ఆనాడు

ఈ రోజు చరిత్రలో

తెలుగు నాట ఈ రోజు

సంఘటనలు

  • 1829 లండను పోలీసు లకు, జీతం, యూనిఫాం లను అనుమతిస్తూ చేసిన 'ద మెట్రోపాలిటన్ పోలీసు చట్టం' బ్రిటిషు రాజు అనుమతి పొందింది. భారత్
  • 1953 అమెరికా కు చెందిన అణుశక్తి రహస్యాలను సోవియట్ రష్యా కు చేరవేసిన 'జూలియస్', 'ఎథెల్ రోసెన్ బెర్గ్' అనే ఇద్దరిని న్యూయార్క్ నగరంలో శిక్షించారు.
  • 1964 అమెరికా సెనేట్ సివిల్ రైట్స్ చట్టం 1964 ను ఆమోదించింది.
  • 1966 ముంబైలో శివసేన అనే ప్రాంతీయ రాజకీయ పార్టీని స్థాపించారు. భారత్
  • 1989 ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు). భారత్
  • 2009 32 సంవత్సరముల అనంతరం భారతదేశపు ద్రవ్యోల్బణం ఋణాత్మకం (సున్నా కంటే తక్కువ) గా నమోదైనది. భారత్

జననాలు

  • 1623 బ్లేజ్ పాస్కల్, పాస్కల్ సూత్రం కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1662).
  • 1728 రెండవ షా ఆలం, మొఘల్ చక్రవర్తి. (మ.1806).
  • 1928 భద్రిరాజు కృష్ణమూర్తి, ద్రావిడ భాషా పరిశోధకులు, భాషాశాస్త్ర అధ్యాపకులు. (మ.2012).
  • 1939 నూతలపాటి సాంబయ్య, నాటకరంగ ప్రముఖుడు.
  • 1945 నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూకీ జననం.
  • 1970 రాహుల్ గాంధీ, భారత పార్లమెంట్ సభ్యుడు, జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు. భారత్
  • 1977 తెలంగాణ సీఎంవో మాజీ ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ జననం.
  • 1985 కాజల్ అగర్వాల్, భారతీయ చలనచిత్ర నటీమణి. భారత్

మరణాలు

  • 2001 జంధ్యాల, తెలుగు సినిమా దర్శకుడు, మాటల రచయిత. (జ.1951).
  • 2006 ఐరన్ లెగ్ శాస్త్రి , తెలుగు చలన చిత్ర హాస్య నటుడు.
  • 2018 నేరెళ్ళ వేణుమాధవ్, ధ్వన్యనుకరుణ కళాకారుడు, పద్మశ్రీ పురస్కారగ్రహీత (జ.1932).
  • 2019 డి.కె.చౌట భారతదేశ వ్యాపారవేత్త, రచయిత, కళాకారుడు, రంగస్థల నటుడు. (జ.1938). భారత్

సినిమా

  • 1969 'సత్తెకాలపు సత్తెయ్య' చిత్రం విడుదలైంది.
  • 2015 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం విడుదలైంది.