ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 16 ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి ప్రీమియర్ అయ్యాడు.
  • మార్చి 9 బార్బీ డాల్ ను అమెరికన్ ఇంటర్నేషనల్ టాయ్ ఫెయిర్లో తొలిసారి ప్రదర్శించారు.
  • మార్చి 31 14 వ దలైలామా, టెన్‌జిన్ జియాట్సో భారత సరిహద్దును దాటి భారత్ వచ్చాడు. భారత్
  • మే 14 తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులు మద్రాసు వాణీ మహల్‌లో హాస్యనటుడు రేలంగిని గజారోహణం చేయించి ఘనంగా సన్మానించారు.
  • మే 24 ఇంగ్లాండ్లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు. 1902లో 'ఎంపైర్ డే' ని మొదటిసారిగా జరుపుకున్నారు.
  • జూలై 21 ప్రపంచంలో మొట్టమొదటిగా అణుశక్తితో నడిచే వాణిజ్య నౌక 'సవన్నా' జల ప్రవేశం చేసింది.
  • ఆగస్టు 18 7.5 మేగ్నిట్యూడ్ మీద జరిగిన భూకంపం వలన క్వేక్ లేక్ ఏర్పడింది. భూకంపం వలన ఏర్పడిన సరస్సు కాబట్టి, "భూకంప సరస్సు" (క్వేక్ లేక్) అని పేరు పెట్టారు.
  • ఆగస్టు 29 నటుడు అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ దంపతులకు మద్రాసులో జన్మించారు.
  • సెప్టెంబరు 17 శోభన్ బాబు నటించిన తొలి విడుదల చిత్రం దైవబలం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
  • సెప్టెంబరు 29 ఇంగ్లీషు ఛానెల్ ను 16 గంటల 20 నిమిషాలలో ఈదిన తొలి భారతీయ మహిళగా ఆరతి సాహా అయ్యారు. భారత్
  • అక్టోబరు 1 గౌరవనీయ న్యాయమూర్తి భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. భారత్
  • అక్టోబరు 10 భారత ప్రధాననమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ దేశములోని మొట్టమొదటి రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ (ఇప్పుడు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)కి వరంగల్‌లో శంకుస్థాపన చేశారు.
  • డిసెంబరు 17 స్వాతంత్ర్య సమరయోధుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య తుదిశ్వాస విడిచారు.

జననాలు

  • జనవరి 1 శుభా ముద్గల్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతంలో భారతీయ గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్
  • జనవరి 2 కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
  • జనవరి 6 కపిల్ దేవ్, క్రికెట్ ఆటలో భారతదేశపు అత్యంత గొప్ప ఆల్‌రౌండర్. భారత్
  • జనవరి 13 సాయాజీ షిండే , భారతీయ సినీ నటుడు. భారత్
  • జనవరి 21 ఎండ్లూరి సుధాకర్, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠం, నన్నయ్య ప్రాంగణం రాజమండ్రిలో ఆచార్యుడు, పీఠాధిపతి.
  • ఫిబ్రవరి 28 జయమాల , కన్నడ సినీనటి, తెలుగు,తమిళ చిత్రాల్లో నటించారు.
  • మార్చి 9 జాకీర్ హుస్సేన్, ప్రఖ్యాత తబలా విద్వాంసుడు.
  • ఏప్రిల్ 20 కొప్పుల ఈశ్వర్, తెలంగాణ శాసనసభ సభ్యుడు.
  • ఏప్రిల్ 22 దగ్గుబాటి పురంధేశ్వరి, భారత పార్లమెంటు సభ్యురాలు, వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు. భారత్
  • మే 3 ఉమా భారతి, కాషాయధారిణి, భారతదేశపు రాజకీయవేత్త. భారత్
  • మే 18 బేతా సుధాకర్ , చలన చిత్ర నటుడు, నిర్మాత.
  • మే 25 కేతిరెడ్డి సురేష్‌రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
  • జూన్ 1 కొల్లా అశోక్ కుమార్ , తెలుగు చలన చిత్ర ప్రతి నాయకుడు, నిర్మాత.
  • జూన్ 8 మాడుగుల నాగఫణి శర్మ, అవధాని.
  • జూన్ 9 జి.వి.హర్షకుమార్, భారత పార్లమెంటు సభ్యుడు, ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
  • జూన్ 16 వారియర్, అమెరికా ప్రొఫెషనల్ మల్లయోధుడు.
  • జూన్ 17 వక్కలంక పద్మ , తెలుగు సినీ నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్.
  • జూలై 7 జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , తెలుగు కవి, సినీ గీత రచయిత.
  • జూలై 14 చాగంటి కోటేశ్వరరావు, అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి.
  • జూలై 22 బోయినపల్లి వినోద్‌కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యుడు, న్యాయవాది.
  • ఆగస్టు 18 నిర్మలా సీతారామన్, భారతీయ రాజకీయ నాయకురాలు, మోడీ మంత్రివర్గంలో సహాయఆర్ధికమంత్రి. భారత్
  • ఆగస్టు 28 సుమన్, తెలుగు సినిమా నటుడు.
  • ఆగస్టు 29 అక్కినేని నాగార్జున, తెలుగు చలనచిత్ర నటుడు, అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.
  • ఆగస్టు 30 నాగబాల సురేష్ కుమార్, రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత.
  • సెప్టెంబరు 16 రోజా రమణి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీనటి.
  • సెప్టెంబరు 23 లీనా రాన్, రాజకీయ నాయకురాలు.
  • సెప్టెంబరు 25 వల్లభనేని జనార్దన్, తెలుగు సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు.(మ.2022).
  • డిసెంబరు 17 జయసుధ, సహజ నటిగా పేరుపొందిన జయసుధ తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు సుజాత.
  • డిసెంబరు 21 కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్

మరణాలు

  • జనవరి 18 మీరా బెహన్ (మెడలీన్ స్లేడ్).
  • మార్చి 28 కళా వెంకటరావు, స్వాంతంత్ర్య యోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి. (జ.1900).
  • ఏప్రిల్ 5 అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, తెలుగు కవి, పండితుడు. (జ. 1888).
  • అక్టోబరు 28 గోవిందరాజులు సుబ్బారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1895).
  • డిసెంబరు 17 భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (జ.1880).

సినిమా

  • జనవరి 14 'అప్పుచేసి పప్పుకూడు' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు