ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 13 నేపాల్ రాజుగా మహేంద్ర అధికారం స్వీకరించాడు.
  • మార్చి 13 గురజాడ కన్యాశుల్కం రచనపై జయంతి కుమారస్వామి ఆంధ్రపత్రికలో రాసిన వ్యాసంతో పెద్ద వివాదం చెలరేగింది.
  • మార్చి 28 ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు స్వీకరించాడు.
  • మార్చి 28 బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో దామోదరం సంజీవయ్య రవాణా, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా నియమితులయ్యారు.
  • మే 11 ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసింది.
  • మే 14 అమెరికా అణుబాంబును పసిఫిక్ మహా సముద్రంలో పేల్చి పరీక్షించింది.
  • మే 14 కమ్యూనిష్టు దేశాల మధ్య వార్సా ఒప్పందం కుదిరింది. (కమ్యూనిష్టు దేశాలంటే - సోవియాట్ యూనియన్, అల్బేనియా, బల్గేరియా, చెకొస్లొవాకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలాండ్, రుమేనియాలు).
  • జూన్ 1 అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
  • జూలై 1 భారతీయ స్టేట్ బ్యాంకు స్థాపించబడింది. భారత్
  • జూలై 23 భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు. భారత్
  • ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు జన్మించారు.
  • ఆగస్టు 27 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
  • సెప్టెంబరు 30 రాష్ట్రాల పునర్విభజన సంఘం నివేదికను ఫజలాలీ కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చింది.
  • సెప్టెంబరు 30 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఫజల్ అలీ కమిషన్) నివేదిక వెలువడింది; తెలంగాణ-ఆంధ్ర విలీనం తెలంగాణ ప్రజల ఇష్టానుసారం జరగాలని సూచించింది. భారత్
  • అక్టోబరు 2 చెన్నై లోని పెరంబూరులో ఉన్న సమగ్ర రైలు పెట్టెల కర్మాగారము (ICF) తన పనులు మొదలుపెట్టింది. భారత్
  • అక్టోబరు 2 అన్నపూర్ణ పిక్చర్స్ తొలి చిత్రంగా కె.వి.రెడ్డి దర్శకత్వంలో దొంగరాముడు విడుదలై ఘనవిజయం సాధించింది.
  • అక్టోబరు 3 మద్రాసు వద్ద గల పెరంబూరు లోని ఇంటెగ్రల్ కోచ్ ఫాక్టరీ నుండి, మొట్ట మొదటి రైలు పెట్టె ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చేతుల మీదుగా విడుదలైంది. భారత్
  • నవంబరు 18 సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు. భారత్
  • డిసెంబరు 3 విశాలాంధ్ర విలీనంపై హైదరాబాదు శాసనసభలో చర్చ జరిగింది; 147 మంది సభ్యుల్లో 103 మంది విలీనానికి మద్దతు తెలిపారు.
  • డిసెంబరు 10 నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

