మే 4 ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.
మే 4 మైదానం వంటి సంచలన రచనలు చేసిన గుడిపాటి వెంకట చలం అరుణాచలంలో కన్నుమూశారు.
మే 5 రోదసీ నౌక వాయేజర్ 1, జూపిటర్ గ్రహాన్ని దాటి తన ప్రయాణాన్ని విశ్వాంతరాళంలోకి కొనసాగిస్తున్నది.
జూన్ 1 విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979, జూన్ 1న విజయనగరం జిల్లా అవతరించింది.
జూన్ 7 భాస్కర-1 అనే భారతీయ ఉపగ్రహం ప్రయోగించబడింది.
భారత్
జూలై 12 కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
భారత్
జూలై 16 సద్దాం హుస్సేన్, ఇరాక్ అధ్యక్షుడు అయ్యాడు.
జూలై 23 '#2736 ఆప్స్' అనే గ్రహశకలాన్ని 'ఇ. బొవెల్' కనుగొన్నాడు.
జూలై 28 భారతదేశ 6వ ప్రధానమంత్రిగా చరణ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.
భారత్
అక్టోబరు 17 మదర్ థెరీసాకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.
అక్టోబరు 23 తెలుగు సినీ కథానాయకుడు 'రెబల్ స్టార్' ప్రభాస్ సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు.
నవంబరు 4 ఇరాన్ బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్లోని అతివాదులు అమెరికా రాయబార కార్యాలయం మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు.
జననాలు
జనవరి 1 డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.
భారత్
జనవరి 7 బిపాషా బసు, భారతీయ చలనచిత్ర నటి , మోడల్.
భారత్
జనవరి 27 డానియెల్ వెట్టోరీ, క్రికెట్ క్రీడాకారుడు.
ఫిబ్రవరి 28 అలీ లార్టర్, అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్.