జనవరి 5 FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.
జనవరి 20 రెబల్ స్టార్గా పేరొందిన నటుడు కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు.
జనవరి 22 తెలుగు వాడుక భాషోద్యమ మూలపురుషుడు గిడుగు వెంకట రామమూర్తి కన్నుమూశారు.
మార్చి 13 భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు.
భారత్
మార్చి 13 జలియన్ వాలాబాగ్ దురంతానికి బాధ్యుడిగా భావించిన మైకేల్ ఓ'డయర్ను ఉధమ్ సింగ్ లండన్లో కాల్చి చంపాడు.
భారత్
మే 10 చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు.
భారత్
మే 14 నెదర్లాండ్స్ లోని రోటర్డాం నగరం మీద నాజీలు బాంబులు వేయగా 600 నుంచి 900 మంది ప్రజలు మరణించారు. నెదర్లాండ్స్ జర్మనీకి లొంగి పోయింది.
జూన్ 17 సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
జూన్ 18 రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.
జూన్ 22 సుభాష్ చంద్రబోస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
జూన్ 30 డాల్ మెస్సిక్ తయారు చేసిన బ్రెండా స్టార్ అనే కార్టూన్ స్ట్రిప్ మొదటిసారిగా కనిపించింది.
జూలై 2 స్వాతంత్ర్య యోధుడు సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు.
భారత్
జూలై 21 ఎస్తోనియా, లాత్వియా, లిథూనియా దేశాలను, సోవియట్ యూనియన్, తనలో కలిపి వేసుకుంది.
అక్టోబరు 27 నిజాం సైన్యం జోడేఘాట్ అడవుల్లోని స్థావరాన్ని ముట్టడించగా గిరిజనోద్యమ నేత కొమరం భీమ్ వీరమరణం పొందారు.
జననాలు
జనవరి 3 కట్టా సుబ్బారావు , తెలుగు సినీ దర్శకుడు.(మ.1988).
జనవరి 10 యేసుదాస్, భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు.
భారత్
జనవరి 12 ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి.
భారత్
సెప్టెంబరు 18 తాడిమెటి చక్రపాణి రావు (18 సెప్టెంబర్ 1940 - 5 సెప్టెంబర్ 2023), టి. సి. రావు గా సుపరిచితుడు. అతను భారతీయ ఖనిజ ప్రాసెసింగ్ శాస్త్రవేత్త, పరిశోధకుడు.
భారత్
సెప్టెంబరు 24 ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994).
భారత్
డిసెంబరు 5 గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు.
డిసెంబరు 20 యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి.
డిసెంబరు 23 ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత.
డిసెంబరు 28 వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు.
మరణాలు
జనవరి 1 పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865).