ఈ రోజు విశేషం
1958 నటుడు శోభన్ బాబు వివాహం శాంతకుమారితో జరిగింది.
తెలుగు నాట ఈ రోజు
- 1958 నటుడు శోభన్ బాబు వివాహం శాంతకుమారితో జరిగింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1952 భారత లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు. భారత్
- 1989 గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
- 2012 టెలికాం మంత్రి ఎ. రాజాకు 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు.
జననాలు
- 1803 సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (మ.1899). భారత్
- 1907 సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931). భారత్
- 1908 వింజమూరి శివరామారావు, ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. (మ.1982).
- 1915 పాల్ సామ్యూల్సన్, ఆర్థికవేత్త (మ.2009).
- 1926 నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు.
- 1938 కె.జమునారాణి,పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది.
- 1961 మీరా అగర్వాల్, రాజకీయ నాయకురాలు.
- 1964 జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి. భారత్
- 1967 మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి. భారత్
- 1968 స్రవంతి ఐతరాజు, కవి, తిరుపతిలో హాస్టల్ సంక్షేమ అధికారి, మనస్తత్వవేత్త.
- 1983 సంతోష్ నారాయణన్ , సంగీత దర్శకుడు,గాయకుడు.
- 1985 అనసూయ భరద్వాజ, టి.వి.వ్యాఖ్యాత, సినిమా నటి.
- 1987 రామ్ (నటుడు), తెలుగు, తమిళ భాషల చిత్రసీమకు సంబంధించిన నటుడు.
మరణాలు
- 1994 ఓం అగర్వాల్, భారత స్నూకర్ క్రీడాకారుడు. భారత్
- 2010 భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923). భారత్
- 2014 మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924).
- 2021 కె.కె.రంగనాథాచార్యులు, సాహితీ చరిత్రకారుడు, కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్ (జ. 1941).
సినిమా
- 1982 'నాలుగు స్తంభాలాట' చిత్రం విడుదలైంది.
- 2025 'అనగనగా' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం.