ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

  • 1925 గోదావరి జిల్లా ను, కృష్ణా జిల్లాను విడదీసి, 15 ఏప్రిల్ 1925 తేదిన, పశ్చిమ గోదావరి ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తరువాత, తూర్పు గోదావరి జిల్లాగా పేరు మార్చుకొంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా ఏర్పడింది.విశాఖపట్నం జిల్లా నుంచి, శ్రీకాకుళం జిల్లా 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. విశాఖపట్నం జిల్లా లోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న విజయనగరం జిల్లా ఏర్పడింది. చూడు: [http://eastgodavari.nic.in/ తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్‌సైటు].
  • 1925 బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన మచిలీపట్నం కేంద్రంగా సాగింది. 1794లో కాకినాడ, రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. 1904లో యర్నగూడెం, ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. 1925 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లాను విభజించి పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు తూర్పు గోదావరిగా మారింది) . తరువాత 1942లో పోలవరం తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు. చూడు: పశ్చిమ గోదావరి జిల్లా చూడు: మార్చి 1.
  • 2018 సీ పి యస్ విధానానికి నిరసనతెలుపుటకై తెలంగాణా ఉపాధ్యాయ, ఉద్యోగులు 103 సంఘాల వారు హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కుటుంబాలతో జనజాతర కార్యక్రమాన్ని ఉవ్వెత్తున నిర్వహించారు.

జననాలు

  • 1452 లియొనార్డో డావిన్సి, గణితజ్ఞుడు, ఇంజనీర్, చిత్రకారుడు, శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, వృక్షశాస్త్రజ్ఞుడు, సంగీతకారుడు.
  • 1469 గురునానక్, భారత ఆధ్యాత్మిక గురువు, సిక్కుమత స్థాపకుడు (మ. 1539). భారత్
  • 1707 లియొనార్డ్ ఆయిలర్, స్విష్ గణిత శాస్త్రవేత్త. (మ. 1783).
  • 1806 అలెక్సాండర్ డఫ్, స్కాట్లండుకు చెందిన క్రైస్తవ మిషనరీ. (మ.1878).
  • 1913 కరీముల్లా షా, ముస్లిం సూఫీ, పండితుడు. (జ. 1838).
  • 1932 సుదర్శన్ భట్, మరాఠీ కవి (మ. 2003).
  • 1977 సుదర్శన్ పట్నాయక్, భారత సైకత శిల్పి. భారత్
  • 1992 వందన కటారియా, భారతీయ హాకీ క్రీడాకారిణి. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్

మరణాలు

  • 1845 మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845).
  • 1865 అబ్రహం లింకన్, అమెరికా 16 వ అధ్యక్షుడు. (జ.1809).
  • 1961 రాచాబత్తుని సూర్యనారాయణ, సాతంత్ర్యసమయోధుడు. (జ.1903).
  • 1965 బండారు రామస్వామి, నాట్య కళాకారులు, బంధిఖానా, భక్త రామదాసు, కర్ణుని స్వామిభక్తి, దమయంతి మొదలైన ఏకపాత్రాభినయం రచనలను నిర్వహించారు.
  • 2022 జీ.వి. శ్రీరామరెడ్డి, కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు. (జ.1945). భారత్
  • 2024 ఆర్. ఇంద్ర కుమారి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకురాలు. మాజీ మంత్రిణి. (జ.1950/51). భారత్

సినిమా

  • 1954 'తోడుదొంగలు' చిత్రం విడుదలైంది.
  • 1985 'ముచ్చటగా ముగ్గురు' చిత్రం విడుదలైంది.
  • 1997 'మావా బాగున్నావా?' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం.
  • ప్రపంచ కళా దినోత్సవం.
  • సాంస్కృతిక సార్వత్రిక దినోత్సవం.