ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 5 FM రేడియో గూర్చి మొదటిసారి "ఫెడెరల్ కమ్యూనికేషన్ కమీషన్" వద్ద ప్రదర్శితమైనది.
  • జనవరి 20 రెబల్ స్టార్‌గా పేరొందిన నటుడు కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు.
  • జనవరి 22 తెలుగు వాడుక భాషోద్యమ మూలపురుషుడు గిడుగు వెంకట రామమూర్తి కన్నుమూశారు.
  • మార్చి 13 భారత స్వాతంత్ర్యోద్యమము: 1940 మార్చి 13 తారీకున, ఉధమ్ సింగ్, అమృతసర్ మారణ కాండకు (జలియన్‌వాలా బాగ్) బాధ్యుడిగా పరిగణింపబడిన మైకేల్ ఓ డైయర్ ని, లండన్ లో, కాల్చి చంపాడు. భారత్
  • మార్చి 13 జలియన్ వాలాబాగ్ దురంతానికి బాధ్యుడిగా భావించిన మైకేల్ ఓ'డయర్‌ను ఉధమ్ సింగ్ లండన్‌లో కాల్చి చంపాడు. భారత్
  • మే 10 చర్చిల్ ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. భారత్
  • మే 14 నెదర్లాండ్స్ లోని రోటర్‌డాం నగరం మీద నాజీలు బాంబులు వేయగా 600 నుంచి 900 మంది ప్రజలు మరణించారు. నెదర్లాండ్స్ జర్మనీకి లొంగి పోయింది.
  • జూన్ 17 సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
  • జూన్ 18 రెండవ ప్రపంచ యుద్దం: నాజీ జర్మనీకి లొంగిపోయిన ఫ్రాన్స్ దేశాన్ని విడిపించాలని, నాజీ జర్మనీ ని, ఆపటానికి, ప్రెంచి ప్రజలు తనకు మద్దత్తు ఇవ్వాలని, ఫ్రెంచి సైన్యానికి నాయకుడైన జనరల్ ఛార్లెస్ డి గాల్, విజ్ఞప్తి చేసాడు.
  • జూన్ 22 సుభాష్ చంద్రబోస్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
  • జూన్ 30 డాల్ మెస్సిక్ తయారు చేసిన బ్రెండా స్టార్ అనే కార్టూన్ స్ట్రిప్ మొదటిసారిగా కనిపించింది.
  • జూలై 2 స్వాతంత్ర్య యోధుడు సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు. భారత్
  • జూలై 21 ఎస్తోనియా, లాత్వియా, లిథూనియా దేశాలను, సోవియట్ యూనియన్, తనలో కలిపి వేసుకుంది.
  • అక్టోబరు 27 నిజాం సైన్యం జోడేఘాట్ అడవుల్లోని స్థావరాన్ని ముట్టడించగా గిరిజనోద్యమ నేత కొమరం భీమ్ వీరమరణం పొందారు.

జననాలు

  • జనవరి 3 కట్టా సుబ్బారావు , తెలుగు సినీ దర్శకుడు.(మ.1988).
  • జనవరి 10 యేసుదాస్, భారత దేశ సినీ నేపథ్య గాయకుడు, సంగీత విద్వాంసుడు. భారత్
  • జనవరి 12 ఎం.వీరప్ప మొయిలీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. భారత్
  • జనవరి 13 అంబటి బ్రాహ్మణయ్య, రాజకీయ వేత్త.
  • జనవరి 20 కృష్ణంరాజు, తెలుగు నటుడు, రాజకీయవేత్త.
  • జనవరి 30 మోహన్ మహర్షి, నాటక దర్శకుడు, నటుడు, నాటక రచయిత (మ. 2023).
  • ఫిబ్రవరి 1 నరేంద్ర కుమార్, భారతీయ భౌతిక శాస్త్రవేత్త, శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారం, పద్మశ్రీ పురస్కారాల గ్రహీత. (మ.2017). భారత్
  • ఫిబ్రవరి 2 ఎస్. వి. రామారావు, తెలుగు సినీ రచయిత.
  • ఫిబ్రవరి 2 జె.భాగ్యలక్ష్మి, ఇంగ్లీషు, తెలుగు భాషలలో గుర్తింపు పొందిన రచయిత్రి.
  • మే 11 భాస్కర్ శివాల్కర్ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. (మ.2023).
  • మే 25 ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (మ.2020).
  • జూన్ 1 ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు.
  • జూన్ 16 ఇచ్ఛాపురపు రామచంద్రం, కథారచయిత. బాలసాహిత్యరచయిత. (మ.2016).
  • జూన్ 23 విల్మా రుడాల్ఫ్, ఒకే ఒలింపిక్ క్రీడల్లో మూడు బంగారు పతకాలు సాధించిన మొదటి అమెరికన్ మహిళ. (మ.1994).
  • జూన్ 24 మాగంటి మురళీమోహన్, తెలుగు సినిమా కథానాయకుడు, నిర్మాత.
  • జూలై 1 రెడ్డి రాఘవయ్య, బాల సాహిత్యవేత్త (మ. 2022).
  • జూలై 16 పిరాట్ల వెంకటేశ్వర్లు పత్రికా సంపాధకుడు, రచయిత. (మ.2014).
  • జూలై 21 శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి. భారత్
  • జూలై 22 యూరి పి అర్త్యుఖిన్, రోదసీయాత్రికుడు (సోయుజ్ 14).
  • ఆగస్టు 21 లక్ష్మా గౌడ్, చిత్రకారుడు.
  • సెప్టెంబరు 3 ప్యారెలాల్ ,(సంగీత దర్శకుల ద్యయంలోఒకరు) సంగీత దర్శకుడు.
  • సెప్టెంబరు 9 రాపాక ఏకాంబరాచార్యులు, తెలుగు రచయిత, అవధాన విద్యాసర్వస్వము గ్రంథకర్త (మ.2020).
  • సెప్టెంబరు 13 సజ్జా జయదేవ్ బాబు, కార్టూనిస్టు.
  • సెప్టెంబరు 18 తాడిమెటి చక్రపాణి రావు (18 సెప్టెంబర్ 1940 - 5 సెప్టెంబర్ 2023), టి. సి. రావు గా సుపరిచితుడు. అతను భారతీయ ఖనిజ ప్రాసెసింగ్ శాస్త్రవేత్త, పరిశోధకుడు. భారత్
  • సెప్టెంబరు 24 ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (మ.1994). భారత్
  • అక్టోబరు 23 పీలే, బ్రెజిల్‌ ఫుట్‌బాల్ ఆటగాడు.
  • నవంబరు 3 పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత.
  • నవంబరు 12 అంజాద్ ఖాన్, భారతీయ నటుడు, దర్శకుడు, (మ1992). భారత్
  • నవంబరు 27 బ్రూస్ లీ, యుద్ధ వీరుడు. (మ.1973).
  • డిసెంబరు 5 గులాం అలి, పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు.
  • డిసెంబరు 20 యామినీ కృష్ణమూర్తి, శాస్త్రీయ నృత్య కళాకారిణి.
  • డిసెంబరు 23 ముదిగొండ శివప్రసాద్, చారిత్రక నవలా రచయిత.
  • డిసెంబరు 28 వంకాయల సత్యనారాయణ, సహాయ నటుడుగా దాదాపు 180 తెలుగు సినిమాలలో నటించారు.

మరణాలు

  • జనవరి 1 పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865).
  • జనవరి 15 వాడుక భాష ఉద్యమ పిత, గిడుగు రామమూర్తి.
  • జనవరి 22 గిడుగు రామమూర్తి, తెలుగు భాషావేత్త. (జ.1863).
  • ఏప్రిల్ 12 భోగరాజు నారాయణమూర్తి, నవలా రచయిత, నాటక కర్త. (జ.1891).
  • మే 21 కౌతా ఆనందమోహనశాస్త్రి, వీరు వివిధ శైలీభేదాలను అనుసరించి నూటికి పైగా చిత్రాలను చిత్రించారు. (జ.1908).
  • జూన్ 21 డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపకుడు. (జ.1889).
  • సెప్టెంబరు 28 పండిత్ సుందర్ లాల్ శర్మ, "ఛత్తీస్‌గఢ్ గాంధీ", స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త (జ.1881). భారత్
  • అక్టోబరు 7 కూచి నరసింహం, సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866).
  • అక్టోబరు 27 కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901).
  • అక్టోబరు 29 కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, తెలుగు రచయిత. (జ.1863).

సినిమా

  • ఏప్రిల్ 12 'చండిక' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 7 'బారిష్టర్ పార్వతీశం' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు