ఈ రోజు విశేషం
1987 ఆంధ్రప్రదేశ్ కళావేదిక హైదరాబాదులో ఎల్.వి.ప్రసాద్ను 'ఆంధ్రరత్న' పురస్కారంతో సత్కరించింది.
తెలుగు నాట ఈ రోజు
- 1957 కె.వి.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కళాఖండం మాయాబజార్ విడుదలైంది. పూర్తి ప్రస్థానం →
- 1985 చిరంజీవి, సురేఖ దంపతులకు మద్రాసులో రామ్ చరణ్ జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1987 ఆంధ్రప్రదేశ్ కళావేదిక హైదరాబాదులో ఎల్.వి.ప్రసాద్ను 'ఆంధ్రరత్న' పురస్కారంతో సత్కరించింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1998 ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషధంగా ధ్రువీకరించారు.
- 2008 వికీపీడియాలో 10వ మిలియన్ వ్యాసం వ్రాయబడింది.
- 2022 ముఖేష్ సహాని బీహార్ పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ఆయన్ని కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. భారత్
జననాలు
- 1845 విల్ హెల్మ్ కన్రాడ్ రాంట్ జెన్, ఎక్స్ కిరణాల కిరణాల ఆవిష్కర్త, నోబెల్ బహుమతి గ్రహీత, జననం. (మరణం.1923).
- 1903 హెచ్.వి.బాబు, తెలుగు సినిమా దర్శకుడు. సరస్వతి టాకీస్ అనే చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించి అనేక తెలుగు సినిమాలు నిర్మించాడు.
- 1927 రాజ్ బేగం, మెలోడీ క్వీన్ ఆఫ్ కాశ్మీర్ అని పేరుపొందిన కాశ్మీరీ గాయని. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2016). భారత్
- 1937 రాగిణి , చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి(మ.1976).
- 1985 రాం చరణ్ తేజ, తెలుగు సినిమా కథానాయకుడు.
మరణాలు
- 1868 మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ్ వడయార్. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటీష్ సైన్యం మైసూర్ ను ఒక రాచరిక రాష్ట్రం (ప్రిన్స్లీ స్టేట్) గా మార్చి ఇతడిని 5 ఏళ్ల వయసులో మహారాజుగా నియమించారు. (జ.1794). భారత్
- 1898 సయ్యద్ అహ్మద్ ఖాన్, భారత విద్యావేత్త, రాజకీయవేత్త. (జననం.1817). భారత్
- 1968 యూరీ గగారిన్, అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (జననం.1934).
- 1985 గుత్తికొండ నరహరి, రచయిత, సంపాదకులు, తెలుగు రాజకీయరంగంలో అసమాన వక్త, రాజకీయ విశ్లేషకుడు. (జ.1918).
- 2015 మనుభాయ్ పటేల్, స్వాతంత్ర్య సమరయోధుడు, గాంథేయవాది, గుజరాత్ మాజీ మంత్రి. భారత్
సినిమా
- 1957 'మాయాబజార్' చిత్రం విడుదలైంది.
- 1969 'భలే మాష్టారు' చిత్రం విడుదలైంది.
- 1982 'బంగారు కానుక' చిత్రం విడుదలైంది.
- 1991 'కలికాలం' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ రంగస్థల దినోత్సవం.