు

  • జనవరి 24 అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.
  • ఏప్రిల్ 26 శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త. (జ.1887). భారత్
  • మే 7 హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860).
  • ఆగస్టు 1 బాలగంగాధర తిలక్, భారత జాతీయోద్యమ నాయకుడు. (జ.1856). భారత్
  • సెప్టెంబరు 29 దీవి గోపాలాచార్యులు, వైద్య శాస్త్రవేత్త, హిందూ సంప్రదాయ వైద్య పరిశోధకుడు (జ.1872).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు