ఈ రోజు విశేషం
2012 తెలుగు అకాడమీ జాషువా పరిశోధనా కేంద్రం 'జాషువా విశిష్ట సాహిత్య పురస్కారా'న్ని కవి ఎండ్లూరి సుధాకర్కు బహూకరించింది.
తెలుగు నాట ఈ రోజు
- 1895 నవయుగ కవిచక్రవర్తి గుఱ్ఱం జాషువా పల్నాడు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1908 మూసీ నది వరదల వల్ల హైదరాబాదులో భారీగా ఆస్తినష్టం జరిగింది.
- 1954 హైదరాబాదు తూర్పు ప్రాంతంలో వరద దెబ్బతిన్న వంతెనపై నుంచి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి 137 మంది మరణించారు.
- 2012 తెలుగు అకాడమీ జాషువా పరిశోధనా కేంద్రం 'జాషువా విశిష్ట సాహిత్య పురస్కారా'న్ని కవి ఎండ్లూరి సుధాకర్కు బహూకరించింది. పూర్తి ప్రస్థానం →
- 2013 పాలమూరు (మహబూబ్నగర్) పట్టణంలో సుష్మాస్వరాజ్ భారీ "తెలంగాణ ప్రజాగర్జన" బహిరంగ సభ నిర్వహించబడింది.
- 2013 గుఱ్ఱం జాషువా 118వ జన్మతిథి సందర్భంగా తెలుగు అకాడమీ జాషువా పేరిట మూడు సాహిత్య పురస్కారాలు ప్రదానం చేసింది. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1745 బ్రిటన్ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ది కింగ్' మొదటిసారిగా పాడిన రోజు.
- 1837 బహదూర్ షా- II సింహాసనాన్ని అధిష్టించాడు. అతని తండ్రి అక్బర్ షా- II మరణం తరువాత 62 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ చక్రవర్తి అయ్యాడు. భారత్
- 1924 ఢిల్లీలో జరుగుున్న అలర్లు ఆగలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు మహాత్మా గాంధీ. భారత్
- 1928 పెన్సిలిన్ను అనుకోకుండా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొన్నారు.
- 1984 తొలిసారి భారతదేశంలో ఫ్లడ్లైట్స్ క్రింద క్రికెట్ మ్యాచ్ జరిగింది. న్యూ ఢిల్లీలో ఆస్ట్రేలియా ఇండియా నడుమ జరిగిన మ్యాచ్ను ఫ్లడ్లైట్స్ క్రింద ఆడారు. భారత్
- 1985 భారతదేశంలో మొదటిసారి తెరచాప పడవలో భూగోళాన్ని చుట్టే గుఱితో భారతీయ సేన జట్టు బొంబాయి నుండి తృష్ణ అనే చిన్నోడలో బయలుదేరింది. (పూర్తి 10-1-87). భారత్
- 1993 కరకాస్ జాతీయ రహదారి క్రింద గ్యాస్ పైపు పేలి 58 మంది ప్రాణాలు కోల్పోయారు.
- 1996 ఆస్తుల కేసులో సుఖ్ రామ్ తీహార్ జైలుకు పంపబడ్డాడు.
- 2008 అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది. భారత్
- 2016 యూరీలో ఆర్మీ శిబిరంపై ఉగ్రవాదులు దాడులు జరిపినందుకు పగసనదీర్పుగా పాక్ ఆక్రమిత కశ్మీర్పై భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్-2 అనే దాడి జరిపింది. భారత్
జననాలు
- 551 క్రీ.పూ.: కన్ఫ్యూషియస్, కన్ఫ్యూషియస్ మత స్థాపకుడు. (మ.0479 క్రీ.పూ.).
- 1835 షిర్డీ సాయిబాబా, భారతీయ గురువు, సాధువు, ఫకీరు. (మ.1918). భారత్
- 1895 గుర్రం జాషువా, ప తెలుగు కవి. (మ.1971).
- 1907 భగత్ సింగ్, భారత జాతీయోద్యమ నాయకుడు. (మ.1931). భారత్
- 1909 పైడి జైరాజ్, భారత సినీరంగ నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000). భారత్
- 1915 స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి. భారత్
- 1929 లతా మంగేష్కర్, గాన కోకిల. (మ. 2022).
- 1946 మాజిద్ ఖాన్, భారతీయ- పాకిస్థానీయ క్రికెటర్. భారత్
- 1965 కవిత, తెలుగు, తమిళ చిత్రాల నటి.
- 1966 పూరి జగన్నాథ్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత.
- 1969 వేణు మాధవ్, తెలుగు సినీ నటుడు . (2019).
- 1982 అభినవ్ బింద్రా, తొలి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న భారతీయ గురిపందెం ఆటగాడు. భారత్
- 1982 రణబీర్ కపూర్, హిందీ సినీ నటుడు, నిర్మాత. భారత్
మరణాలు
- 1895 లూయీ పాశ్చర్, ప్రఖ్యాత ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. (జ.1822).
- 1940 పండిత్ సుందర్ లాల్ శర్మ, "ఛత్తీస్గఢ్ గాంధీ", స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త (జ.1881). భారత్
- 1968 కూర్మాపు నరసింహం, చిత్రకారుడు.
- 1973 ఆదిరాజు వీరభద్రరావు, తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప భాషా శాస్త్రవేత్త. (జ.1890).
- 1980 రావాడ సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్రానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్. (జ.1911).
- 1991 శంకర్ గుహ నియోగి, ఛత్తీస్గఢ్ కార్మికోద్యమ నాయకుడు.
- 1994 వెల్దుర్తి మాణిక్యరావు, నిజాం వ్యతిరేక పోరాటయోధుడు. (జ.1912).
- 2004 ముల్క్ రాజ్ ఆనంద్, భారతీయ ఆంగ్ల రచయిత. (జ.1905). భారత్
- 2006 ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911). భారత్
- 2007 పీసపాటి నరసింహమూర్తి, రంగస్థల నటుడు. (జ.1920).
సినిమా
- 1972 'కులగౌరవం' చిత్రం విడుదలైంది.
- 2007 'హ్యాపీ డేస్' చిత్రం విడుదలైంది.
- 2015 'మెల్లగా తట్టిందిమనసు తలుపు' చిత్రం విడుదలైంది.
- 2023 'సాలార్' చిత్రం విడుదలైంది.
- 2023 'స్కంద' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం.
- ప్రపంచ రేబీస్ దినోత్సవం.
- గన్నర్స్ డే.
- అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినోత్సవం.
- ప్రపంచ నదుల దినోత్సవం . (సెప్టెంబర్ నెల చివరి ఆదివారం).