ఈ రోజు విశేషం
1961 పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
సంఘటనలు
- 1961 పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
- 1979 కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. భారత్
జననాలు
- క్రీ.పూ. 101/102 - జూలియస్ సీజర్.
- 1904 పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973).
- 1906 పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981).
- 1930 ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991).
- 1933 గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోక్సభ సభ్యుడు. (మ.2017). భారత్
- 1955 నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
- 1957 శ్రీలక్ష్మి రేబాల, నటి, భరతనాట్య కళాకారిణి.
- 1958 ఉప్పలపాటి నారాయణరావు,దర్శకుడు, నిర్మాత, నటుడు.
- 1958 శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు.
- 1977 బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత, ఔత్సాహిక మల్లయోధుడు.
- 1982 ఆచంట శరత్ కమల్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు.1997 nagu babu.
- 1983 సుజిత, టీ.వి.నటి, తెలుగు, తమిళ, మలయాళ నటి.
మరణాలు
- 1803 కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703).
- 1923 కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877).
- 1985 జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923).
- 1988 కట్టా సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు (జ.1940).
- 1994 ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924).
- 1999 రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929). భారత్
- 2012 దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928). భారత్
సినిమా
- 1985 'దాంపత్యం' చిత్రం విడుదలైంది.
- 1994 'ఆలీబాబా అరడజను దొంగలు' చిత్రం విడుదలైంది.
- 2014 'ఐస్ క్రీమ్' చిత్రం విడుదలైంది.
- 2019 'నినువీడని నీడనునేనే' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- కిరిబతి స్వాతంత్ర్యదినం. యునైటెడ్ కింగ్ డం నుంచి 1979 లో స్వాతంత్ర్యం పొందింది. భారత్
- సావొ టోమే, ప్రిన్చిపె దీవుల స్వాతంత్ర్య దినం. పోర్చుగల్ నుంచి 1975 లో స్వాతంత్ర్యం పొందింది. భారత్
- నాదం - మంగోలియా దేశంలో జూలై 11 నుంచి జూలై13 వరకు జాతీయ సెలవు దినాలు (మంగోలియాలో పెద్ద పండుగ వాతావరణం ఉంటుంది). నాదం పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇది రెండవ రోజు. ఈ మూడు రోజులు మంగోలియాలో 3 ఆటలు ఆడతారు. కుస్తీలు, గుర్రపు స్వారి, విలువిద్య. ఇటీవల మంగోలియన్ స్త్రీలు కూడా గుర్రపు స్వారి, విలువిద్య లలో పాల్గొంటున్నారు. ముఖ్యమైన పండుగ మంగోలియా రాజధాని ఉలాన్బాతార్ నగరంలోని జాతీయ కీడా మైదానం (నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం) లో జరుగుతుంది.
- నాబార్డ్ స్థాపక దినోత్సవం.
- తెలంగాణలో మూడవ విడత హరితహారం ప్రారంభం.
- జాతీయ సరళత దినోత్సవం.
- పేపర్ సంచుల దినోత్సవం.
- అంతర్జాతీయ మలాలా దినోత్సవం.