జననాలు

  • జనవరి 5 మమతా బెనర్జీ, మొదటి పశ్చిమ బెంగాల్ మహిళా ముఖ్యమంత్రిణి. భారత్
  • జనవరి 28 వినోద్ ఖోస్లా, ఇండియన్-అమెరికన్ వెంచర్ క్యాపిటలిస్ట్.
  • ఫిబ్రవరి 24 స్టీవ్ జాబ్స్, అమెరికన్ ఐటీ వ్యాపారవేత్త, యాపిల్ ఇన్‌కార్పొరేషన్‌కు సహ-వ్యవస్థాపకుడు.
  • మార్చి 1 వెలమల సిమ్మన్న, బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, భాషా శాస్త్రవేత్త, విమర్శకులు.
  • మార్చి 3 జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (మ.2012).
  • మార్చి 7 అనుపమ్ ఖేర్, సినీ నటుడు జననం.
  • ఏప్రిల్ 3 హరిహరన్, భారతదేశ గాయకుడు. భారత్
  • ఏప్రిల్ 26 కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.
  • మే 1 రాధేయ, తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత.
  • మే 4 అంజు చధా, భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. భారత్
  • మే 9 టీ.రాజేందర్ , తమిళ నటుడు,దర్శకుడు. భారత్
  • మే 20 సిరివెన్నెల సీతారామశాస్త్రి, తెలుగు సినీ గీతరచయిత.
  • మే 22 పి. చంద్రశేఖర అజాద్, కథా రచయిత, నవలారచయిత.
  • మే 26 పేరి శ్రీరామమూర్తి, వాయులీన విద్వాంసులు.
  • జూన్ 18 శాండీ అల్లెన్, ప్రపంచంలో ఎత్తైన మహిళ (7'7 1/4" (232 సెంటిమీటర్లు)). 53వ ఏట మరణించింది. (మ.2008).
  • జూలై 1 పాలగిరి రామక్రిష్ణా రెడ్డి, నూనె టెక్నాలజీస్టు. ఈయన గత 35 సంవత్సరాలు నూనె గింజల నుండి వివిధ రకాల నూనెలను వేరుచేయడంలో తన అమూల్యమైన అనుభవాన్ని పంచాడు.
  • జూలై 12 నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
  • జూలై 19 రోజర్ బిన్నీ, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
  • జూలై 25 చెల్లమెల్ల సుగుణ కుమారి, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభ తెలుగుదేశం పార్టీ సభ్యురాలిగా పోటీచేసి, గెలిచి భారత పార్లమెంటులో ప్రవేశించింది.
  • జూలై 27 అలాన్ బోర్డర్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్టెన్.
  • ఆగస్టు 1 అరుణ్ లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
  • ఆగస్టు 4 ఛార్లెస్ డి "సామ్" గెమర్ యాంక్టన్ ఎస్.డి, రోదసీ యాత్రికుడు ( రోదసీ నౌకలు ఎస్.టి.ఎస్. 38, 48).
  • ఆగస్టు 18 పి.ఎన్ రామచంద్ర రావు . చలనచిత్ర దర్శకుడు.
  • ఆగస్టు 22 చిరంజీవి, తెలుగు చలనచిత్ర నటుడు.
  • ఆగస్టు 25 సోమరాజు సదారాం, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్.
  • ఆగస్టు 27 వల్లూరు శివప్రసాద్, నాటకకర్త.
  • సెప్టెంబరు 5 ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు.
  • సెప్టెంబరు 11 బయ్యారపు ప్రసాదరావు, కాంతి తరంగ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డి.జి.పిగా బాధ్యతలు స్వీకరించారు.
  • సెప్టెంబరు 21 గుల్షన్ గ్రోవర్, బాలీవుడ్, హాలీవుడ్ నటుడు,నిర్మాత.
  • సెప్టెంబరు 27 మహేష్ మహదేవన్, సంగీత దర్శకుడు (మ.2002).
  • అక్టోబరు 12 హేమా చౌదరి, దక్షిణ భారత సినిమా నటి. భారత్
  • అక్టోబరు 12 బియ్యాల జనార్ధన్‌రావు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్. (మ. 2002).
  • అక్టోబరు 17 స్మితా పాటిల్, హిందీ సినీనటి. (మ.1986). భారత్
  • అక్టోబరు 19 గుణ్ణం గంగరాజు, సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో ఈయన మంచి పనితనానికి ప్రసిద్ధుడు.
  • నవంబరు 3 కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి.
  • నవంబరు 24 ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
  • డిసెంబరు 1 ఉదిత్ నారాయణ్ , నేపథ్య గాయకుడు.
  • డిసెంబరు 2 ఉన్ని మీనన్, మలయాళ, తమిళ, నేపథ్య గాయకుడు. భారత్
  • డిసెంబరు 22 సయ్యద్ నసీర్ అహ్మద్, హేతువాది, పాత్రికేయుడు, లాయర్,. 'సారేజహాఁ సే అచ్ఛా ఇండియా' తెలుగు మాస పత్రిక సంపాదకుడు.
  • డిసెంబరు 28 చైనా - లియూ క్సియాబొ, నొబుల్ శాంతి బహుమతి గ్రహీత.

మరణాలు

  • జనవరి 1 శాంతిస్వరూప్‌ భట్నాగర్‌, రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్‌ అవార్డును ఏర్పాటు చేసారు.
  • మార్చి 11 అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ ‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త. (జ.1881).
  • మార్చి 13 నేపాల్ రాజుగా పనిచేసిన త్రిభువన్.
  • ఏప్రిల్ 18 ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, శాస్త్రవేత్త. (జ. 1879).
  • జూన్ 6 తోలేటి వెంకటరెడ్డి, సినిమా రచయిత.
  • ఆగస్టు 17 సాహీతీ వి'శారద', ఆయన 'ప్రజావాణి' అనే వ్రాత పత్రికను ప్రారంభించారు (జ.1924).
  • సెప్టెంబరు 25 రుక్మాబాయి రావత్, బ్రిటిష్ ఇండియాలో వైద్యవృత్తిని చేపట్టిన తొలి మహిళావైద్యులలో ఒకరు. (జ.1864). భారత్
  • సెప్టెంబరు 30 జేమ్స్ డీన్, అమెరికాకు చెందిన నటుడు (జ.1931).
  • అక్టోబరు 26 హిందుస్తానీ సంగీత విద్వాంసుడు డి.వి. పలుస్కర్ మరణం. (జ.1921). భారత్
  • అక్టోబరు 27 బి వి.రామానందo, తెలుగు సినిమా దర్శకుడు(జ.1902).
  • డిసెంబరు 30 వేమూరి గగ్గయ్య, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (జ.1895).

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు