ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 2010 దగ్గుబాటి వెంకటేష్ మణప్పురం సంస్థకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం చేసుకున్నారు. పూర్తి ప్రస్థానం →

సంఘటనలు

  • 1704 మొదటి వార్తాపత్రిక అమెరికా లోని బోస్టన్ నగరం నుండి ప్రారంభించబడింది.
  • 1967 వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
  • 1970 చైనా పంపిన మొదటి ఉపగ్రహం, డాంగ్ ఫాంగ్ హాంగ్ 1.
  • 1993 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. 110 సంవత్సరాల క్రితం 1882 లో రిపన్ ప్రవేశపెట్టిన "స్థానిక ప్రభుత్వము" అనే ఆలోచన, 84 సంవత్సరాల తరువాత మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యము' వాస్తవంగా అమలు లోకి వచ్చిన రోజు. భారత్
  • 2005 దక్షిణ కొరియాలో క్లోనింగ్ ప్రక్రియ ద్వారా జన్మించిన కుక్క, స్నప్పీ.

జననాలు

  • 1884 విస్సా అప్పారావు, మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో ఒకరు. భారత్
  • 1927 నండూరి రామమోహనరావు, తెలుగు పాత్రికేయుడు, అభ్యుదయవాది, ‘ఆంధ్రజ్యోతి’ పూర్వ సంపాదకుడు. (మ.2011).
  • 1929 రాజ్‌కుమార్, భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (మ.2006). భారత్
  • 1934 ఏడిద నాగేశ్వరరావు, తెలుగు సినిమా నిర్మాత. (మ.2015).
  • 1938 కోవెలమూడి బాపయ్య , తెలుగు, హిందీ, చిత్ర దర్శకుడు.
  • 1941 షరాఫ్ తులసీ రామాచారి , పేరెన్నికగని, వేల కార్టూన్లను పత్రికలలోనూ ప్రచురించాడు.
  • 1945 లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (మ.2020).
  • 1952 చిలుకూరి దేవపుత్ర, ఏకాకి నౌక చప్పుడు, వంకరటింకర ఓ, ఆరుగ్లాసులు ఇత్యాది రచనల రచయిత. (మ.2016) ).
  • 1956 తీజన్‌ బాయి, ఫోక్ సింగర్.
  • 1969 శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, సుప్రసిద్ధ ఖగోళ, జ్యోతిష శాస్త్ర పండితుడు, జ్యోతిష శాస్త్రవేత్తగా, పండితునిగా, పురోహితునిగా ప్రసిద్ధుడు.
  • 1973 సచిన్ టెండుల్కర్, భారత క్రికెట్ ఆటగాడు. భారత్
  • 1985 గజాల , తెలుగు, తమిళ , మళయాళ సినీనటి.

మరణాలు

  • 1999 ఎమ్.వి.రాజమ్మ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలసినిమా నటి, నిర్మాత (జ.1923).
  • 2000 రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త.
  • 2004 జె.వి.సోమయాజులు , సినిమా నటుడు, రంగస్థల నటుడు (జ.1928).
  • 2011 సత్య సాయి బాబా, భారతీయ ఆధ్యాత్మిక గురువు. (జ.1926). భారత్
  • 2015 పందిళ్ళ శేఖర్‌బాబు, రంగస్థల (పౌరాణిక) నటులు, దర్శకులు, నిర్వాహకులైన తెలుగు నాటకరంగంలో పేరొందిన వ్యక్తి. (జ. 1961).
  • 2021 ముక్తి ప్రసాద్ గొగోయ్, అస్సాంకు చెందిన ప్రసూతి వైద్యుడు, రచయిత. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1931). భారత్
  • 2023 గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (జ. 1966).

సినిమా

  • 1980 'ఆటగాడు' చిత్రం విడుదలైంది.
  • 2015 'దోచెయ్' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం.