ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 1689 ఇంగ్లాండ్ పార్లమెంట్ ప్రొటెస్టెంట్లకి మతస్వేచ్ఛ గురించి హామీ ఇచ్చింది. భారత్
  • 1726 సారాయి (జిన్/ బ్రాంది) పై పన్ను పెంచినందుకు ప్రజలు తిరగబడి ఆందోళన చేసారు.
  • 1815 ఆస్ట్రేలియా లోని లచ్‌లాన్ నదిని, 'జార్జి ఇవాన్స్' కనుగొన్నాడు.
  • 1830 అమెరికాలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలు ప్రయాణించింది (బాల్టిమోర్, ఎల్లియట్స్ మిల్, మేరీలాండ్).
  • 1844 మొట్టమొదటి టెలిగ్రాఫు సందేశాన్ని శామ్యూల్ మోర్స్ అను శాస్త్రవేత్త వాషింగ్టన్ డీ.సీ. నుండి బాల్టిమోర్ కు ప్రసారము చేశాడు.
  • 1862 లండన్ లోని థేమ్స్ నది మీద 'వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్'ని ప్రారంభించారు.
  • 1875 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ స్కూల్ ను స్థాపించాడు. ఇదే 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్శిటీగా అవతరించింది.
  • 1899 మొట్టమొదటి 'ఆటో రిపేర్ షాపు' బోస్టన్లో మొదలుపెట్టారు.
  • 1902 బ్రిటన్లో మొట్టమొదటి సారిగా 'ఎంపైర్ డే' జరుపుకున్నారు.1959లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు.
  • 1915 థామస్ ఆల్వా ఎడిసన్ టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని కనుగొన్నాడు.
  • 1916 ఆఖరి 'బ్రిటిష్-ఇండియన్ కాంట్రాక్టు' పనివాళ్ళు సురినాంకి వచ్ఛారు. భారత్
  • 1921 ఉత్తర ఐర్లాండ్ తన మొదటి పార్లమెంట్ ని ఎన్నుకొంది. భారత్
  • 1922 నెదర్లాండ్స్లో 1922 'మే' నెలలో చాలా ఎక్కువ వేడి (అత్యధిక ఉష్ణోగ్రత) నమోదైంది (35.6 °C సెంటిగ్రేడ్).
  • 1926 3000 మీటర్ల పరుగు పందెంలో ' పావొ నుర్మి' 8:25.4 (8నిమిషముల 25.4 సెకన్లు) సమయంలో పరిగెట్టి, సరికొత్త రికార్డు స్థాపించాడు.
  • 1930 ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా కు, ఒంటరిగా, 'అమీ జాన్సన్' అనే మహిళ విమానంలో ప్రయాణించింది.
  • 1930 బ్రాడ్‌మాన్ 290 నిమిషాలలో, 29 ఫోర్స్ (నాలుగులు) లలో 252 పరుగులు సాధించాడు (ఆస్ట్రేలియా వెర్సస్ 'సర్రీ' ).
  • 1931 మొట్టమొదటి 'శీతలీకరణ రైలు' ప్రవేశ పెట్టారు (బాల్టిమోర్, ఓహియో రైలు మార్గంలో).
  • 1941 హెచ్.ఎమ్.ఎస్. హుడ్, అనే బ్రిటిష్ యుద్ధనౌకను జర్మనీ యుద్ధనౌక డి.కె.ఎమ్. 'బిస్మార్క్' ముంచివేసింది. 1416 మంది మరణించారు.బ్రతికి బట్ట కట్టిన వారు ముగ్గురే ముగ్గురు. భారత్
  • 1951 అమెరికా 'ఎన్వెటక్' అనేచోట వాతావరణంలో 'అణుపాటవపరీక్ష' ను చేసింది.
  • 1954 భూమి నుంచి 241 కి.మీ (150 మైళ్ళ) పైకి రాకెట్ మొట్ట మొదటిసారిగా వెళ్ళింది (ఎగిరింది). (న్యూమెక్సికో లోని 'వైట్‌సాండ్స్'. ఇది ఎడారి ప్రాంతం).
  • 1954 జర్మన్ ఎయిర్ లైన్స్ లుఫ్తాన్సా పుట్టిన రోజు.
  • 1954 ఐ.బి.ఎమ్. కనుగొన్న, వాక్యూం ట్యూబ్ 'ఎలెక్ట్రానిక్' బ్రెయిన్, ఒక గంటలో 10 మిలియన్ (ఒక కోటి) పనులు (ఆపరేషన్స్) చేయగలదని ప్రకటించింది.
  • 1957 తైవాన్ లోని 'తైపే' లో అమెరికాకు వ్యతిరేకంగా ఆందోళన చేసారు.
  • 1957 కొలంబియాలో భయంకరమైన భూకంపం వచ్చింది.
  • 1959 ఇంగ్లాండ్లో 'ఎంపైర్ డే' పేరు 'కామన్ వెల్త్ డే' గా మార్చారు. 1902లో 'ఎంపైర్ డే' ని మొదటిసారిగా జరుపుకున్నారు.
  • 1961 అమెరికా పంపిన 'ఎక్స్‌ప్లోరర్ (12) ' ఉపగ్రహం భూకక్ష్యను చేరలేక, పడిపోయింది.
  • 1964 పెరు దేశంలోని 'లిమా సాకర్ స్టేడియంలో జరిగిన ప్రమాదంలో 300 మంది మరణించారు.
  • 1972 అమెరికా నెవడా అణు పరీక్ష కేంద్రంలో, అణుబాంబు పేల్చి పరీక్షించింది (అణుపాటవపరీక్ష).
  • 1975 రష్యాకు చెందిన 'సోయుజ్ 18బి' ఇద్దరు రోదసీయాత్రికులను 'సాల్యూట్ 4' 'స్ఫేస్ స్టేషను (రోదసీ కేంద్రం) కి తీసుకువెళ్ళింది.
  • 1977 యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షుడు 'పోడ్‌గొర్నీ' రాజీనామా చేసాడు.
  • 1985 బంగ్లాదేశ్లో వచ్చిన తుఫానుకి 10,000 మంది ప్రజలు మరణించారు.
  • 1988 నిమిషానికి 586 మాటలు మాట్లాడి, 'జాన్ మస్చిట్ట' రికార్డు స్థాపించాడు.
  • 1993 మైక్రోసాఫ్ట్ 'విండోస్ ఎన్.టి' (Windows NT) విడుదల చేసింది.
  • 1999 ఉక్రెయిన్ లో, గని లోపల, 'గాస్' వలన జరిగిన పేలుడు లో, 39 మంది గని కార్మికులు మరణించారు.
  • 2001 షెర్పా తెంబా (టెంబా) త్సెరి, అతి చిన్న వయస్సు (15వ ఏట) లో, ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు.

జననాలు

  • 15 జూలియస్ సీజర్, జెర్మానికస్, రోమ్ దేశపు సైన్యాధిపతి (మ.0019).
  • 1686 'డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్' అతి కచ్చితంగా వేడిని కొలిచే 'థర్మామీటర్' (1714లో మెర్క్యురీ (పాదరసం) థర్మామీటర్) ని కనుగొన్నాడు. 1709 లో ఆల్కహాల్ థర్మామీటర్ ని కనుగొన్నాడు. (మ.1736).
  • 1819 బ్రిటన్ రాణి విక్టోరియా, బ్రిటీషు మహారాణి. (మ.1901). భారత్
  • 1911 ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2006). భారత్
  • 1933 పి.జె.శర్మ, డబ్బింగ్ కళాకారుడు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.2014).
  • 1942 విజయచందర్ , తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత.
  • 1966 జీవిత, చలన చిత్ర నటి, దర్శకురాలు, రాజకీయ నాయకురాలు.
  • 1990 రాగిణి ద్వివేది, దక్షిణ భారత సినీ నటి. భారత్

మరణాలు

  • 1543 నికొలస్ కోపర్నికస్, ఖగోళ పరిశోధకుడు, పోలాండ్లో మరణించాడు.
  • 1964 గాలి పెంచల నరసింహారావు , తొలితరం తెలుగు చలన చిత్ర సంగీత దర్శకుడు(జ.1903).
  • 1997 నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931).
  • 2013 రాయసం వేంకట త్రిపురాంతకేశ్వర రావు, రచయిత, సాహితీ వేత్త. (జ.1928).

సినిమా

  • 1973 'ధనమా దైవమా' చిత్రం విడుదలైంది.
  • 2014 'మనం' చిత్రం విడుదలైంది.
  • 2024 'సి. డి: క్రిమినల్ ఆర్ డెవిల్' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • కామన్వెల్త్ దినోత్సవం.
  • జాతీయ సోదరుల దినోత్సవo.
  • నేషనల్ ఏవియేషన్ మెయింటెనెన్స్ టెక్నీషియన్ డే.
  • జాతీయ ఎస్కార్గోట్ దినోత్సవం.
  • నేషనల్ స్కావెంజర్ హంట్ డే.
  • జాతీయ వ్యోమింగ్ దినోత్సవం.
  • జాతీయ యుకాటన్ రొయ్యల దినోత్సవం.