ఫిబ్రవరి 16 ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు.
మార్చి 9 బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్శించారు.
మార్చి 31 14 వ దలైలామా, టెన్జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు.
భారత్
మే 14 తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు మద్రాసు వాణీ మహల్లో హాస్యనటుడు రేలంగిని గజారోహణం చేయించి ఘనంగా సన్మానించారు.
మే 24 ఇంగ్లాండ్లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు. 1902లో 'ఎంపైర్ డే' ని మొదటిసారిగా జరుపుకున్నారు.
జూలై 21 ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక 'సవన్నా' జల ప్రవేశం చేసింది.
ఆగస్టు 18 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన భూకంపం వలన క్వేక్ లేక్ ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు.
ఆగస్టు 29 నటుడు అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు మద్రాసులో జన్మించారు.
సెప్టెంబరు 17 శోభన్ బాబు నటించిన తొలి విడుదల చిత్రం దైవబలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సెప్టెంబరు 29 ఇంగ్లీషు ఛానెల్ ను 16 గంటల 20 నిమిషాలలో ఈదిన తొలి భారతీయ మహిళగా ఆరతి సాహా అయ్యారు.
భారత్
అక్టోబరు 1 గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు.
భారత్
అక్టోబరు 10 భారత ప్రధాననమంత్రి జవహర్లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి వరంగల్లో శంకుస్థాపన చేశారు.
డిసెంబరు 17 స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య తుదిశ్వాస విడిచారు.
జననాలు
జనవరి 1 శుభా ముద్గల్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో భారతీయ గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
భారత్
జనవరి 2 కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
భారత్
జనవరి 6 కపిల్ దేవ్, క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్రౌండర్.
భారత్
జూన్ 9 జి.వి.హర్షకుమార్, భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.