ఈ రోజు విశేషం
2024 పారిస్ ఒలింపిక్స్కు భారత పతాకధారులలో ఒకరిగా పి.వి. సింధును భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది.
తెలుగు నాట ఈ రోజు
- 1949 వై.ఎస్.రాజశేఖరరెడ్డి జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 2010 వై.ఎస్.రాజశేఖరరెడ్డి గౌరవార్థం కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లాగా మార్చారు. పూర్తి ప్రస్థానం →
- 2024 పారిస్ ఒలింపిక్స్కు భారత పతాకధారులలో ఒకరిగా పి.వి. సింధును భారత ఒలింపిక్ సంఘం ప్రకటించింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1497 వాస్కో డి గామా భారత దేశానికి దారి కనుక్కోవటానికి లిస్బన్ రేవుని వదిలి బయలు దేరాడు. భారత్
- 1954 భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభించాడు. భారత్
- 2008 కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
- 2008 మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
జననాలు
- 1838 జెప్లిన్ విమానం (ఎయిర్ షిప్) నిర్మించిన గ్రాఫ్ వాన్ జెప్లిన్.
- 1851 ఆర్థర్ ఇవాన్స్, ఇంగ్లీషు పురాతత్వ శాస్త్రవేత్త.
- 1898 కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒడిశా గవర్నరుగా ఉన్నత పదవులను అలంకరించారు. భారత్
- 1914 జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. (మ.2010). భారత్
- 1921 ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, పారిశ్రామిక వేత్త, దార్శనికుడు (మ. 2011).
- 1949 వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (మ.2009).
- 1950 రామా చంద్రమౌళి, రాష్ర్టపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్ టీచర్ స్వర్ణపతక పురస్కారాలు పొందారు.
- 1958 నీతూ సింగ్, సినీనటి.
- 1966 రేవతి, భారతీయ సినీనటి. భారత్
- 1969 సుకన్య, దక్షిణ భారత సినిమా నటి. రచయిత, దర్శకురాలు, భరత నాట్య కళాకారిణి. భారత్
- 1969 ఊటుకూరి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ.
- 1972 సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు. భారత్
- 1973 బి.అజయ సారథి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి, మహబూబాబాద్ మున్సిపల్ సిపిఐ ఫ్లోర్ లీడర్, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
- 1983 మీరాచోప్రా, దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
- 1995 మెట్టు అనిల్ కిరణ్, ఏఐయస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, తెలంగాణ.
మరణాలు
- 1822 పెర్సీ షెల్లీ, ఇంగ్లీషు కవి. (జ.1792).
- 1972 పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) యొక్క నాయకుడు ఘసన్ కనాఫానీ.
- 1978 నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (జ.1899).
- 1985 అమెరికా ఆర్థికవేత్త సైమన్ కుజ్నెట్స్.
- 2006 రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1908).
- 2007 భారత మాజీ ప్రధానమంత్రి, చంద్రశేఖర్. భారత్
- 2016 అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్కు చెందిన సంఘసేవకుడు, దాత. (జ.1928).
పండుగలు, జాతీయ దినాలు
- జాతీయ వీడియో గేమ్ దినోత్సవం.