మే 14 అమెరికా అణుబాంబును పసిఫిక్ మహా సముద్రంలో పేల్చి పరీక్షించింది.
మే 14 కమ్యూనిష్టు దేశాల మధ్య వార్సా ఒప్పందం కుదిరింది. (కమ్యూనిష్టు దేశాలంటే - సోవియాట్ యూనియన్, అల్బేనియా, బల్గేరియా, చెకొస్లొవాకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలాండ్, రుమేనియాలు).
జూన్ 1 అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
జూలై 1 భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది.
భారత్
జూలై 23 భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.
భారత్
ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు.
ఆగస్టు 27 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
సెప్టెంబరు 30 రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది.
సెప్టెంబరు 30 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఫజల్ అలీ కమిషన్) నివేదిక వెలువడింది; తెలంగాణ-ఆంధ్ర విలీనం తెలంగాణ ప్రజల ఇష్టానుసారం జరగాలని సూచించింది.
భారత్
అక్టోబరు 2 చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది.
భారత్
అక్టోబరు 2 అన్నపూర్ణ పిక్చర్స్ తొలి చిత్రంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో దొంగరాముడు విడుదలై ఘనవిజయం సాధించింది.
అక్టోబరు 3 మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది.
భారత్
నవంబరు 18 సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు.
భారత్
డిసెంబరు 3 విశాలాంధ్ర విలీనంపై హైదరాబాదు శాసనసభలో చర్చ జరిగింది; 147 మంది సభ్యుల్లో 103 మంది విలీనానికి మద్దతు తెలిపారు.
డిసెంబరు 10 నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
జననాలు
జనవరి 5 మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి.
భారత్
జనవరి 28 వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.
ఫిబ్రవరి 24 స్టీవ్ జాబ్స్, అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, యాపిల్ ఇన్కార్పొరేషన్కు సహ-వ్యవస్థాపకుడు.
మార్చి 1 వెలమల సిమ్మన్న, బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, భాషా శాస్త్రవేత్త, విమర్శకులు.
మార్చి 3 జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012).
జూన్ 18 శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు)). 53వ ఏట మరణించింది. (మ.2008).
జూలై 1 పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనెలను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.
జూలై 12 నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
జూలై 19 రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
భారత్
జూలై 25 చెల్లమెల్ల సుగుణ కుమారి, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి 12వ లోక్సభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది.
జూలై 27 అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్.
ఆగస్టు 1 అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.
భారత్
ఆగస్టు 4 ఛార్లెస్ డి "సామ్" గెమర్ యాంక్టన్ ఎస్.డి, రోదసీ యాత్రికుడు ( రోదసీ నౌకలు ఎస్.టి.ఎస్. 38, 48).
ఆగస్టు 18 పి.ఎన్ రామచంద్ర రావు . చలనచిత్ర దర్శకుడు.